సంక్రాంతి రేసు నుంచి ఈగల్ తప్పుకున్నందుకు తాను ఫిక్స్ చేసుకున్న రిలీజ్ డేట్ ఫిబ్రవరి 9ని త్యాగం చేసినందుకు టిల్లు స్క్వేర్ కి కొత్త చిక్కొచ్చి పడింది. కొత్త విడుదల తేదీ నిర్ణయించుకోవడంలో యూనిట్ సతమతమవుతోందని టాక్. నిజానికి షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. బ్యాలన్స్ ఉన్న భాగాన్ని ఆర్టిస్టుల డేట్లకు అనుగుణంగా దర్శకుడు మల్లిక్ రామ్ ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నాడు. పలు రీ షూట్లు కూడా జరిగాయని న్యూస్ ఉంది. అయితే ఫిబ్రవరి చివరి వారంలోపు ఫస్ట్ కాపీ సిద్ధం కాకపోవచ్చు కాబట్టి మార్చి నెలాఖరుకు వెళ్లేలా సితార పెద్దలు తీవ్ర సమాలోచనలు చేస్తున్నట్టు తెలిసింది.
ఇక్కడ కొన్ని సమస్యలున్నాయి. మార్చి 30 అనుకుంటే కేవలం వారం గ్యాప్ లో దేవర వస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ ప్యాన్ ఇండియా మూవీగా దాని మీద ఉన్న బజ్ తెలిసిందే. పైగా అనిరుద్ రవిచందర్ సంగీతం కావడంతో ముందే దీనికి సంబంధించిన హడావిడి సోషల్ మీడియాలో జరగుతుంటుంది. ఈ వేడిలో టిల్లు స్క్వేర్ తనవైపు అటెన్షన్ వచ్చేలా చేసుకోవడం కష్టం. సో దేవర ఖచ్చితంగా ఏప్రిల్ 5 వస్తుందో రాదో తేలాలి. ఇంకా పాటల చిత్రీకరణతో పాటు కొంత టాకీ పార్ట్ బాలన్స్ ఉందట. చేతిలో ఉన్నది కేవలం 75 రోజులు. ఇందులో ప్రమోషన్లు ఈవెంట్లు అన్నీ చేసుకోవాలి.
ఒకవేళ దేవర కనక చెప్పిన డేట్ కే లాక్ చేసుకుంటే టిల్లు స్క్వేర్ ఇంకో ఆప్షన్ చూసుకోవాల్సి ఉంటుంది. వీలైనంత ముందుగా కర్చీఫ్ వేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇండియన్ 2 అదే నెలలో రావొచ్చనే లీక్ చెన్నై మీడియాలో తిరుగుతోంది. యూత్ లో ఎంత క్రేజ్ ఉన్నా వీలైనంత తక్కువ పోటీలో రావడమే టిల్లు స్క్వేర్ కు మేలు చేస్తుంది. ముఖ్యంగా స్టార్లతో తలపడకుండా చూసుకోవాలి. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ కోసమే సిద్దు జొన్నలగడ్డ విలువైన రెండేళ్ల కాలాన్ని త్యాగం చేసుకున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ వల్ల మార్చి మధ్యలో వచ్చే ఛాన్సూ లేదట.
This post was last modified on January 20, 2024 4:33 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…