గత ఏడాది పెద్దగా అంచనాలు లేకుండా అవి రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయింది సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా జైలర్. సినిమా చూసిన వాళ్ళందరూ యావరేజ్ అని అన్నారు కానీ.. ఆ చిత్రానికి అన్నీ కలిసి వచ్చి ఎవరు ఊహించని విజయం సాధించింది. తమిళనాట దాదాపుగా అన్ని కలెక్షన్ల రికార్డులను జైలర్ బద్దలు కొట్టేసింది. ఈ రోజుల్లో ఏ సినిమా పెద్ద హిట్ అయినా దానికి సీక్వెల్ ఆశిస్తున్నారు అభిమానులు. జైలర్ విషయంలో రజినీ అభిమానులు కూడా అందుకు మినహాయింపు కాదు. వారి కోరికను తీర్చేయబోతున్నాడు దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్.
జైలర్-2కు సంబంధించి ఇప్పటికే అతను స్క్రిప్ట్ దాదాపుగా రెడీ చేసేశాడట. జైలర్ తర్వాత ఏ సినిమా కమిట్ కాని నెల్సన్.. దీని సీక్వెల్ మీదే దృష్టి పెట్టినట్టు సమాచారం. నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ కూడా సీక్వెల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలిసింది. రజనీ కూడా సీక్వెల్ చేయడానికి రెడీనే కానీ.. కాకపోతే ఆయన అందుబాటులోకి రావడానికి చాలా టైం పడుతుంది.
ప్రస్తుతం సూపర్ స్టార్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. లాల్ సలాం చిత్రాన్ని పూర్తిచేసిన ఆయన ప్రస్తుతం వేటగన్ అనే సినిమాలో నటిస్తున్నాడు. దీని తర్వాత లోకేష్ కనకరాజ్ చిత్రంలో నటించాల్సి ఉంది. అది అయ్యాక జైలర్-2ను మొదలుపెట్టొచ్చు. మరి నెల్సన్ అంతవరకు ఆగుతాడా.. లేక ఈలోపు వేరే సినిమా ఏమైనా చేస్తాడా అన్నది చూడాలి.
ఏదేమైనప్పటికీ నెల్సన్- రజిని కాంబినేషన్లో జైలర్-2 రావడం మాత్రం పక్కా. మరికొన్ని రోజుల్లోనే సన్ పిక్చర్స్ ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. జైలర్ లో ఎలివేషన్లతో మోత మోగించిన నెల్సన్.. రెండో భాగంలో ఇంకెన్ని మెరుపులు చూపిస్తాడో మరి.
This post was last modified on January 21, 2024 3:19 pm
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…