బాక్సాఫీస్ వద్ద హనుమాన్ సునామిని చూసి ఎవరికీ నోట మాట రావడం లేదు. పండగ సెలవులయ్యాక అందరి కలెక్షన్లు తగ్గాయి కానీ దీనికి మాత్రం రివర్స్ లో హౌస్ ఫుల్స్ ప్లస్ అదనపు స్క్రీన్లు తోడవుతున్నాయి. మొన్నటిదాకా టికెట్ రేట్లు, మహేష్ బాబు బ్రాండ్ వల్ల ఆధిపత్యం చూపించిన గుంటూరు కారం ఇప్పుడు వెనుకబడిపోయింది. ప్రధాన కేంద్రాల్లో సైతం హనుమాన్ ఫిగర్లే పెద్దగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారి ప్లాన్ చేసుకున్న ప్యాన్ ఇండియా మూవీ రామాయణంకి హనుమాన్ ఫలితం గొప్ప భరోసా ఇచ్చేసిందని అక్కడి జనాల ఓపెన్ కామెంట్.
రన్బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా మొత్తం మూడు భాగాల్లో తీయాలని నితీష్ ప్లాన్ చేసుకున్నారు. క్యాస్టింగ్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ తీసుకోవడం జరిగిందని ఇన్ సైడ్ టాక్. ఎంతలేదన్నా అయిదు వందల కోట్లకు పైగానే బడ్జెట్ అవుతుందని అంటున్నారు. రావణుడిగా నటించేందుకు కెజిఎఫ్ యష్ తో జరుపుతున్న ముంతనాలు ఇంకా కొలిక్కి రాలేదు. అతను టాక్సిక్ లో బిజీ అయిపోయాడు. ఒకవేళ ఒప్పుకున్నా డేట్ల సమస్య వచ్చేలా ఉంది. దీంతో రాఖీ భాయ్ ఈ ప్రాజెక్టులో చేరడం మీద ఇంకా అనుమానాలు తొలగిపోలేదు.
పరిమిత బడ్జెట్ లో మంచి క్వాలిటీ విజువల్ ఎఫెక్ట్స్ తోనే హనుమాన్ ఈ స్థాయి విజయం సాధించినప్పుడు సరైన రీతిలో రామాయణాన్ని తీస్తే ఏ స్థాయి ప్రభంజనం ఉంటుందో వేరే చెప్పాలా. ఆదిపురుష్ మీద నెగటివిటీ చూశాక చాలా మంది ఫిలిం మేకర్స్ ఆ ఇతిహాసం జోలికి ఇప్పట్లో వెళ్ళకపోవడం మంచిదననుకున్నారు. దర్శకుడు ఓం రౌత్ చేసిన రచ్చ ఆ రేంజ్ లో ఉంది మరి. భవిష్యత్తు తరాల పిల్లలు శాశ్వతంగా గొప్పగా చెప్పుకునే రామాయణాన్ని తీస్తానని చెబుతున్న నితీష్ తివారి కుంభకర్ణుడిగా బాబీ డియోల్ ని ట్రై చేస్తున్నారట. క్యాస్టింగ్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
This post was last modified on January 18, 2024 4:57 pm
ఆంధ్రకింగ్ తాలూకా తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫైనల్ గా కొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చాడు.…
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు అంటే ఉద్వేగ భరితమైన వేదిక. పార్టీ విధానాలు, భవిష్యత్ దిశ, నాయకత్వ సందేశం కార్యకర్తలకు…
అనుకున్నంతా అయ్యింది. పెట్రోల్, డిజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం శుక్రవారంతో నిజమయ్యాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం…
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు…
ఇటీవలే శ్వాసనాళానికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రమంగా కోలుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్…
టిడిపిలోనే కొందరు నాయకులకు మెజారిటీ సమస్య ఇప్పుడు కొంత గడబిడగా మారింది. గత ఎన్నికల సమయంలో భారీ స్థాయి మెజారిటీతో…