టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో సమంత పోషించినన్ని విలక్షణ పాత్రలు మరొకరు చేయలేదంటే అతిశయోక్తి కాదు. స్టార్ స్టేటస్ సంపాదించాక కొన్ని గ్లామర్ క్యారెక్టర్లు చేసినప్పటికీ.. ఆ తర్వాత మాత్రం పాత్రలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటే తప్ప ఆమె ఒప్పుకోవట్లేదు. పెద్ద పెద్ద సినిమాల్లో కూడా విలక్షణ పాత్రలే చేసింది.
‘రంగస్థలం’లోనూ ఆమె పాత్ర వైవిధ్యంగా ఉండి తన ప్రత్యేకతను చాటిచెప్పింది. పెళ్లి తర్వాత ఇలా విభిన్నమైన పాత్రలతోనే సాగిపోతోంది సామ్. చివరగా ఆమె ‘ఓ బేబీ’ సినిమాతో మురిపించింది. ఆ క్యారెక్టర్ సామ్ కెరీర్లో ఒక మైలురాయిలా నిలిచిపోయింది. కొన్ని నెలల కిందటే డిజిటల్ మీడియంలోకి కూడా సామ్ అడుగు పెట్టింది. ‘ఫ్యామిలీ మ్యాన్’ రెండో సీజన్లో సామ్ టెర్రరిస్టు పాత్ర చేసినట్లు చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఇది విడుదల కాబోతోంది.
ఇదిలా ఉండగా తమిళంలో సామ్ కొత్తగా ఓ సినిమా అంగీకరించింది. విజయ్ సేతుపతి అందులో హీరో. ‘మయూరి’, ‘గేమ్ ఓవర్’ సినిమాలు రూపొందించిన అశ్విన్ శరవణన్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో సమంత ఓ షాకింగ్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. ఆమె బదిరురాలిగా కనిపించనుందట. తను ఏమీ మాట్లాడలేదు. తనకు ఏదీ వినిపించదు. ఓ స్టార్ హీరోయిన్ ఇలాంటి పాత్రలో నటించడం అరుదైన విషయం.
బదిరురాలి పాత్ర అనగానే సమంత నటించిన ‘రంగస్థలం’ గుర్తుకు రాకమానదు. అందులో చరణ్ చెవిటివాడి పాత్రలో కనిపించాడు. ఈ వైకల్యాన్ని వినోదాత్మకంగా చూపించి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు సుకుమార్. స్టార్లు కూడా ఇలాంటి వైకల్యం ఉన్న పాత్రలు చేయొచ్చన్న ధైర్యాన్నిచ్చిన సినిమా అది. ఇప్పుడు సామ్ చిట్టిబాబు పాత్రకు ఎక్స్టెన్షన్ అనదగ్గ పాత్ర చేయబోతోంది. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ మొదలుపెట్టనున్నారు. తెలుగులో మాత్రం సమంత కొత్తగా ఏ చిత్రాన్ని అంగీకరించినట్లు కనిపించడం లేదు.
This post was last modified on September 5, 2020 12:11 pm
తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…