తెలుగు సినిమాలు సంబంధించి క్రేజీయెస్ట్ సీజన్ అంటే సంక్రాంతినే అనడంలో మరో మాట లేదు. రిలీజ్ అయ్యే సినిమాలకు మంచి టాక్ వస్తే మామూలుగా వచ్చేదాంతో పోలిస్తే 20 30 శాతం అదనపు వసూళ్లు వస్తాయి. అలవైకుంఠ పురములో, వాల్తేరు వీరయ్య లాంటి చిత్రాలు వాటి స్థాయిని మించి వసూళ్ల మోత మోగించాయంటే అందుకు కారణం సంక్రాంతికి రిలీజ్ కావడమే.
అందుకే ఈ పండక్కి సినిమాలను రిలీజ్ చేయడానికి నిర్మాతలు పోటీ పడతారు. చాలా ముందు నుంచే బెర్తులు బుక్ చేసుకుంటారు. అయితే సంక్రాంతికి హిట్ టాక్ వస్తే అదనపు వసూళ్లు రావడం నిజమే కానీ.. ఈ టైంలో పోటీ ఎక్కువ ఉంటే థియేటర్లు ఆశించిన స్థాయిలో దక్కవు. దీనికి తోడు టాక్ తేడా కొట్టిందంటే దారుణంగా దెబ్బతింటుందా సినిమా.
సంక్రాంతి మీద భారీ ఆశలతో రిలీజ్ అయ్యి దారుణంగా దెబ్బతిన్న సినిమాలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. ఓపెనింగ్స్ వరకు ఓ మోస్తరుగా రాబట్టి.. పోటీలో ఉన్న మిగతా సినిమాలో దూకుడు ముందు వెలవెలబోయి అడ్రస్ లేకుండా పోయాయి ఆ చిత్రాలు. గత కొన్నేళ్ళలో పరిస్థితి గమనిస్తే.. ఎన్టీఆర్ కథానాయకుడు, అజ్ఞాతవాసి, ఎంత మంచి వాడవురా లాంటి సినిమాలు ఇందుకు ఉదాహరణ. ఇక ఈ ఏడాది సైంధవ్ ఈ జాబితాలో చేరేలా కనిపిస్తోంది. సంక్రాంతి సినిమాలన్నింటిలోకి బ్యాడ్ టాక్ తెచ్చుకున్నది ఇదే.
హనుమాన్ బెస్ట్ టాక్ తో ప్రభంజనం సృష్టిస్తుండగా.. గుంటూరు కారం, నా సామిరంగ ఓ మోస్తరుగా ఆడుతున్నాయి. కానీ సైంధవ్ పరిస్థితి దారుణంగా ఉంది. ఈ సినిమా ఏ దశలోనూ పికప్ కాలేదు. ఓపెనింగ్స్ కూడా అంతంత మాత్రమే వచ్చాయి. వేరే సినిమాల ఓవర్ ప్లోస్ తో కొంత వరకు నడిచింది కానీ.. అంతిమంగా సినిమా డిజాస్టర్ అని చెప్పాలి. కాబట్టి క్రేజీ సీజన్ అని సంక్రాంతికి రిలీజ్ చేయడం బాగానే ఉంది కానీ కంటెంట్ విషయంలో కొంచెం ముందు వెనక చూసుకుంటే బెటర్.
This post was last modified on January 16, 2024 9:27 pm
ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…
ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో చెలరేగిన హింసపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం…