యానిమల్ విలన్ బాబీ డియోల్ కు హిందీలో ఏమో కానీ సౌత్ లో మాత్రం విపరీతమైన డిమాండ్ వచ్చేస్తోంది. చాలా కాలంగా సరైన బ్రేక్ లేక బాలీవుడ్ డైరెక్టర్లకే ఛాయస్ కాకుండా పోయిన ఈ సీనియర్ హీరోని ఇప్పుడు దక్షిణాది దర్శకులు కోరిమరీ తీసుకుంటున్నారు. ముందు బోణీ జరిగింది పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుతో. ఔరంగజేబుగా కీలకమైన పాత్ర దక్కింది కానీ కొంత భాగం షూటింగ్ అయ్యాక బ్రేక్ పడింది. జనసేన కార్యకలాపాలు, ఏపీ ఎన్నికల కోసం పవన్ విరామం తీసుకోవడంతో తిరిగి ఎప్పుడు స్టార్ట్ అయ్యేది ఇంకా తెలియదు. ప్రస్తుతానికి బాబీ డేట్స్ ని తనకే తిరిగి ఇచ్చారని టాక్.
సూర్య కంగువాలో తన లుక్ చాలా పవర్ ఫుల్ గా ఉంది. మెయిన్ విలన్ తనేనట. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ ప్యాన్ ఇండియా మూవీని సిరుతై శివ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. వేసవిలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది క్లిక్ అయితే కోలీవుడ్ లో జెండా పాతొచ్చు. తాజాగా బాలకృష్ణ బాబీ కొల్లి కాంబోలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ కి బాబీనే అసలు ప్రతినాయకుడు. క్రూరమైన బందిపోటుగా పవర్ ఫుల్ క్యారెక్టర్ డిజైన్ చేశారట. బాలయ్య బాబీ డియోల్ కు మధ్య జరిగే సన్నివేశాలు ఊహించనంత పీక్స్ లో ఉంటాయని వినికిడి.
కథ ఇక్కడితో అయిపోలేదు. ఇంకా ఆఫర్లు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. చిరంజీవి విశ్వంభర కోసం ట్రై చేస్తున్నారట. అయితే డేట్స్ ఎక్కువ అవసరం ఉండటంతో ఆ మేరకు బాబీ డియోల్ వద్ద కాల్ షీట్లు లేనందు వల్ల గ్యారెంటీగా చెప్పలేమని యూనిట్ టాక్. యానిమల్ లో చేసింది తక్కువ స్పేస్ ఉన్న మూగ పాత్రే అయినా దానికి ప్రేక్షకులు కనెక్ట్ అయిన తీరు మాములుగా లేదు. రన్బీర్ కపూర్ విపరీత హీరోయిజంతో సమానంగా అబ్రార్ క్రూరత్వాన్ని ఎంజాయ్ చేశారు. ఇంకో ఒకటి రెండు హిట్లు పడితే బాబీ డియోల్ కొన్నేళ్లు నిక్షేపంగా హైదరాబాద్ లోనే సెటిల్ కావొచ్చు.
This post was last modified on January 27, 2024 9:23 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…