గత డిసెంబర్ ఇరవై రెండున సలార్ తో పాటు విడుదలై కేరళలో సంచలన విజయం నమోదు చేసిన నేరు ఏకంగా వంద కోట్ల దాకా గ్రాస్ రాబట్టడం ఆశ్చర్యపరిచింది. దృశ్యం లాంటి మాస్టర్ పీస్ అందించిన జీతూ జోసెఫ్ దర్శకుడు కావడంతో అంచనాలకు తగ్గట్టు ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యింది. పెద్దగా బడ్జెట్ లేకుండా కేవలం రెండు మూడు లొకేషన్లు, ఒక కోర్టు సెట్, మొత్తం ఒక పాతిక మంది ఆర్టిస్టులతో రెండున్నర గంటలు మెప్పించిన విధానం విమర్శకులను మెప్పించింది. కట్ చేస్తే మొన్నటి నుంచి నేరు చక్కని తెలుగు డబ్బింగ్ తో పాటు హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఒక కళ్ళు లేని అమ్మాయి మీద మానభంగం జరిగితే ఆమెకు అండగా నిలబడే ఒక లాయర్ పోరాటమే ఈ కథ. ఇంటెన్స్ పెర్ఫార్మన్స్ తో నటీనటులు పోటీ పడ్డారు. అయితే దీన్ని తెలుగులో పవన్ కళ్యాణ్ లేదా వెంకటేష్ తో రీమేక్ చేస్తే బాగుంటుందని మలయాళం వెర్షన్ చూసిన వాళ్ళు అభిప్రాయపడ్డారు. దృశ్యం 2 నుంచి వెంకీతో ఉన్న అనుబంధం దృష్ట్యా జీతూ జోసెఫ్ కాల్ చేసి అడిగారట. అయితే సానుకూలంగా స్పందించలేదని తెలిసింది. ఇక పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న కమిట్ మెంట్లు పూర్తి చేయడానికే టైం సరిపోవడం లేదు. కొత్తవి ఒప్పుకునే పరిస్థితి ఎంత మాత్రం లేదు.
చూస్తుంటే ఒక మంచి రీమేక్ చేతులారా వదలేసినట్టు అయ్యింది. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా పూనుకున్నా నేరుని మన ఆడియన్స్ అధిక శాతం చూసేస్తున్నారు. క్లైమాక్స్ లో వచ్చే అసలు ట్విస్టుతో పాటు మొత్తం గుర్తు పెట్టుకుంటారు. అలాంటప్పుడు ఎవరు చేసినా అంత థ్రిల్ ఫీలవ్వరు. సోషల్ మీడియాలో నేరు మీద కాంప్లిమెంట్ల వర్షం కురుస్తోంది. ప్రత్యేకంగా పోస్టులు పడుతున్నాయి. అధిక భాగం సినిమా కోర్టులోనే సాగినా స్క్రీన్ ప్లేతో విసుగు రాకుండా మానేజ్ చేసిన జీతూ జోసెఫ్ మీద ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఏది ఏమైనా తక్కువ బడ్జెట్ లో అయిపోయే క్వాలిటీ కంటెంట్ మిస్ అయినట్టే.
This post was last modified on January 25, 2024 11:49 pm
తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…
టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…
బాలీవుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిన హీరో రణ్వీర్ సింగ్ విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాడు. దురంధర్ 2 తర్వాత…
ఇరు తెలుగు రాష్ట్రాలకు 'సర్' వస్తున్నారు.. దేశవ్యాప్తంగా ఓటరు జాబితాలను సమగ్రంగా పరిశీలించేందుకు భారత ఎన్నికల సంఘం ‘స్పెషల్ ఇంటెన్సివ్…
టీ20 వరల్డ్ కప్ 2026 లీగ్ దశ ముగిసి అసలైన మజా మొదలవ్వబోతోంది. ఈసారి సూపర్ 8 గ్రూపులు ఫైనల్…
హైదరాబాద్ నగరంలోని అమీర్పేట మైత్రీవనం చౌరస్తా వద్ద ఉన్న ఆదిత్య ఎన్క్లేవ్ భవనంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.…