విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీ హఠాత్తుగా ఆగిపోయిందనే ప్రచారం మొదలవ్వడంతో రౌడీ హీరో ఫ్యాన్స్ ఖంగారు పడ్డారు. ఎందుకంటే ఇది అతని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని యూనిట్ టాక్. రెండు రోజుల క్రితం పండగ పేరుతో నెట్ ఫ్లిక్స్ ఇచ్చిన ప్రకటనలో దీని హక్కులు కొన్నట్టు స్పష్టంగా పేర్కొంది. ఆ మేరకు అగ్రిమెంట్ చేసుకుని ముందస్తుగా అడ్వాన్స్ ఇస్తేనే ఇంత ఖచ్చితంగా సోషల్ మీడియాలో యాడ్స్ ఇస్తారు. సో క్యాన్సిలన్నది పుకారుగానే చూడాలి.
ప్రస్తుతం విజయ్ చిన్న బ్రేక్ తీసుకున్నా ముందు ఫ్యామిలీ స్టార్ పూర్తి చేయాలి. ఫారిన్ షెడ్యూల్ ఆలస్యం కావడంతో సంక్రాంతి సీజన్ మిస్ అయిన ఈ ఎంటర్ టైనర్ కి పరుశురాం దర్శకుడు. దీని కోసమే సితార సంస్థ విడి 12 షూటింగ్ ని వాయిదా వేసుకుంది. ఈలోగా గౌతమ్ తిన్ననూరి అంతా కొత్తవాళ్లతో ఇంకో సినిమా పూర్తి చేశాడు. ప్రస్తుతం దాని పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసమే బిజీగా తిరుగుతున్నాడు. ఈ ప్రాజెక్టుకి అనిరుద్ రవిచందరే సంగీతం సమకూరుస్తున్నాడు. రీ రికార్డింగ్ ని వీలైనంత వేగంగా ఇస్తానని మాట ఇవ్వడంతో ఇద్దరూ దాని మీదే బిజీగా ఉన్న మాట వాస్తవం.
ఫిబ్రవరి నుంచి విడి 12 రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. నిర్మాత నాగవంశీ గతంలోనే ఇది చాలా పెద్ద ప్యాన్ ఇండియా మూవీ అవుతుందని, అంచనాలకు మించి ఉంటుందని చెప్పారు. కానీ గుంటూరు కారం ఒత్తిడి, రిలీజ్ వ్యవహారాలతో బిజీగా ఉండి విజయ్ దేవరకొండ సినిమా ప్రస్తావన ఎక్కడా రాలేదు. త్వరలో ఎలాగూ గ్యాంగ్స్ అఫ్ గోదావరి, టిల్లు స్క్వేర్ ప్రమోషన్ల కోసం అందుబాటులోకి వస్తారు కాబట్టి అప్పుడీ గాసిప్ గురించి పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. ఖుషి ఆశించిన స్థాయిలో పెద్ద ఫలితం అందుకోకపోవడంతో విజయ్ ఆశలన్నీ ఈ రెండు సినిమాల మీదే ఉన్నాయి.
This post was last modified on January 17, 2024 11:22 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…