గత కొన్నేళ్లుగా బాకీగా మిగిలిపోయిన హిట్టుని ఎట్టకేలకు నా సామిరంగతో అందుకున్నారు నాగార్జున. ముఖ్యంగా మాస్ కి ఈ సినిమా కనెక్ట్ అయిన విధానం హెచ్చుతగ్గులను కవర్ చేసేసి విజయాన్ని ఖాతాలో వేసింది. ఇందులో హీరోయిన్ గా చేసిన ఆశికా రంగనాథ్ మీద క్రమంగా దర్శకుల దృష్టి మళ్లుతోంది. ఈ అమ్మాయి కన్నడిగ. 2016లో క్రేజీ బాయ్ తో తెరంగేట్రం చేసింది. తర్వాత శివరాజ్ కుమార్, శ్రీమురళి, సుదీప్ లాంటి అగ్ర హీరోల చిత్రాల్లో ఆఫర్లు పట్టింది కానీ ఆశించిన స్థాయిలో పెద్ద బ్రేక్ దక్కలేదు. తమిళ్ డెబ్యూ పటత్తు అసురన్ కూడా సూపర్ ఫ్లాప్ ని ఖాతాలో వేసింది.
కట్ చేస్తే గత ఏడాది కళ్యాణ్ రామ్ అమిగోస్ తో తెలుగులో కాలు పెట్టింది. కలిసి రాలేదు. బొమ్మ డిజాస్టర్. తిరిగి ఎదురు చూపులు తప్పలేదు. నెలల తరబడి వెయిటింగ్ తర్వాత నా సామిరంగ వచ్చింది. అరవై దాటిన నాగార్జున లాంటి సీనియర్ స్టార్ హీరోతో చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేయకుండా కథ నచ్చేసి వెంటనే ఒప్పేసుకుంది. నాగ్, అల్లరి నరేష్ లకు ధీటుగా మాస్ లో ఆశికాకు గుర్తింపు వచ్చింది. యవ్వనం, మధ్య వయసు దగ్గరగా రెండు వేరియేషన్లను చూపించిన తీరు ఆకట్టుకుంది. గ్లామర్, యాక్టింగ్ రెండూ బ్యాలన్స్ చేసిన తీరు మంచి మార్కులు సాధించి పెట్టింది.
టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్ల కొరతను తనకు అనుకూలంగా ఆశికా ఏ మేరకు వాడుకుంటుందో చూడాలి. సీనియర్ల పక్కన జోడి కట్టేందుకు అభ్యంతరం లేదంటే ఆఫర్లకు కొదవ ఉండకపోవచ్చు. ఎందుకంటే చిరు, బాలయ్య, వెంకీలు ఎదురుకుంటున్న ఓ సమస్యకు పరిష్కారం దొరికినట్టవుతుంది. శ్రీలీల ముందు రవితేజతో బ్లాక్ బస్టర్ కొట్టాకే మహేష్ బాబు దాకా వచ్చింది. సో హీరోల ఏజ్ లెక్కలు వేసుకోకుండా కథలో ప్రాధాన్యం వరకు చూసుకుంటే ఎనిమిదేళ్ల తర్వాత వచ్చిన పెద్ద బ్రేక్ ని నిలబెట్టుకోవచ్చు. ప్రస్తుతం ఆశికా కథలు వినే పనిలో ఉంది. ఇంకా ఫైనల్ అవ్వలేదు.
This post was last modified on January 17, 2024 2:55 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…