విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీ హఠాత్తుగా ఆగిపోయిందనే ప్రచారం మొదలవ్వడంతో రౌడీ హీరో ఫ్యాన్స్ ఖంగారు పడ్డారు. ఎందుకంటే ఇది అతని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని యూనిట్ టాక్. రెండు రోజుల క్రితం పండగ పేరుతో నెట్ ఫ్లిక్స్ ఇచ్చిన ప్రకటనలో దీని హక్కులు కొన్నట్టు స్పష్టంగా పేర్కొంది. ఆ మేరకు అగ్రిమెంట్ చేసుకుని ముందస్తుగా అడ్వాన్స్ ఇస్తేనే ఇంత ఖచ్చితంగా సోషల్ మీడియాలో యాడ్స్ ఇస్తారు. సో క్యాన్సిలన్నది పుకారుగానే చూడాలి.
ప్రస్తుతం విజయ్ చిన్న బ్రేక్ తీసుకున్నా ముందు ఫ్యామిలీ స్టార్ పూర్తి చేయాలి. ఫారిన్ షెడ్యూల్ ఆలస్యం కావడంతో సంక్రాంతి సీజన్ మిస్ అయిన ఈ ఎంటర్ టైనర్ కి పరుశురాం దర్శకుడు. దీని కోసమే సితార సంస్థ విడి 12 షూటింగ్ ని వాయిదా వేసుకుంది. ఈలోగా గౌతమ్ తిన్ననూరి అంతా కొత్తవాళ్లతో ఇంకో సినిమా పూర్తి చేశాడు. ప్రస్తుతం దాని పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసమే బిజీగా తిరుగుతున్నాడు. ఈ ప్రాజెక్టుకి అనిరుద్ రవిచందరే సంగీతం సమకూరుస్తున్నాడు. రీ రికార్డింగ్ ని వీలైనంత వేగంగా ఇస్తానని మాట ఇవ్వడంతో ఇద్దరూ దాని మీదే బిజీగా ఉన్న మాట వాస్తవం.
ఫిబ్రవరి నుంచి విడి 12 రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. నిర్మాత నాగవంశీ గతంలోనే ఇది చాలా పెద్ద ప్యాన్ ఇండియా మూవీ అవుతుందని, అంచనాలకు మించి ఉంటుందని చెప్పారు. కానీ గుంటూరు కారం ఒత్తిడి, రిలీజ్ వ్యవహారాలతో బిజీగా ఉండి విజయ్ దేవరకొండ సినిమా ప్రస్తావన ఎక్కడా రాలేదు. త్వరలో ఎలాగూ గ్యాంగ్స్ అఫ్ గోదావరి, టిల్లు స్క్వేర్ ప్రమోషన్ల కోసం అందుబాటులోకి వస్తారు కాబట్టి అప్పుడీ గాసిప్ గురించి పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. ఖుషి ఆశించిన స్థాయిలో పెద్ద ఫలితం అందుకోకపోవడంతో విజయ్ ఆశలన్నీ ఈ రెండు సినిమాల మీదే ఉన్నాయి.
This post was last modified on January 17, 2024 11:22 am
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…