ఇంకా చిరంజీవి సెట్లోకి అడిగి పెట్టకుండానే విశ్వంభరకు సంబంధించిన ఇతర వ్యవహారాలు జరిగిపోతున్నాయి. ఓవర్సీస్ హక్కులు 18 కోట్లకు అమ్ముడుపోయినట్టు గత రెండు రోజులుగా వార్త తిరుగుతూనే ఉంది. డిస్ట్రిబ్యూటర్ ఎవరో కన్ఫర్మ్ అయినా ఎంత మొత్తానికి అనేది అధికారికంగా బయటికి చెప్పరు కాబట్టి ప్రస్తుతానికి నిప్పు లేనిదే పొగరాదు తరహాలో ఈ ఫిగర్ నే పరిగణనలోకి తీసుకోవాలి. ఇక విడుదల తేదీకి సంబంధించిన అప్డేట్ కూడా చక్కర్లు కొడుతోంది. 2025 జనవరి 10 రిలీజ్ డేట్ లాక్ చేసుకుని దానికి అనుగుణంగా యువి సంస్థ ప్లాన్ చేసుకుంటోందని సమాచారం.
దీని వెనుక మంచి స్ట్రాటజీ ఉంది. పదో తేదీ శుక్రవారంతో మొదలుపెట్టి పదిహేను కనుమ పండగ దాకా వరసగా సెలవులు వచ్చేస్తాయి. పైగా సంక్రాంతి రేసులో అందరికంటే ముందు వచ్చే అడ్వాంటేజ్ ఎలాగూ ఎక్కువ థియేటర్లు వచ్చేలా చేస్తుంది. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఆకాశమే హద్దుగా చెలరేగిపోవచ్చు. విపరీతమైన ఒత్తిడి మధ్య హనుమాన్ ఈ స్థాయి అరాచకం చేసినప్పుడు ఇక చిరంజీవి లాంటి స్టార్ ఉంటే ఏం జరుగుతుందో వేరే చెప్పనక్కర్లేదు. ఇప్పటిదాకా జరిగిన షూటింగ్ లో కేవలం ఇతర ఆర్టిస్టులు మాత్రమే ఉన్నారు. చిరు ఎంట్రీ ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఉంటుంది.
సుమారు పదమూడు పైగా సెట్లు వేస్తున్నారు. బడ్జెట్ లో అధిక శాతం వీటికే వెళ్తోందని టాక్. తర్వాత విజువల్ ఎఫెక్ట్స్ కి ఇంతకు మించి ఖర్చు పెట్టబోతున్నారు. మొత్తం ప్రొడక్షన్ కలిపి రెండు వందల కోట్ల దాకా అవుతుందని భోగట్టా. యువి క్రియేషన్స్ కి ఇదేమి భారం కాదు కానీ సక్సెస్ అయితే అంతకంతా సులభంగా వెనక్కు వచ్చేస్తుంది. బింబిసార తర్వాత దర్శకుడు వశిష్టకు వచ్చిన మెగా ఆఫర్ కావడంతో ఇంకా బలంగా ఋజువు చేసుకోవడానికి ఇంత కన్నా మంచి ఛాన్స్ దొరకదు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. త్రిషతో పాటు మిగిలిన హీరోయిన్లని ఇంకా ప్రకటించలేదు.
This post was last modified on January 29, 2024 2:02 pm
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉవ్వెత్తున సాగుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు(అసెంబ్లీ+పార్లమెంటు) ప్రశాంతంగా జరిగాయని ఎన్నికలు సంఘం చెబుతోంది. అయితే.. ప్రశాంతత కొన్ని నియోజకవర్గాలకు.. జిల్లాలకు మాత్రమే…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలకు వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన శిల్పా రవికి ప్రచారం…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల అధికార వైఎస్సార్ పార్టీ నేతలు, కార్యకర్తలు దాడులకు పాల్పడ్డ ఉదంతాలు మీడియాలో…
ఎన్నికల అంకం ముగింపుకొస్తున్న తరుణంలో అందరి దృష్టి క్రమంగా సినిమాల వైపు మళ్లుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఎలా…
కీలకమైన నాలుగోదశ ఎన్నికల పోలింగ్ సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవా ల్.. సంచలన ప్రకటన చేశారు.…