బాక్సాఫీస్ వద్ద హనుమాన్ సునామిని చూసి ఎవరికీ నోట మాట రావడం లేదు. పండగ సెలవులయ్యాక అందరి కలెక్షన్లు తగ్గాయి కానీ దీనికి మాత్రం రివర్స్ లో హౌస్ ఫుల్స్ ప్లస్ అదనపు స్క్రీన్లు తోడవుతున్నాయి. మొన్నటిదాకా టికెట్ రేట్లు, మహేష్ బాబు బ్రాండ్ వల్ల ఆధిపత్యం చూపించిన గుంటూరు కారం ఇప్పుడు వెనుకబడిపోయింది. ప్రధాన కేంద్రాల్లో సైతం హనుమాన్ ఫిగర్లే పెద్దగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారి ప్లాన్ చేసుకున్న ప్యాన్ ఇండియా మూవీ రామాయణంకి హనుమాన్ ఫలితం గొప్ప భరోసా ఇచ్చేసిందని అక్కడి జనాల ఓపెన్ కామెంట్.
రన్బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా మొత్తం మూడు భాగాల్లో తీయాలని నితీష్ ప్లాన్ చేసుకున్నారు. క్యాస్టింగ్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ తీసుకోవడం జరిగిందని ఇన్ సైడ్ టాక్. ఎంతలేదన్నా అయిదు వందల కోట్లకు పైగానే బడ్జెట్ అవుతుందని అంటున్నారు. రావణుడిగా నటించేందుకు కెజిఎఫ్ యష్ తో జరుపుతున్న ముంతనాలు ఇంకా కొలిక్కి రాలేదు. అతను టాక్సిక్ లో బిజీ అయిపోయాడు. ఒకవేళ ఒప్పుకున్నా డేట్ల సమస్య వచ్చేలా ఉంది. దీంతో రాఖీ భాయ్ ఈ ప్రాజెక్టులో చేరడం మీద ఇంకా అనుమానాలు తొలగిపోలేదు.
పరిమిత బడ్జెట్ లో మంచి క్వాలిటీ విజువల్ ఎఫెక్ట్స్ తోనే హనుమాన్ ఈ స్థాయి విజయం సాధించినప్పుడు సరైన రీతిలో రామాయణాన్ని తీస్తే ఏ స్థాయి ప్రభంజనం ఉంటుందో వేరే చెప్పాలా. ఆదిపురుష్ మీద నెగటివిటీ చూశాక చాలా మంది ఫిలిం మేకర్స్ ఆ ఇతిహాసం జోలికి ఇప్పట్లో వెళ్ళకపోవడం మంచిదననుకున్నారు. దర్శకుడు ఓం రౌత్ చేసిన రచ్చ ఆ రేంజ్ లో ఉంది మరి. భవిష్యత్తు తరాల పిల్లలు శాశ్వతంగా గొప్పగా చెప్పుకునే రామాయణాన్ని తీస్తానని చెబుతున్న నితీష్ తివారి కుంభకర్ణుడిగా బాబీ డియోల్ ని ట్రై చేస్తున్నారట. క్యాస్టింగ్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
This post was last modified on January 18, 2024 4:57 pm
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…