సీనియర్ హీరోలతో కలిసి నటించడం వల్ల ఎన్నో అనుభవాలు, పాఠాలు నేర్చుకునే అదృష్టం దక్కుతుంది. అవి ఎలా ఉంటాయో ఒక ఉదాహరణ రూపంలో వివరించారు చిరంజీవి. ఇవాళ విశాఖపట్నంలో లోకాయుక్త ఫౌండేషన్ ఆధర్వంలో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి, అక్కినేని శత జయంతి ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరై ఒక ఆసక్తికరమైన సంఘటనను పంచుకున్నారు. చిరు. హీరోగా నిలదొక్కుకుంటున్న సమయంతో తిరుగులేని మనిషిలో అన్నగారితో కలిసే అదృష్టం దక్కింది. అందులో ఆయన కాంబినేషన్లో చెప్పుకోదగ్గ సీన్లతో పాటు ఒక ఫైట్ కూడా ఉంటుంది.
దాని షూటింగ్ జరుగుతుండగా ఒక సన్నివేశంలో మూడు అడుగుల ఎత్తు నుంచి ఇద్దరూ దూకాల్సి వచ్చింది. యాక్షన్ అనగానే చిరంజీవి వెంటనే దూకేయగా ఎన్టీఆర్ అక్కడే ఉండిపోయారు. వెంటనే బ్రదర్ ఎందుకలా చేశారని పెద్దాయన నిలదీయడంతో నాకెవరూ చెప్పలేదని అందుకే ఆలా చేశానని వివరణ ఇచ్చారు. చిరు నటుల జీవితాలు చాలా విలువైనవి, ఇలా తొందరరపడి ఏదైనా జరగకూడనిది జరిగితే దాని వల్ల నిర్మాత నష్టపోతాడు కాబట్టి ఆ రిస్కుని అనుభవజ్ఞులైన డూపులకు ఇవ్వాలని చెప్పారు. విన్నంత సేపూ తలూపిన చిరంజీవి కుర్రతనం వల్ల సలహాని మరీ సీరియస్ గా తీసుకోలేదు.
సరిగ్గా ఏడాది తర్వాత సంఘర్షణ షూటింగ్ లో సరిగ్గా మళ్ళీ మూడు అడుగుల ఎత్తు నుంచి దూకబోయి కాలు మడత పడటంతో చిరంజీవి ఏకంగా ఆరు నెలలు విశ్రాంతి తీసుకుని చికిత్స కోసం విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది. అప్పుడే అన్న ఎన్టీఆర్ చెప్పిన పాఠం గుర్తుకు వచ్చింది. తన దూకుడు వల్ల ప్రొడ్యూసర్ కి చాల నష్టం వచ్చిందని, కొంచెం ఆలోచించి ఉంటే ఆ సమస్య వచ్చేది కాదని అప్పటి నుంచి జాగ్రత్తగా ఉండటం మొదలుపెట్టారు. ఏదైనా కొన్ని అనుభవం వల్లే నేర్చుకుంటామని చెప్పడానికి ఇదో మంచి ఉదంతం. పెద్దల మాట చద్ది మూటని ఊరికే సామెతలు పుట్టుకురాలేదు.
This post was last modified on January 20, 2024 4:40 pm
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…