నిన్న గీత ఆర్ట్స్ బ్యానర్ లో బోయపాటి శీను దర్శకుడిగా అల్లు అరవింద్ కొత్త ప్రాజెక్టు అనౌన్స్ చేయడం ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరిచింది. ఎప్పుడో సరైనోడు టైంలో ఇచ్చిన కమిట్ మెంట్ ఇప్పుడు కార్యరూపం దాలుస్తోంది. అయితే హీరో ఎవరో చెప్పకపోవడంతో ఇది అల్లు అర్జున్ తోనే అయ్యుంటుందని అభిమానులు భావిస్తున్నారు. కానీ దీనికి సంబంధించి ఎలాంటి సాలిడ్ లీక్ బయటికి రాలేదు. ఒకవేళ కాసేపు నిజమే అనుకున్నా బన్నీ ప్లానింగ్ అంతుచిక్కని రీతిలో కనిపిస్తోంది. ప్రస్తుతం పుష్ప 2 ది రూల్ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నా తర్వాత చేయబోయే సినిమాల మీద సస్పెన్స్ కొనసాగుతోంది.
అధికారికంగా అల్లు అర్జున్ కమిట్ మెంట్ ఇచ్చింది ఇద్దరికే. ఒకరు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇది ఆయన రెగ్యులర్ గా డీల్ చేసే ఫ్యామిలీ తరహా సబ్జెక్టు కాదు. ప్యాన్ ఇండియా రేంజ్ లో ఫాంటసీ టచ్ ఉంటుందని గతంలో నిర్మాత నాగవంశీ ఓ సందర్భంలో అన్నారు. కానీ స్క్రిప్ట్ కి చాలా టైం అవసరం కానుంది. మరొకరు సందీప్ రెడ్డి వంగా. యానిమల్ నిర్మాతలు టి సిరీస్ ఆల్రెడీ అడ్వాన్స్ కూడా ఇచ్చారని టాక్. అయితే వంగా ప్రభాస్ స్పిరిట్, యానిమల్ పార్క్ అయ్యాకే బన్నీతో చేతులు కలుపుతాడు. ఈలోగా బన్నీ ఆట్లీతో ఓ సినిమా చేయొచ్చనే ప్రచారం జోరుగా తిరుగుతోంది.
ఇప్పుడు హఠాత్తుగా బోయపాటి శీను వచ్చి చేరారా అనేది వేచి చూడాల్సిన ప్రశ్న. ప్రకటనలో మాస్ కాంబో అన్నారు కానీ హీరో పేరు క్లూ లేకుండా చూసుకున్నారు. పుష్ప తర్వాత కథల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్న అల్లు అర్జున్ ఆ కారణంగానే వేణు శ్రీరామ్ కి ఐకాన్ ఓకే చేసి తర్వాత డ్రాప్ అయ్యాడు. అతను నితిన్ తో తమ్ముడు చేసుకుంటున్నాడు. నిర్మాత దిల్ రాజు సైడయ్యారు. బాలయ్యతో అఖండ 2 తాలూకు న్యూస్ కూడా చక్కర్లు కొడుతోంది. చాలా ఆసక్తికరంగా కనిపిస్తున్నా ఈ కోణాల వెనుక చిక్కుముడి వీడాలంటే ముందు హీరో సంగతి తేలాల్సిందే.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…