వివాదాస్పద అంశాల పట్ల టిడిపి నేత నారా లోకేష్ లేవనెత్తిన చట్టపరమైన అభ్యంతరం వల్ల విడుదల ఆగిపోయిన రాంగోపాల్ వర్మ వ్యూహాన్ని నేషనల్ బోర్డ్ ఫర్ ఫిలిం సర్టిఫికేషన్ కు పంపుతూ తెలంగాణ కోర్టు తీర్పు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. మూడు వారాల గడువు ఇస్తూ సినిమా చూసి రివ్యూ కమిటీ రికమండేషన్లను అడుగుతూ కేసుని వాయిదా వేసింది. ఎన్నికల లోపే రిలీజ్ చేయాలని పట్టుదలగా ఉన్న వర్మ కోరిక నెరవేరే సూచనలు క్రమంగా తగ్గిపోతున్నాయి. రాజకీయ అజెండాతో రూపొందిన వ్యూహంలో ప్రతిపక్ష నాయకులను దారుణంగా చూపించారనే అభియోగం మీద వ్యూహం ఆగింది.
ఎంతలేదన్నా రివ్యూ కమిటీ రిపోర్ట్ వచ్చే లోపు ఫిబ్రవరి చివరి వారం అవుతుంది. ఒకవేళ అందులో సానుకూల వ్యతిరేక అంశాలు ఏమున్నా వాటిని తిరిగి సవరించుకుని కొత్త కాపీని సమర్పించేలోపు పుణ్యకాలం గడిచిపోతుంది. ఈలోగా ఎన్నికలు దగ్గరపడతాయి. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని కోర్టు మళ్ళీ వాయిదా వేసే అవకాశాన్ని కొట్టిపారేయలేం. ఒకవేళ అదే జరిగితే ఎలక్షన్ రిజల్ట్ వచ్చాకే వ్యూహంకి మోక్షం కలుగుతుంది. దాని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే జగన్ కు అనుకూలత కోసమే సినిమా తీసిన రాంగోపాల్ వర్మ ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోలేడు.
సో ఇంకో నెల రోజులు ఆగితే కానీ ఈ సస్పెన్స్ తీరేలా లేదు. ఇంచుమించు ఇదే కథతో రూపొందుతున్న యాత్ర 2 మీద ఈ తరహా అభ్యంతరాలు రావడం లేదు. దర్శకుడు మహి వి రాఘవ్ ఒకటి రెండు పాత్రలు తప్ప కాంట్రావర్సికి తావిచ్చే ఎలాంటి అంశాలు జోడించలేదని ట్రైలర్ లోనే చూపించారు. జగన్ కి ఎమోషనల్ ఎలివేషన్లు ఇచ్చేలా కథ రాసుకుని దానికి అనుగుణంగానే ప్రెజెంట్ చేయబోతున్నాడు. ఇప్పటికైతే యాత్ర 2 గురించి ఎలాంటి అబ్జెక్షన్లు రాలేదు. వర్మ వ్యూహం సంగతి ఇలా ఉంటే దీని సీక్వెల్ శపథంకి ఇదే సమస్య రావొచ్చు. ఇలా అయితే నెలల తరబడి ఎదురు చూడాల్సిందే.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…