థియేటర్లలో హనుమాన్ సునామి మాములుగా లేదు. తొలుత చిన్న సినిమాగా వర్ణించబడి ఇప్పుడు ఆఖరికి అదే పెద్ద మూవీగా మారుతున్న క్రమాన్ని చూసి తలలు పండిన డిస్ట్రిబ్యూటర్లే ఆశ్చర్యపోతున్నారు. ఇంత స్పందన ఊహించలేదని, ఎంత పాజిటివ్ టాక్ వచ్చినా మంచి నెంబర్స్ వస్తాయని ఆశించామే తప్ప ఏకంగా రికార్డులు బద్దలు కొట్టే స్థాయిలో ఊపందుకుందని ఒప్పుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో షోల కౌంట్ అనూహ్యంగా పెంచేస్తున్నారు. అయినా సరే డిమాండ్ కు తగ్గ సప్లై లేక ఆన్ లైన్ లో పెట్టిన నిమిషాల వ్యవధిలోనే టికెట్లు అమ్ముడుపోతున్నాయి.
ఉదాహరణకు హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్ లో రేపు సోమవారం హనుమాన్ కు 15 షోలు వేస్తే గుంటూరు కారంకి 7 కేటాయించారు. బాలన్స్ వి ఇతర కొత్త రిలీజులు పంచుకుంటున్నాయి. సిటీ కాబట్టి ఇలా ఉందనుకోవడానికి లేదు. కర్నూలు లాంటి జిల్లా కేంద్రంలో తేజకు 27 షోలు పడితే మహేష్ 24 షోలతో సరిపెట్టాల్సి వస్తోంది. నాలుగో రోజు ఉదయం 8 గంటల షోలు వేయడం స్టార్ హీరోలకు సాధారణం. కానీ హనుమాన్ ఆ ట్రెండ్ ని కూడా బ్రేక్ చేసింది. ఓవర్సీస్ లో ఆల్రెడీ 2 మిలియన్ మార్క్ దాటే దిశగా పరుగులు పెడుతూ చివరికి షాకిచ్చే నెంబర్లను నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
తూర్పు గోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో టికెట్ రేట్లు కూడా పెంచుతారని టాక్ ఉంది. ప్రభుత్వం విధించిన గరిష్ట పరిమితికి లోబడే ఇప్పుడున్న ధరలను సవరిస్తారట. మొత్తానికి హనుమాన్ ర్యాంపేజ్ మాములుగా లేదు. ఇప్పటిదాకా రెండు రోజులకు 45 కోట్లకు పైగా గ్రాస్ తో 25 కోట్ల షేర్ సాధించిన హనుమాన్ బ్రేక్ ఈవెన్ కి కేవలం ఇంకో ఆరు కోట్ల దూరంలో మాత్రమే ఉందట. వీకెండ్ లెక్కలు తేలేలోపు ఆ లాంఛనం అయిపోతుంది. ఇకపై వచ్చేవన్నీ లాభాలే. నార్త్ లో ఫస్ట్ డే రెండు కోట్లు వస్తే రెండో రోజులు నాలుగున్నర దాటేసింది. మెర్రీ క్రిస్మస్ ని పూర్తిగా టేకోవర్ చేసి మరీ అదరగొడుతోంది.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…