పండగ సినిమాల్లో ఆఖరిగా విడుదలైన నా సామిరంగ టాక్ అభిమానులను సంతోషంలో ముంచెత్తుతోంది. చాలా కాలం తర్వాత నాగార్జున చిత్రానికి తెల్లవారుఝామున బెనిఫిట్ షోలు వేస్తే అవన్నీ ఫుల్ కావడం ఎప్పుడో కొన్నేళ్ల క్రితం జరిగేది కానీ మళ్ళీ ఇప్పుడు సాధ్యమయ్యింది. రేంజ్ గురించి, బాక్సాఫీస్ ఫిగర్స్ గురించి అప్పుడే చెప్పలేం కానీ నిరాశ పరచని విధంగా రివ్యూలు, పబ్లిక్ టాక్ అయితే వచ్చేశాయి. నాగార్జున, అల్లరి నరేష్ ల బాండింగ్ తో పాటు మాస్ కి కావాల్సిన మసాలా ఫైట్లని తీర్చిదిద్దిన తీరు ఆడియన్స్ నుంచి భారీ స్పందన వచ్చేలా చేసుకుంది.
దీనికి మంచి దొంగకు కనెక్షన్ ఏంటంటే పాయింట్ కు వద్దాం. నా సామిరంగ కథ ప్రకారం 1988లో జరుగుతుంది. ఓ సందర్భంలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కలిసి టౌన్ లో ఉన్న థియేటర్ లో ఈ సినిమాకు వెళ్తారు. టికెట్లు దొరక్క లేడీస్ సహాయం తీసుకోవడం, బీడీ వెలిగిస్తూ నరేష్ బొమ్మ చూడటం ఇలా జరిగిపోతుంది. కాకతాళీయంగా అదే సంవత్సరం జనవరి 14నే మంచి దొంగ రిలీజయ్యింది. ఇప్పుడు నా సామిరంగ రిలీజ్ డేట్ కూడా ఇదే. అంటే దర్శకుడు విజయ్ బిన్నీ, రచయిత ప్రసన్న కుమార్ ఈ విషయంలో తగిన రీసర్చ్ చేసి మరీ టైమింగ్ కుదిరేలా ప్లాన్ చేసుకోవడం బాగుంది.
గుంటూరు కారంలో కూడా మహేష్ బాబు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లినప్పుడు తన గురించి చెప్పుకుంటూ నేను చిరంజీవి స్వయంకృషి టైపని చెప్పడం బాగా పేలింది. ఈ విధంగా రెండు సినిమాల్లో చిరుని వాడుకున్నారు. నాగార్జున, చిరంజీవిల మధ్య అంత బాండింగ్ ఉంది కాబట్టే అదే సంవత్సరం అదే తేదీకి రిలీజైన వెంకటేష్ రక్త తిలకం కాకుండా మంచి దొంగను పెట్టారు. సినిమాలో కీలకమైన మలుపుకి, క్లైమాక్స్ కి దారి తీసేది ఈ ఎపిసోడే. ప్రస్తుతానికి సంక్రాంతి రెండో విజేతగా నా సామిరంగనే నిలుస్తుందని అంచనా ఉంది కానీ ఇంకో వారం రోజులు ఆగితే పూర్తి క్లారిటీ వస్తుంది.
This post was last modified on January 14, 2024 9:01 pm
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…