గత డిసెంబర్ ఇరవై రెండున సలార్ తో పాటు విడుదలై కేరళలో సంచలన విజయం నమోదు చేసిన నేరు ఏకంగా వంద కోట్ల దాకా గ్రాస్ రాబట్టడం ఆశ్చర్యపరిచింది. దృశ్యం లాంటి మాస్టర్ పీస్ అందించిన జీతూ జోసెఫ్ దర్శకుడు కావడంతో అంచనాలకు తగ్గట్టు ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యింది. పెద్దగా బడ్జెట్ లేకుండా కేవలం రెండు మూడు లొకేషన్లు, ఒక కోర్టు సెట్, మొత్తం ఒక పాతిక మంది ఆర్టిస్టులతో రెండున్నర గంటలు మెప్పించిన విధానం విమర్శకులను మెప్పించింది. కట్ చేస్తే మొన్నటి నుంచి నేరు చక్కని తెలుగు డబ్బింగ్ తో పాటు హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఒక కళ్ళు లేని అమ్మాయి మీద మానభంగం జరిగితే ఆమెకు అండగా నిలబడే ఒక లాయర్ పోరాటమే ఈ కథ. ఇంటెన్స్ పెర్ఫార్మన్స్ తో నటీనటులు పోటీ పడ్డారు. అయితే దీన్ని తెలుగులో పవన్ కళ్యాణ్ లేదా వెంకటేష్ తో రీమేక్ చేస్తే బాగుంటుందని మలయాళం వెర్షన్ చూసిన వాళ్ళు అభిప్రాయపడ్డారు. దృశ్యం 2 నుంచి వెంకీతో ఉన్న అనుబంధం దృష్ట్యా జీతూ జోసెఫ్ కాల్ చేసి అడిగారట. అయితే సానుకూలంగా స్పందించలేదని తెలిసింది. ఇక పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న కమిట్ మెంట్లు పూర్తి చేయడానికే టైం సరిపోవడం లేదు. కొత్తవి ఒప్పుకునే పరిస్థితి ఎంత మాత్రం లేదు.
చూస్తుంటే ఒక మంచి రీమేక్ చేతులారా వదలేసినట్టు అయ్యింది. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా పూనుకున్నా నేరుని మన ఆడియన్స్ అధిక శాతం చూసేస్తున్నారు. క్లైమాక్స్ లో వచ్చే అసలు ట్విస్టుతో పాటు మొత్తం గుర్తు పెట్టుకుంటారు. అలాంటప్పుడు ఎవరు చేసినా అంత థ్రిల్ ఫీలవ్వరు. సోషల్ మీడియాలో నేరు మీద కాంప్లిమెంట్ల వర్షం కురుస్తోంది. ప్రత్యేకంగా పోస్టులు పడుతున్నాయి. అధిక భాగం సినిమా కోర్టులోనే సాగినా స్క్రీన్ ప్లేతో విసుగు రాకుండా మానేజ్ చేసిన జీతూ జోసెఫ్ మీద ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఏది ఏమైనా తక్కువ బడ్జెట్ లో అయిపోయే క్వాలిటీ కంటెంట్ మిస్ అయినట్టే.
This post was last modified on January 25, 2024 11:49 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…