సీనియర్ హీరోలతో కలిసి నటించడం వల్ల ఎన్నో అనుభవాలు, పాఠాలు నేర్చుకునే అదృష్టం దక్కుతుంది. అవి ఎలా ఉంటాయో ఒక ఉదాహరణ రూపంలో వివరించారు చిరంజీవి. ఇవాళ విశాఖపట్నంలో లోకాయుక్త ఫౌండేషన్ ఆధర్వంలో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి, అక్కినేని శత జయంతి ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరై ఒక ఆసక్తికరమైన సంఘటనను పంచుకున్నారు. చిరు. హీరోగా నిలదొక్కుకుంటున్న సమయంతో తిరుగులేని మనిషిలో అన్నగారితో కలిసే అదృష్టం దక్కింది. అందులో ఆయన కాంబినేషన్లో చెప్పుకోదగ్గ సీన్లతో పాటు ఒక ఫైట్ కూడా ఉంటుంది.
దాని షూటింగ్ జరుగుతుండగా ఒక సన్నివేశంలో మూడు అడుగుల ఎత్తు నుంచి ఇద్దరూ దూకాల్సి వచ్చింది. యాక్షన్ అనగానే చిరంజీవి వెంటనే దూకేయగా ఎన్టీఆర్ అక్కడే ఉండిపోయారు. వెంటనే బ్రదర్ ఎందుకలా చేశారని పెద్దాయన నిలదీయడంతో నాకెవరూ చెప్పలేదని అందుకే ఆలా చేశానని వివరణ ఇచ్చారు. చిరు నటుల జీవితాలు చాలా విలువైనవి, ఇలా తొందరరపడి ఏదైనా జరగకూడనిది జరిగితే దాని వల్ల నిర్మాత నష్టపోతాడు కాబట్టి ఆ రిస్కుని అనుభవజ్ఞులైన డూపులకు ఇవ్వాలని చెప్పారు. విన్నంత సేపూ తలూపిన చిరంజీవి కుర్రతనం వల్ల సలహాని మరీ సీరియస్ గా తీసుకోలేదు.
సరిగ్గా ఏడాది తర్వాత సంఘర్షణ షూటింగ్ లో సరిగ్గా మళ్ళీ మూడు అడుగుల ఎత్తు నుంచి దూకబోయి కాలు మడత పడటంతో చిరంజీవి ఏకంగా ఆరు నెలలు విశ్రాంతి తీసుకుని చికిత్స కోసం విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది. అప్పుడే అన్న ఎన్టీఆర్ చెప్పిన పాఠం గుర్తుకు వచ్చింది. తన దూకుడు వల్ల ప్రొడ్యూసర్ కి చాల నష్టం వచ్చిందని, కొంచెం ఆలోచించి ఉంటే ఆ సమస్య వచ్చేది కాదని అప్పటి నుంచి జాగ్రత్తగా ఉండటం మొదలుపెట్టారు. ఏదైనా కొన్ని అనుభవం వల్లే నేర్చుకుంటామని చెప్పడానికి ఇదో మంచి ఉదంతం. పెద్దల మాట చద్ది మూటని ఊరికే సామెతలు పుట్టుకురాలేదు.
This post was last modified on January 20, 2024 4:40 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…