Movie News

అన్న‌గారి అడుగు జాడ‌.. నాడు-నేడు-ఏనాడూ!

తెలుగు వారి ఆత్మ గౌర‌వానికి ప్ర‌తీక అన్న నంద‌మూరి తార‌క రామారావు. సినీ రంగంలోనే కాకుండా.. రాజ‌కీయంగా ఆయ‌న వేసిన అడుగులు… ఉభ‌యతార‌కంగా ఆయ‌న న‌డిచిన విధానం.. వంటివి నాడే కాదు.. నేడు కూడా ఆచ‌ర‌ణీయాలు అన‌డంలో ఎలంటి సందేహం లేదు.

ఎక్క‌డో ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని మారు మూల గ్రామం నిమ్మ‌కూరు నుంచి విజ‌య‌వాడ‌కు వ‌చ్చి.. సైకిల్‌ పై కాలేజీకి వెళ్లి చ‌దువుకున్న రామారావు.. అనే రైతు బిడ్డ త‌ద‌నంత‌ర కాలంలో ఒక జాతి మొత్తానికీ.. ఆద‌ర్శంగా నిలుస్తార‌ని.. ఒక జాతిని చైత‌న్య వంతం చేస్తార‌ని బ‌హుశ ఎవ‌రూ ఊహించి ఉండ‌రు. కానీ, జ‌రిగింది.

నేడు అన్న‌గారు ఎన్టీఆర్ వ‌ర్ధంతి. 1996, జ‌న‌వ‌రి 18న ఆయ‌న హైద‌రాబాద్‌లోని నివాసంలో ప‌ర‌మ‌ప‌దించారు. ఆయ‌న వెళ్లిపోయి ఏళ్లు గ‌డిచినా.. ఇప్ప‌టికీ మ‌న మ‌ధ్యే.. మ‌న తెలుగు ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉన్న‌ట్టుగా ఉంటుంది. ఆయ‌న‌తో మ‌న బంధాన్ని.. మ‌న బాంధ‌వ్యాన్ని పెన‌వేసుకున్నట్టుగానే అనిపిస్తుంది. దీనికి కార‌ణం.. ఆయ‌న దూర‌దృష్టి. అన్నం లేక‌పోయినా.. బ్ర‌తకొచ్చుకానీ.. ఆత్మ గౌర‌వాన్ని మాత్రం చంపుకుని బ్ర‌తికేదేలేదు అని చైత‌న్య ర‌థం పై నిల‌బ‌డి చేసిన ప్ర‌సంగాలు నేటి త‌రానికి తెలియ‌క పోవ‌చ్చు. కానీ, ఆ వాక్కులు ఇప్ప‌టికీ.. ప‌రోక్షంగా వినిపిస్తూనే ఉంటాయి.

1983కు ముందు.. ఎన్టీఆర్ అంటే.. కేవ‌లం న‌టుడు మాత్ర‌మే. అది కూడా విశ్వ‌విఖ్యాత న‌టుడుగానే అంద‌రికీ తెలుసు. కానీ, త‌ర్వాత‌.. తెలుగు దేశం పేరుతో పార్టీని స్థాపించి 61 ఏళ్ల వ‌య‌సులో తెలుగు వారి ఆత్మాభిమానం.. ఆత్మ‌గౌర‌వం కోసం.. ఉద్య‌మించిన తీరు న‌భూతో అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. త‌నకంటూ.. రూపాయి జీతం మాత్ర‌మే తీసుకుని ప‌నిచేసిన తొలి ముఖ్య‌మంత్రి కూడా అన్న‌గారే కావ‌డం.. కేవ‌లం ఆరుమాసాల్లోనే అప్ర‌తిహ‌త విజ‌య విహారంతో అధికారంలోకి రావ‌డం.. అన్న‌గారికే సాధ్య‌మైంది.

నేడు ప్ర‌భుత్వాలు ప్ర‌వ‌చిస్తున్న మ‌హిళా రిజ‌ర్వేష‌న్‌, సామాజిక వ‌ర్గాల‌కు ప్రాధాన్యం వంటి అనేక అంశాల‌ను ఆనాడే.. అన్న‌గారు అమ‌లు చేశారు. మ‌హిళ‌ల‌కు ఆస్తిలో స‌గ‌భాగం హ‌క్కును క‌ల్పించారు. బీసీల‌కు ప్రాధాన్యం పెంచి.. ప‌ద‌వులు అప్ప‌గించారు. అవినీతిపై కొర‌డా ఝ‌ళిపించి.. ఎక్క‌డా రూపాయి తీసుకోకుండానే ప‌ని జ‌రిగేలా ప్ర‌త్య‌క్ష ప‌ర్య‌వేక్ష‌ణ గావించారు. త‌దుప‌రి ఎన్నిక‌ల్లో ఓడిపోతార‌ని, ఉద్యోగులే ఓడిస్తార‌ని తెలిసినా.. వెనుకంజ వేయ‌ని ల‌క్షణంతో ముందుకు సాగారు.

పేద‌ల‌కు రెండు రూపాయ‌ల‌కే కిలో బియ్యం ప‌థ‌కం తెచ్చినా.. క‌ర‌ణం-మున‌సుబు వ్య‌వ‌స్థ‌ల‌ను ర‌ద్దు చేసినా.. ప‌టేల్ ప‌ట్వారీ వ్య‌వ‌స్థ‌ల‌కు తెర‌దించినా.. మ‌హిళ‌ల‌కు రాజ‌కీయాల్లో ప్రాధాన్యం ఇచ్చినా.. బీసీల‌ను వెలుగులోకి తెచ్చినా.. ఎక్క‌డా రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌ను ఆయ‌న కోరుకోలేదు.. ప్ర‌జాభ్యున్న‌తినే కాంక్షించారు. అందుకే.. అన్న‌గారి అడుగు జాడ‌.. నాడు-నేడు-ఏనాడూ! అన్న రీతిలో చిర‌స్థాయిగా నిలిచిపోయింది.. తెలుగు యుగం.. తెలుగు నేల ఉన్నంత వ‌ర‌కు ఆయ‌న పేరు స్థిరంగా ఉండిపోతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

This post was last modified on January 18, 2024 1:56 pm

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago