వేణు స్వామి అని ఒక జ్యోతిష్యుడు సోషల్ మీడియాలో బాగా పాపులర్. చాలా కాన్ఫిడెంట్ గా అందరి జాతకాల గురించి స్టేట్మెంట్లు ఇచ్చేస్తుంటాడు ఈయన. తెలంగాణ ఎన్నికల్లో మళ్లీ టిఆర్ఎస్ గెలుస్తుందని.. వన్డే ప్రపంచకప్ లో ఇండియన్ టీందే విజయం అని చెప్పిన పెద్దమనిషి ఈయనే. గతంలో ఆయన అంచనా వేసిన విషయాల్లో కొన్ని నిజమైన మాట వాస్తవం. కానీ అంతకుమించి ఫెయిల్ అయ్యాయి. ఇది పట్టించుకోకుండా వేణు స్వామి చెప్పిన విషయాలను బట్టి ప్రభావితం అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు.
ఆ మధ్య ఈ వేణు స్వామి హీరో ప్రభాస్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ప్రభాస్ జీవితంలో బాహుబలితోనే మహర్దశ అయిపోయిందని.. ఇంకెప్పటికీ ఆయన పెద్ద హిట్ కొట్టలేడని.. అలాగే ప్రభాస్ కు ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చేసాడు వేణు స్వామి. ఈ విషయమై ప్రభాస్ అభిమానులు కొంత కంగారు పడ్డారు. కట్ చేస్తే సలార్ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ప్రభాస్ చాలా ఆరోగ్యంగానే కనిపిస్తున్నాడు.
వేణు స్వామి వ్యాఖ్యలు ప్రభాస్ కుటుంబ సభ్యులను కూడా బాధించిన విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి వేణు స్వామి జ్యోతిష్యం గురించి మాట్లాడింది. ప్రభాస్ ఆరోగ్యం, కెరీర్ గురించి అతను చేసిన వ్యాఖ్యలను ఆమె తప్పు పట్టారు. ఈ కామెంట్ల గురించి కొందరు తన దృష్టికి తెచ్చారని.. తనతో పాటు కుటుంబ సభ్యులు కొంచెం బాధ కలిగిందని ఆమె చెప్పారు.
అయితే ప్రభాస్ జాతకం వాళ్ళ అమ్మగారికి మాత్రమే తెలుసని, తనకు కూడా తెలియదని.. అలాంటప్పుడు వేణు స్వామి ఎలా మాట్లాడతాడని ఆమె ప్రశ్నించారు. ఇలాంటివి పట్టించుకోవద్దని అభిమానులకు ఆమె విన్నవించారు. ప్రభాస్ విషయంలో అంతా బాగుందని ఆమె అన్నారు.
This post was last modified on January 23, 2024 10:13 pm
నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…
మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…