స్టార్ క్యాస్టింగ్ లేకుండా అప్ కమింగ్ హీరోతో దర్శకుడు అనుదీప్ తీసిన జాతిరత్నాలు ఎంత సంచలన విజయం సాధించిందో గుర్తే. కేవలం పదకొండు కోట్లకు థియేట్రికల్ బిజినెస్ చేస్తే ముప్పై కోట్లకు పైగా షేర్ రాబట్టడం సెన్సేషన్. అందుకే తమిళ హీరో శివ కార్తికేయన్ పిలిచి మరీ ప్రిన్స్ ఇచ్చాడు. అది ఆశించిన విజయం సాధించలేదు. ఒకవేళ తాను కాకుండా ఎవరైనా ఇమేజ్ లేని వాళ్ళు చేసుంటే పెద్ద విజయం సాధించేదని అయలాన్ ప్రమోషన్లలో హీరోనే చెప్పడం చూస్తే కంటెంట్ ఫెయిల్ కాలేదనే అభిప్రాయం అభిమానుల్లో ఉంది. అనుదీప్ ఇప్పుడు మాస్ రూటు పట్టబోతున్నాడు.
మాస్ మహారాజా రవితేజతో ఒక కథ చెప్పి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నట్టు వచ్చిన వార్త గట్టిగానే చక్కర్లు కొడుతోంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో జనవరి 26 హీరో పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా ప్రకటించే అవకాశముందని ఇన్ సైడ్ టాక్. సప్తసాగరాలు దాటి సైడ్ ఏబి తెలుగులో పెద్దగా ఆడకపోయినా ప్రేక్షకుల దృష్టిలో పడ్డ రుక్మిణి వసంత్ ని ఇందులో హీరోయిన్ గా లాక్ చేశారనే ప్రచారం ఊపందుకుంది. దాదాపు కన్ఫర్మ్ అయినట్టేనట. కొన్ని నెలల క్రితమే ఆమెకు అడ్వాన్స్ ఇచ్చిన సితార ఫైనల్ గా ఈ ప్రాజెక్టుకి ఓకే చేయించుకుందని తెలిసింది.
అనుదీప్ కి ఇది పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఆ మధ్య వెంకటేష్ తో సినిమా చేయి దాకా వచ్చి చేజారింది. అనౌన్స్ మెంట్ రాలేదు కానీ అంతర్గతంగా చర్చలు జరిగిన మాట వాస్తవం. స్క్రిప్ట్ విషయంలో మెప్పించలేకపోవడంతో అది పెండింగ్ లో పడిందట. జాతిరత్నాలు 2 తీసే ఆలోచన జరిగింది కానీ నవీన్ పోలిశెట్టి అంతగా ఆసక్తి చూపించకపోవడం వల్ల అదీ ప్రాధమిక దశలోనే ఆగింది. ఇన్ని సవాళ్లు దాటుకుని వచ్చిన అనుదీప్ సరైన రీతీలో రవితేజ కామెడీ టైమింగ్ ప్లస్ మాస్ ని వాడుకుంటే స్టార్ లీగ్ లోకి దూసుకుపోవచ్చు. మాస్ ప్రయత్నంలో విజయం దక్కడమంటే సులభం కాదు.
This post was last modified on January 21, 2024 10:05 pm
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అంచనాలకు మించి ఆడేస్తోంది. మరీ జవాన్, పఠాన్ రేంజులో కాదు కానీ రణ్వీర్…
గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…
కటక్లో జరిగిన టీ20 మ్యాచ్లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…
అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రాన్ని త్వరలోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్లుగా విభజించుకుని అభివృద్ధి…
బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు…