ప్యాన్ ఇండియా పరిధి పెరిగాక అగ్ర నిర్మాతల ప్లాన్లు మారిపోతున్నాయి. ఒక సినిమా తీసి వివిధ భాషల్లో డబ్బింగ్ చేస్తే సరిపోతుందని అనుకోవడం లేదు. పక్క రాష్ట్రాల స్టార్లతో ప్రాజెక్టులు సెట్ చేసుకుని బిజినెస్ రేంజ్ ని పెంచుకునే పనిలో పడ్డారు. గత ఏడాది దిల్ రాజు దీనికి శ్రీకారం చుట్టి విజయ్ వరిసు(వారసుడు) తో రికార్డు స్థాయిలో బిజినెస్ చేసుకున్నారు. కంటెంట్ ఏ రేంజ్ లో మెప్పించిందనేది పక్కన పెడితే హీరో ఇమేజ్ పుణ్యమాని మంచి లాభాలు చూడటమే కాక ఎస్విసి బ్యానర్ కో గుర్తింపు తెచ్చుకున్నారు. గేమ్ ఛేంజర్ వ్యాపారానికి చెన్నైని కేంద్రంగా మార్చబోతున్నారు.
మైత్రి మూవీ మేకర్స్ ఆల్రెడీ అజిత్ తో ఓకే చేయించుకుంది. అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ ఇవ్వలేదు కానీ ఒప్పందం జరిగిపోయింది. ఇప్పటిదాకా అజిత్ కెరీర్ లోనే అత్యధిక రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్టు చెన్నై రిపోర్ట్. ఎంతనేది ఏదో ఒక రూపంలో త్వరలోనే బయటికి వస్తుంది. దర్శకుడిగా మార్క్ ఆంటోనీ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దాదాపు లాక్ అయినట్టే. హైదరాబాద్ తరహాలోనే చెన్నైలోనూ మైత్రి ఒక ఆఫీస్ పెట్టేసుకున్నారు. ధనుష్ సార్ తో సితార అడుగు పూర్తయ్యింది. ఈ లిస్టులో డివివి దానయ్య చేరబోతున్నట్టు లేటెస్ట్ అప్డేట్. విజయ్ తో ఒక భారీ చిత్రాన్ని ప్లాన్ చేసుకుని ఆ మేరకు అడ్వాన్స్ ఇచ్చేందుకు ఒప్పించారట.
డైరెక్టర్ ఇతరత్రా వివరాలు ఇంకా బయటికి రాలేదు. ప్రస్తుతం విజయ్ దర్శకుడు వెంకట్ ప్రభుతో గోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత బ్రేక్ ఇచ్చి రాజకీయాల్లోకి అడుగు పెడతారనే ప్రచారం ఉత్తిదేనట. అలాంటి ఆలోచన ఏదైనా ఉన్నా ఇంకో రెండు సినిమాలు వేగంగా చేయాలనే ప్లాన్ లో విజయ్ ఉన్నట్టు తెలిసింది. ఆయన ప్రొడ్యూసర్స్ లిస్టు దానయ్యకు చోటు దక్కిందట. ఆర్ఆర్ఆర్, ఓజి లాంటి క్రేజీ సినిమాల నిర్మాతగా అయన అడిగితే కాదంటారా. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఆల్రెడీ కమెడియన్ సంతానంతో ఒక సినిమా పూర్తి చేసి విడుదలకు రెడీ అయ్యింది. ఈ లిస్టు ఇంకా పెరిగేలా ఉంది.
This post was last modified on January 23, 2024 10:21 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…