టాలీవుడ్ సెలబ్రిటీలు ఆత్మకథలు రాసుకోవడం సహజం. అందరూ కాదు కానీ ఎందరో ప్రముఖులు వాళ్లే స్వయంగా లిఖించుకోవడమో లేదా వేరే వాళ్ళతో రాయించుకోవడమో చేశారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, గొల్లపూడి, రామానాయుడు, దాసరి నారాయణరావు, ఎస్విఆర్, విట్టలాచార్య, అల్లు రామలింగయ్య ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఈ లిస్టులో మెగాస్టార్ చిరంజీవి చేరబోతున్నారు. పనుల ఒత్తిడితో తానే రాసుకోలేని పరిస్థితిలో ఈ బృహత్కర బాధ్యతను ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ కు అప్పజెబుతున్నట్టు ప్రకటించారు.
ఇవాళ వైజాగ్ లో మాజీ ఎంపి యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ ఆధ్వర్యంలో లోకాయుక్త ఫౌండేషన్ ఎన్టీఆర్ 28వ వర్ధంతి, ఏఎన్ఆర్ శత జయంతిని ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకకు హాజరైన సందర్భంగా చిరంజీవి తన పుస్తకం గురించి చెప్పారు. గతంలో చిరు మీద కొన్ని బుక్స్ వచ్చాయి. రెండేళ్ల క్రితం ప్రముఖ జర్నలిస్టు వినాయకరావు ది లెజెండ్ పేరుతో వెలువరించారు కానీ అది కేవలం నూటా యాభై సినిమాల విశేషాలతో కూడుకుంది. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలు పెద్దగా లేవు. కానీ ఇప్పుడు యండమూరి రాసే బయోగ్రఫీలో బాల్యం నుంచి ఇప్పటిదాకా అన్ని ఘట్టాలు ఉంటాయి.
ఎంత టైం పడుతుంది, ఎప్పుడనేది చెప్పలేదు కానీ ఫాన్స్ ఒకపక్క సంతోషం వ్యక్తం చేస్తూనే గతంలో రామ్ చరణ్ మీద యండమూరి చేసిన కొన్ని కామెంట్స్ ని గుర్తు చేస్తూ పూర్తి సంతృప్తిని వెలిబుచ్చలేకపోతున్నారు. ఈయనకు చిరంజీవితో అనుబంధం అభిలాష, ఛాలెంజ్, రాక్షసుడు, మరణమృదంగం, దొంగమొగుడు లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్లలో ఉంది. స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ కు ఏకంగా డైరెక్షన్ ఛాన్స్ కూడా ఇచ్చారు. కానీ అది అంచనాలు అందుకోలేక ఫెయిలయ్యింది. ఆత్మకథ రాయడమంటే సమయం పట్టే వ్యవహారం కాబట్టి ఎదురు చూసే టైం ఎక్కువే ఉంటుంది.
This post was last modified on January 20, 2024 4:29 pm
తమిళంలో నటుడిగా, రచయితగా, దర్శకుడిగా పార్తీబన్కు గొప్ప పేరే ఉంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన సినీ ప్రయాణం కొనసాగుతోంది.…
భయపడినట్టే జరిగింది. దురంధర్ ది రివెంజ్ తెలుగు ప్రీమియర్లు క్యాన్సిలయ్యాయని ట్రేడ్ టాక్. పివిఆర్ ఐనాక్స్ లాంటి మల్టీప్లెక్సులు ఇప్పటికే…
ఓజితో పోలిస్తే ఆ స్థాయిలో బజ్ లేదు. చివరి నిమిషంలో దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్…
మూవీ లవర్స్ కౌంట్ డౌన్ టైమర్ పెట్టేసుకున్నారు. సాయంత్రం అయిదు గంటలు ఎప్పుడెప్పుడు అవుతుందా, దురంధర్ ది రివెంజ్ ప్రీమియర్లు…
'మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ' కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మె ల్యే రోహిత్రెడ్డి విషయం మాజీ…
వైసీపీ అధినేత జగన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. రాష్ట్రంలో కంటే కూడా ఉప్పుడు కేంద్రంలో ఆయనకు పెద్ద చిక్కు వచ్చింది.…