Movie News

పెద్దాయన మూవీని ప్రేక్షకులు పట్టించుకోలేదు

బయోపిక్స్ రొటీన్ గా మారుతున్న ట్రెండ్ లో మాజీ ప్రధాని, బిజెపి పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన అటల్ బిహారి వాజ్ పేయ్ గారి కథ తెరకెక్కడం మొన్న రిలీజైపోవడం జరిగాయి. మిర్జాపూర్ ఫేమ్ పంకజ్ త్రిపాఠి టైటిల్ రోల్ పోషించగా మరాఠిలో చాలా పేరున్న రవి జాదవ్ దర్శకత్వం వహించారు. దేశంలో అధిక రాష్ట్రాల్లో కేంద్ర అధికార పార్టీ హవా నడుస్తున్న ట్రెండ్ లో ఈ సినిమాకు మంచి స్పందన వస్తుందని రాజకీయ వర్గాలు అంచనా వేశాయి. అయితే పబ్లిక్ దీని మీద ఏమంత ఆసక్తి చూపించడం లేదని వసూళ్లు తేటతెల్లం చేస్తున్నాయి. రెస్పాన్స్ చాలా వీక్ గా ఉంది.

వాజ్ పాయ్ జీవితాన్ని మొత్తం రెండున్నర గంటల్లో చూపించే ప్రయత్నం చేసిన రవి జాదవ్ ముఖ్యమైన ఘట్టాలన్నీ కవర్ చేశారు. కార్గిల్ యుద్ధం, పోక్రాన్ ప్రయోగాలు, గవర్నమెంట్ మైనారిటీలో పడే ప్రమాదం ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు, అద్వానీతో స్నేహం, ప్రతిపక్షాలను తెలివిగా ఎదురుకున్న తీరు అన్నీ ఉన్నాయి. అయితే తగినంత డ్రామా లేకుండా కేవలం సంఘటనలు చూపించడానికి స్క్రీన్ ప్లే వాడుకోవడంతో సినిమాటిక్ ఫ్లేవర్ తగ్గిపోయి డాక్యుమెంటరీ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. పంకజ్ త్రిపాఠి ఎంత అద్భుతంగా నటించినా కంటెంట్ బాగా తడబడింది.

దేశమంతా రామాలయ ప్రారంభం హడావిడిలో ఉండటం మై హూ అటల్ వెనుకబడేందుకు మరో కారణం అయ్యింది. నిర్మాతలు మాత్రం ఎంతో ఆశించారు కానీ దానికి తగ్గ ఫలితమైతే వచ్చేలా లేదు. అయినా సాక్ష్యాత్తు ప్రస్తుత ప్రధాని మీద వివేక్ ఒబెరాయ్ లాంటి ఆర్టిస్టుని పెట్టి బయోపిక్ తీస్తేనే జనాలు లైట్ తీసుకున్నారు. అలాంటిది ఇప్పటి తరానికి అంతగా అవగాహన లేని పెద్దాయన గురించి చెప్పడం సముద్రంలో నీళ్లు పోసి వాటినే వెనక్కు తీసే ప్రయత్నం లాంటిది. గతంలో బాల్ థాకరే కథని నవాజుద్దీన్ సిద్ధిక్ తో తీస్తే పట్టుమని వారం కూడా ఆడక డిజాస్టర్ అయ్యింది.

This post was last modified on January 21, 2024 10:04 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దురంధర్ భామకు దశ తిరుగుతోంది

ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అంచనాలకు మించి ఆడేస్తోంది. మరీ జవాన్, పఠాన్ రేంజులో కాదు కానీ రణ్వీర్…

1 hour ago

అఖండ-2… కొత్త హైప్… కొత్త ట్రైలర్?

గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…

2 hours ago

సూర్య, గిల్‌.. ఒక్క రోజు హిట్టు.. పది రోజులు ఫట్టు

కటక్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…

3 hours ago

నాగార్జున మీద రీసెర్చ్ చేయాలన్న సేతుపతి

అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…

3 hours ago

రాష్ట్రంలో జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్‌లు

ఏపీ సీఎం చంద్ర‌బాబు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రాన్ని త్వ‌ర‌లోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్‌లుగా విభజించుకుని అభివృద్ధి…

3 hours ago

మోగ్లీకి ఊహించని పరీక్ష

బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు…

4 hours ago