స్టార్ క్యాస్టింగ్ లేకుండా అప్ కమింగ్ హీరోతో దర్శకుడు అనుదీప్ తీసిన జాతిరత్నాలు ఎంత సంచలన విజయం సాధించిందో గుర్తే. కేవలం పదకొండు కోట్లకు థియేట్రికల్ బిజినెస్ చేస్తే ముప్పై కోట్లకు పైగా షేర్ రాబట్టడం సెన్సేషన్. అందుకే తమిళ హీరో శివ కార్తికేయన్ పిలిచి మరీ ప్రిన్స్ ఇచ్చాడు. అది ఆశించిన విజయం సాధించలేదు. ఒకవేళ తాను కాకుండా ఎవరైనా ఇమేజ్ లేని వాళ్ళు చేసుంటే పెద్ద విజయం సాధించేదని అయలాన్ ప్రమోషన్లలో హీరోనే చెప్పడం చూస్తే కంటెంట్ ఫెయిల్ కాలేదనే అభిప్రాయం అభిమానుల్లో ఉంది. అనుదీప్ ఇప్పుడు మాస్ రూటు పట్టబోతున్నాడు.
మాస్ మహారాజా రవితేజతో ఒక కథ చెప్పి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నట్టు వచ్చిన వార్త గట్టిగానే చక్కర్లు కొడుతోంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో జనవరి 26 హీరో పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా ప్రకటించే అవకాశముందని ఇన్ సైడ్ టాక్. సప్తసాగరాలు దాటి సైడ్ ఏబి తెలుగులో పెద్దగా ఆడకపోయినా ప్రేక్షకుల దృష్టిలో పడ్డ రుక్మిణి వసంత్ ని ఇందులో హీరోయిన్ గా లాక్ చేశారనే ప్రచారం ఊపందుకుంది. దాదాపు కన్ఫర్మ్ అయినట్టేనట. కొన్ని నెలల క్రితమే ఆమెకు అడ్వాన్స్ ఇచ్చిన సితార ఫైనల్ గా ఈ ప్రాజెక్టుకి ఓకే చేయించుకుందని తెలిసింది.
అనుదీప్ కి ఇది పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఆ మధ్య వెంకటేష్ తో సినిమా చేయి దాకా వచ్చి చేజారింది. అనౌన్స్ మెంట్ రాలేదు కానీ అంతర్గతంగా చర్చలు జరిగిన మాట వాస్తవం. స్క్రిప్ట్ విషయంలో మెప్పించలేకపోవడంతో అది పెండింగ్ లో పడిందట. జాతిరత్నాలు 2 తీసే ఆలోచన జరిగింది కానీ నవీన్ పోలిశెట్టి అంతగా ఆసక్తి చూపించకపోవడం వల్ల అదీ ప్రాధమిక దశలోనే ఆగింది. ఇన్ని సవాళ్లు దాటుకుని వచ్చిన అనుదీప్ సరైన రీతీలో రవితేజ కామెడీ టైమింగ్ ప్లస్ మాస్ ని వాడుకుంటే స్టార్ లీగ్ లోకి దూసుకుపోవచ్చు. మాస్ ప్రయత్నంలో విజయం దక్కడమంటే సులభం కాదు.
This post was last modified on January 21, 2024 10:05 pm
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…