పండగ సినిమాల్లో ఆఖరిగా విడుదలైన నా సామిరంగ టాక్ అభిమానులను సంతోషంలో ముంచెత్తుతోంది. చాలా కాలం తర్వాత నాగార్జున చిత్రానికి తెల్లవారుఝామున బెనిఫిట్ షోలు వేస్తే అవన్నీ ఫుల్ కావడం ఎప్పుడో కొన్నేళ్ల క్రితం జరిగేది కానీ మళ్ళీ ఇప్పుడు సాధ్యమయ్యింది. రేంజ్ గురించి, బాక్సాఫీస్ ఫిగర్స్ గురించి అప్పుడే చెప్పలేం కానీ నిరాశ పరచని విధంగా రివ్యూలు, పబ్లిక్ టాక్ అయితే వచ్చేశాయి. నాగార్జున, అల్లరి నరేష్ ల బాండింగ్ తో పాటు మాస్ కి కావాల్సిన మసాలా ఫైట్లని తీర్చిదిద్దిన తీరు ఆడియన్స్ నుంచి భారీ స్పందన వచ్చేలా చేసుకుంది.
దీనికి మంచి దొంగకు కనెక్షన్ ఏంటంటే పాయింట్ కు వద్దాం. నా సామిరంగ కథ ప్రకారం 1988లో జరుగుతుంది. ఓ సందర్భంలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కలిసి టౌన్ లో ఉన్న థియేటర్ లో ఈ సినిమాకు వెళ్తారు. టికెట్లు దొరక్క లేడీస్ సహాయం తీసుకోవడం, బీడీ వెలిగిస్తూ నరేష్ బొమ్మ చూడటం ఇలా జరిగిపోతుంది. కాకతాళీయంగా అదే సంవత్సరం జనవరి 14నే మంచి దొంగ రిలీజయ్యింది. ఇప్పుడు నా సామిరంగ రిలీజ్ డేట్ కూడా ఇదే. అంటే దర్శకుడు విజయ్ బిన్నీ, రచయిత ప్రసన్న కుమార్ ఈ విషయంలో తగిన రీసర్చ్ చేసి మరీ టైమింగ్ కుదిరేలా ప్లాన్ చేసుకోవడం బాగుంది.
గుంటూరు కారంలో కూడా మహేష్ బాబు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లినప్పుడు తన గురించి చెప్పుకుంటూ నేను చిరంజీవి స్వయంకృషి టైపని చెప్పడం బాగా పేలింది. ఈ విధంగా రెండు సినిమాల్లో చిరుని వాడుకున్నారు. నాగార్జున, చిరంజీవిల మధ్య అంత బాండింగ్ ఉంది కాబట్టే అదే సంవత్సరం అదే తేదీకి రిలీజైన వెంకటేష్ రక్త తిలకం కాకుండా మంచి దొంగను పెట్టారు. సినిమాలో కీలకమైన మలుపుకి, క్లైమాక్స్ కి దారి తీసేది ఈ ఎపిసోడే. ప్రస్తుతానికి సంక్రాంతి రెండో విజేతగా నా సామిరంగనే నిలుస్తుందని అంచనా ఉంది కానీ ఇంకో వారం రోజులు ఆగితే పూర్తి క్లారిటీ వస్తుంది.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…