నిన్న గీత ఆర్ట్స్ బ్యానర్ లో బోయపాటి శీను దర్శకుడిగా అల్లు అరవింద్ కొత్త ప్రాజెక్టు అనౌన్స్ చేయడం ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరిచింది. ఎప్పుడో సరైనోడు టైంలో ఇచ్చిన కమిట్ మెంట్ ఇప్పుడు కార్యరూపం దాలుస్తోంది. అయితే హీరో ఎవరో చెప్పకపోవడంతో ఇది అల్లు అర్జున్ తోనే అయ్యుంటుందని అభిమానులు భావిస్తున్నారు. కానీ దీనికి సంబంధించి ఎలాంటి సాలిడ్ లీక్ బయటికి రాలేదు. ఒకవేళ కాసేపు నిజమే అనుకున్నా బన్నీ ప్లానింగ్ అంతుచిక్కని రీతిలో కనిపిస్తోంది. ప్రస్తుతం పుష్ప 2 ది రూల్ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నా తర్వాత చేయబోయే సినిమాల మీద సస్పెన్స్ కొనసాగుతోంది.
అధికారికంగా అల్లు అర్జున్ కమిట్ మెంట్ ఇచ్చింది ఇద్దరికే. ఒకరు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇది ఆయన రెగ్యులర్ గా డీల్ చేసే ఫ్యామిలీ తరహా సబ్జెక్టు కాదు. ప్యాన్ ఇండియా రేంజ్ లో ఫాంటసీ టచ్ ఉంటుందని గతంలో నిర్మాత నాగవంశీ ఓ సందర్భంలో అన్నారు. కానీ స్క్రిప్ట్ కి చాలా టైం అవసరం కానుంది. మరొకరు సందీప్ రెడ్డి వంగా. యానిమల్ నిర్మాతలు టి సిరీస్ ఆల్రెడీ అడ్వాన్స్ కూడా ఇచ్చారని టాక్. అయితే వంగా ప్రభాస్ స్పిరిట్, యానిమల్ పార్క్ అయ్యాకే బన్నీతో చేతులు కలుపుతాడు. ఈలోగా బన్నీ ఆట్లీతో ఓ సినిమా చేయొచ్చనే ప్రచారం జోరుగా తిరుగుతోంది.
ఇప్పుడు హఠాత్తుగా బోయపాటి శీను వచ్చి చేరారా అనేది వేచి చూడాల్సిన ప్రశ్న. ప్రకటనలో మాస్ కాంబో అన్నారు కానీ హీరో పేరు క్లూ లేకుండా చూసుకున్నారు. పుష్ప తర్వాత కథల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్న అల్లు అర్జున్ ఆ కారణంగానే వేణు శ్రీరామ్ కి ఐకాన్ ఓకే చేసి తర్వాత డ్రాప్ అయ్యాడు. అతను నితిన్ తో తమ్ముడు చేసుకుంటున్నాడు. నిర్మాత దిల్ రాజు సైడయ్యారు. బాలయ్యతో అఖండ 2 తాలూకు న్యూస్ కూడా చక్కర్లు కొడుతోంది. చాలా ఆసక్తికరంగా కనిపిస్తున్నా ఈ కోణాల వెనుక చిక్కుముడి వీడాలంటే ముందు హీరో సంగతి తేలాల్సిందే.
This post was last modified on January 27, 2024 11:08 am
నేచురల్ స్టార్ నాని కెరీర్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం.. ది ప్యారడైజ్. ఇంతకుముందు నానికి ‘దసరా’ రూపంలో కెరీర్…
టాక్సిక్ గురించి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన నడుస్తున్న వేళ ఒక అవసరం లేని టాపిక్ సామజిక మాధ్యమాల్లో ట్రెండ్…
యుఎస్లో పెద్ద పెద్ద స్టార్లను మించి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.. నాని. హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే…
కాంగ్రెస్పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ..పుస్తకం ముద్రణ వ్యవహారం వివాదంగా మారింది.…
ఆగస్ట్ అయిపోతోంది. ఎన్ని సినిమాలు రిలీజైనా ఇరుముడినే క్లియర్ విన్నర్ గా నిలిచి రికార్డుల భరతం పట్టేసింది. విశ్వనాథ్ అండ్…
ఆకస్మిక ప్రచండ వరదలతో అతలాకుతలమైన నేపాల్ తాజాగా ప్రపంచ దేశాలను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. ``భౌతికంగా మీరు మాకు…