Movie News

ఆదిపురుష్ గాయం ‘హనుమాన్’తో మాయం

కొన్ని బాక్సాఫీస్ విచిత్రాలు కాకతాళీయమైనా సరే భలే అనిపిస్తాయి. అలాంటిదే ఇది. గత ఏడాది ఆదిపురుష్ ని నైజామ్ లో మైత్రి సంస్థ పంపిణి చేసింది. భారీ అంచనాలు ఉండటంతో పాటు ప్రభాస్ ఇమేజ్, రామాయణం సెంటిమెంట్ కనకవర్షం కురిపిస్తాయని నమ్మి పోటీకి వెళ్లి మరీ హక్కులు కొన్నారు. ఒకదశ వరకు దిల్ రాజు రేస్ లో ఉండి తర్వాత రేటు చూసి డ్రాపయ్యారు. తీరా చూస్తే అంత ప్యాన్ ఇండియా మూవీ ఫ్లాప్ కావడం దెబ్బ కొట్టింది. ఓపెనింగ్స్ గ్రాండ్ గా వచ్చినా టాక్ వాటిని నిలబెట్టలేదు. ఫలితంగా ఒక్క ఆ ఏరియా నుంచే పన్నెండు కోట్లకు పైగా నష్టం వచ్చిందని ట్రేడ్ టాక్.

ఇప్పుడది మైత్రికి పూర్తిగా తీరిపోయింది.హనుమాన్ టికెట్ కౌంటర్లు లాభాల సునామిలో మునిగి తేలడంతో మైత్రి మేకర్స్ జాక్ పాట్ కొట్టారు. విడుదల రోజు డిస్ట్రిబ్యూషన్ పరంగా హనుమాన్ ఎన్ని ఇబ్బందులు పడిందో చూశాం. ఫస్ట్ డే హైదరాబాద్ మొత్తం నాలుగు సింగల్ స్క్రీన్లు ఇచ్చారు. మల్టీప్లెక్సుల షోలు అధికంగా గుంటూరు కారంకు వెళ్లాయి. ఏషియన్ ఫిలింస్ తో తలెత్తిన సమస్య వల్ల సకాలంలో వాళ్ళ థియేటర్లు ఇవ్వలేకపోయినా తర్వాత సద్దుమణిగింది. రివర్స్ లో తేజ సజ్జ కౌంట్ పెరిగి మహేష్ బాబువి తగ్గడం మొదలయ్యాయి. దీంతో హనుమాన్ బంగారు గుడ్లు పెట్టే బాతుగా మారిపోయింది.

కొన్న ప్రతిఒక్కరికి రూపాయికి కనీసం అయిదు రూపాయల లాభం ఇచ్చే దిశగా హనుమాన్ దూసుకుపోతోంది. సుమారు ఏడు కోట్లకు కొంచెం అటు ఇటుగా నైజామ్ థియేట్రికల్ రైట్స్ అమ్మితే పది రోజులకే షేర్ ఇరవై ఆరు కోట్లు దాటడం మాములు సంచలనం కాదు. ఇంకా ఫైనల్ రన్ అవ్వలేదు. ఫిబ్రవరి తొమ్మిది దాకా నెమ్మదించడం కష్టమేనని బయ్యర్ల మాట. దీనికి ధీటుగా కంటెంట్ ఉన్న కొత్త రిలీజ్ ఏవీ అప్పటిదాకా లేకపోవడం ప్లస్ అవుతోంది. ట్విస్ట్ ఏంటంటే తెలుగు రాష్ట్రాల మొత్తం బిజినెస్ ఒక నైజామ్ లోనే వసూలు కావడం. హనుమాన్ దెబ్బా మజాకాని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.

This post was last modified on January 23, 2024 11:57 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

1 hour ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

4 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago