వివాదాస్పద అంశాల పట్ల టిడిపి నేత నారా లోకేష్ లేవనెత్తిన చట్టపరమైన అభ్యంతరం వల్ల విడుదల ఆగిపోయిన రాంగోపాల్ వర్మ వ్యూహాన్ని నేషనల్ బోర్డ్ ఫర్ ఫిలిం సర్టిఫికేషన్ కు పంపుతూ తెలంగాణ కోర్టు తీర్పు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. మూడు వారాల గడువు ఇస్తూ సినిమా చూసి రివ్యూ కమిటీ రికమండేషన్లను అడుగుతూ కేసుని వాయిదా వేసింది. ఎన్నికల లోపే రిలీజ్ చేయాలని పట్టుదలగా ఉన్న వర్మ కోరిక నెరవేరే సూచనలు క్రమంగా తగ్గిపోతున్నాయి. రాజకీయ అజెండాతో రూపొందిన వ్యూహంలో ప్రతిపక్ష నాయకులను దారుణంగా చూపించారనే అభియోగం మీద వ్యూహం ఆగింది.
ఎంతలేదన్నా రివ్యూ కమిటీ రిపోర్ట్ వచ్చే లోపు ఫిబ్రవరి చివరి వారం అవుతుంది. ఒకవేళ అందులో సానుకూల వ్యతిరేక అంశాలు ఏమున్నా వాటిని తిరిగి సవరించుకుని కొత్త కాపీని సమర్పించేలోపు పుణ్యకాలం గడిచిపోతుంది. ఈలోగా ఎన్నికలు దగ్గరపడతాయి. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని కోర్టు మళ్ళీ వాయిదా వేసే అవకాశాన్ని కొట్టిపారేయలేం. ఒకవేళ అదే జరిగితే ఎలక్షన్ రిజల్ట్ వచ్చాకే వ్యూహంకి మోక్షం కలుగుతుంది. దాని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే జగన్ కు అనుకూలత కోసమే సినిమా తీసిన రాంగోపాల్ వర్మ ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోలేడు.
సో ఇంకో నెల రోజులు ఆగితే కానీ ఈ సస్పెన్స్ తీరేలా లేదు. ఇంచుమించు ఇదే కథతో రూపొందుతున్న యాత్ర 2 మీద ఈ తరహా అభ్యంతరాలు రావడం లేదు. దర్శకుడు మహి వి రాఘవ్ ఒకటి రెండు పాత్రలు తప్ప కాంట్రావర్సికి తావిచ్చే ఎలాంటి అంశాలు జోడించలేదని ట్రైలర్ లోనే చూపించారు. జగన్ కి ఎమోషనల్ ఎలివేషన్లు ఇచ్చేలా కథ రాసుకుని దానికి అనుగుణంగానే ప్రెజెంట్ చేయబోతున్నాడు. ఇప్పటికైతే యాత్ర 2 గురించి ఎలాంటి అబ్జెక్షన్లు రాలేదు. వర్మ వ్యూహం సంగతి ఇలా ఉంటే దీని సీక్వెల్ శపథంకి ఇదే సమస్య రావొచ్చు. ఇలా అయితే నెలల తరబడి ఎదురు చూడాల్సిందే.
This post was last modified on January 22, 2024 3:26 pm
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అంచనాలకు మించి ఆడేస్తోంది. మరీ జవాన్, పఠాన్ రేంజులో కాదు కానీ రణ్వీర్…
గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…
కటక్లో జరిగిన టీ20 మ్యాచ్లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…
అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రాన్ని త్వరలోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్లుగా విభజించుకుని అభివృద్ధి…
బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు…