ఇది చిన్న సినిమా కదాని ఇండస్ట్రీ పెద్దలతో అనిపించుకున్న హనుమాన్ వారం రోజులు తిరక్కుండానే 100 కోట్ల గ్రాస్ సాధించింది. తేజ సజ్జ లాంటి అప్ కమింగ్ హీరోతో ఈ ఫీట్ సాధించడంతో దర్శకుడు ప్రశాంత్ వర్మ పేరు మారుమ్రోగిపోతోంది. తీసుకున్నది ఫాంటసీ జానరే అయినప్పటికీ దాన్ని కనెక్ట్ అయ్యేలా చెప్పిన విధానం, భక్తిని ఎమోషనల్ గా ప్రెజెంట్ చేసిన తీరు అన్ని వర్గాల ప్రేక్షకులను ఊపేస్తోంది. ఓవర్సీస్ లో ఏకంగా మూడు మిలియన్ మార్క్ దాటడం గురించి అక్కడి ట్రేడ్ వర్గాలు షాక్ తిన్నాయి. లాభాలు ఏ స్థాయిలో ఉంటాయో ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టం.
ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠాలు కొన్నున్నాయి. హీరో స్థాయి చిన్నా పెద్దా ఏదైనా కావొచ్చు. ముందు కంటెంట్ ముఖ్యం. కేవలం గ్రాఫిక్స్ వల్ల సినిమా ఆడే పనైతే చిరంజీవి అంజి చరిత్ర సృష్టించాలి. కానీ ప్రశాంత్ వర్మ చేసి చూపించాడు. కోడి రామకృష్ణ గారంత అనుభవం లేకపోయినా ఇప్పటి ఆడియన్స్ పల్స్ మీద పట్టు సాధించాడు. బడ్జెట్ ని కంట్రోల్ లో పెడుతూనే విజువల్ ఎఫెక్ట్స్ శభాష్ అనిపించుకునేలా ఎలా వాడాలో ఒక ఉదాహరణగా నిలిచాడు. ఈ మూవీ మేకింగ్ మీద ప్రత్యేకంగా వీడియోలు, ఇంటర్వ్యూలు చేస్తే బాగుంటుందని ఫిలిం మేకర్స్ కోరుతున్నారు.
ప్రేక్షకులు క్యాస్టింగ్ ని పట్టించుకుంటారనే భ్రమలను గత ఏడాది బలగం తొలగిస్తే ఇప్పుడు హనుమాన్ దాన్ని బలపరిచింది. రెండు సినిమాల్లో మాట్లాడింది కథా కథనాలే తప్ప హీరోలు కాదు. సంగీతం విషయంలో తీసుకోవాల్సిన శ్రద్ధ కూడా ప్రశాంత్ వర్మ టేస్ట్ లో కనిపించింది. సగటు జనాలకు అంతగా పరిచయం లేని గౌర హరితో గూస్ బంప్స్ వచ్చేలా బీజీఎమ్ రాబట్టుకోవడం చిన్న విషయం కాదు. ఆ టాలెంట్ ని పసిగట్టడమూ తెలివే. బడ్జెట్ పరంగా వందల కోట్లు ఖర్చు పెట్టకపోయినా మాయాజాలం చేసిన హనుమాన్ ఫైనల్ రన్ ,లోపు ఇంకెన్ని అద్భుతాలు చేస్తాడో వేచి చూడాలి.
This post was last modified on January 16, 2024 8:07 pm
https://www.youtube.com/watch?v=ddmpaI3WTvc
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కౌంట్ డౌన్ వేగంగా జరిగిపోతోంది. మార్చి 26 రావాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ హఠాత్తుగా మార్చి…
టాలీవుడ్ మోస్ట్ క్రేజీ మూవీస్ లో ఒకటిగా నిర్మాణంలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ ప్యాన్ ప్యాన్…
విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో పీజీ వైద్య విద్యార్థిని బత్తుల దీపిక ఆత్మహత్య కేసులో కీలక మలుపు తిరిగింది.…
ఏపీలో కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న జనసేన పార్టీ.. ఈ ఏడాది పార్టీ సభ్యత్వాన్ని గత నెలలోనే ప్రారంభించిన…
పార్టీ విధానాలకు, సిద్ధాంతాలకు అనుగుణంగా నాయకులు పనిచేయాలని.. ఎమ్మెల్యేలు-ఎంపీలు కలివిడిగా ఉండాలని సీఎం చంద్రబాబు టీడీపీ నాయకులకు సూచించారు. నంద్యాల…