పండగ సినిమాల్లో ఆఖరిగా విడుదలైన నా సామిరంగ టాక్ అభిమానులను సంతోషంలో ముంచెత్తుతోంది. చాలా కాలం తర్వాత నాగార్జున చిత్రానికి తెల్లవారుఝామున బెనిఫిట్ షోలు వేస్తే అవన్నీ ఫుల్ కావడం ఎప్పుడో కొన్నేళ్ల క్రితం జరిగేది కానీ మళ్ళీ ఇప్పుడు సాధ్యమయ్యింది. రేంజ్ గురించి, బాక్సాఫీస్ ఫిగర్స్ గురించి అప్పుడే చెప్పలేం కానీ నిరాశ పరచని విధంగా రివ్యూలు, పబ్లిక్ టాక్ అయితే వచ్చేశాయి. నాగార్జున, అల్లరి నరేష్ ల బాండింగ్ తో పాటు మాస్ కి కావాల్సిన మసాలా ఫైట్లని తీర్చిదిద్దిన తీరు ఆడియన్స్ నుంచి భారీ స్పందన వచ్చేలా చేసుకుంది.
దీనికి మంచి దొంగకు కనెక్షన్ ఏంటంటే పాయింట్ కు వద్దాం. నా సామిరంగ కథ ప్రకారం 1988లో జరుగుతుంది. ఓ సందర్భంలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కలిసి టౌన్ లో ఉన్న థియేటర్ లో ఈ సినిమాకు వెళ్తారు. టికెట్లు దొరక్క లేడీస్ సహాయం తీసుకోవడం, బీడీ వెలిగిస్తూ నరేష్ బొమ్మ చూడటం ఇలా జరిగిపోతుంది. కాకతాళీయంగా అదే సంవత్సరం జనవరి 14నే మంచి దొంగ రిలీజయ్యింది. ఇప్పుడు నా సామిరంగ రిలీజ్ డేట్ కూడా ఇదే. అంటే దర్శకుడు విజయ్ బిన్నీ, రచయిత ప్రసన్న కుమార్ ఈ విషయంలో తగిన రీసర్చ్ చేసి మరీ టైమింగ్ కుదిరేలా ప్లాన్ చేసుకోవడం బాగుంది.
గుంటూరు కారంలో కూడా మహేష్ బాబు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లినప్పుడు తన గురించి చెప్పుకుంటూ నేను చిరంజీవి స్వయంకృషి టైపని చెప్పడం బాగా పేలింది. ఈ విధంగా రెండు సినిమాల్లో చిరుని వాడుకున్నారు. నాగార్జున, చిరంజీవిల మధ్య అంత బాండింగ్ ఉంది కాబట్టే అదే సంవత్సరం అదే తేదీకి రిలీజైన వెంకటేష్ రక్త తిలకం కాకుండా మంచి దొంగను పెట్టారు. సినిమాలో కీలకమైన మలుపుకి, క్లైమాక్స్ కి దారి తీసేది ఈ ఎపిసోడే. ప్రస్తుతానికి సంక్రాంతి రెండో విజేతగా నా సామిరంగనే నిలుస్తుందని అంచనా ఉంది కానీ ఇంకో వారం రోజులు ఆగితే పూర్తి క్లారిటీ వస్తుంది.
This post was last modified on January 14, 2024 9:01 pm
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…