Movie News

విజయ్ దేవరకొండ 12 ఆగదు ఆగలేదు

విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీ హఠాత్తుగా ఆగిపోయిందనే ప్రచారం మొదలవ్వడంతో రౌడీ హీరో ఫ్యాన్స్ ఖంగారు పడ్డారు. ఎందుకంటే ఇది అతని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని యూనిట్ టాక్. రెండు రోజుల క్రితం పండగ పేరుతో నెట్ ఫ్లిక్స్ ఇచ్చిన ప్రకటనలో దీని హక్కులు కొన్నట్టు స్పష్టంగా పేర్కొంది. ఆ మేరకు అగ్రిమెంట్ చేసుకుని ముందస్తుగా అడ్వాన్స్ ఇస్తేనే ఇంత ఖచ్చితంగా సోషల్ మీడియాలో యాడ్స్ ఇస్తారు. సో క్యాన్సిలన్నది పుకారుగానే చూడాలి. 

ప్రస్తుతం విజయ్ చిన్న బ్రేక్ తీసుకున్నా ముందు ఫ్యామిలీ స్టార్ పూర్తి చేయాలి. ఫారిన్ షెడ్యూల్ ఆలస్యం కావడంతో సంక్రాంతి సీజన్ మిస్ అయిన ఈ ఎంటర్ టైనర్ కి పరుశురాం దర్శకుడు. దీని కోసమే సితార సంస్థ విడి 12 షూటింగ్ ని వాయిదా వేసుకుంది. ఈలోగా గౌతమ్ తిన్ననూరి అంతా కొత్తవాళ్లతో ఇంకో సినిమా పూర్తి చేశాడు. ప్రస్తుతం దాని పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసమే బిజీగా తిరుగుతున్నాడు. ఈ ప్రాజెక్టుకి అనిరుద్ రవిచందరే సంగీతం సమకూరుస్తున్నాడు. రీ రికార్డింగ్ ని వీలైనంత వేగంగా ఇస్తానని మాట ఇవ్వడంతో ఇద్దరూ దాని మీదే బిజీగా ఉన్న మాట వాస్తవం. 

ఫిబ్రవరి నుంచి విడి 12 రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. నిర్మాత నాగవంశీ గతంలోనే ఇది చాలా పెద్ద ప్యాన్ ఇండియా మూవీ అవుతుందని, అంచనాలకు మించి ఉంటుందని చెప్పారు. కానీ గుంటూరు కారం ఒత్తిడి, రిలీజ్ వ్యవహారాలతో బిజీగా ఉండి విజయ్ దేవరకొండ సినిమా ప్రస్తావన ఎక్కడా రాలేదు. త్వరలో ఎలాగూ గ్యాంగ్స్ అఫ్ గోదావరి, టిల్లు స్క్వేర్ ప్రమోషన్ల కోసం అందుబాటులోకి వస్తారు కాబట్టి అప్పుడీ గాసిప్ గురించి పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. ఖుషి ఆశించిన స్థాయిలో పెద్ద ఫలితం అందుకోకపోవడంతో విజయ్ ఆశలన్నీ ఈ రెండు సినిమాల మీదే ఉన్నాయి. 

This post was last modified on January 17, 2024 11:22 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

3 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

5 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

9 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

9 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

10 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

10 hours ago