టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాల హడావిడిలో పడిపోయాం కానీ ఒక డబ్బింగ్ మూవీ వచ్చిన సంగతే చాలా మంది ప్రేక్షకులకు తెలియలేదు. అదే మెర్రీ క్రిస్మస్. విజయ్ సేతుపతి-కత్రినా కైఫ్ జంటగా అందాదున్ ఫేమ్ శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో ఇది రూపొందింది. తెలుగులో అనువదించి మొన్న జనవరి 12నే గుంటూరు కారం, హనుమాన్ లతో పాటు సమాంతరంగా విడుదల చేశారు. థియేటర్లు ఎక్కువ అందుబాటులో లేకపోవడంతో కొన్ని సెంటర్లలో చాలా పరిమిత స్క్రీన్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక వర్గం ఆడియన్స్ లో అంచనాలైతే ఉన్నాయి. ఇంతకీ బొమ్మ రిపోర్ట్ ఏంటో చూద్దాం.
ఏడు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి బయటికొచ్చిన ఆల్బర్ట్(విజయ్ సేతుపతి)కి తల్లి చనిపోయిన విషయం తెలుస్తుంది. విసుగ్గా ఉండటంతో ఓ రెస్టారెంట్ కు వెళ్తే మరియా(కత్రినా కైఫ్)కనిపించి ఆమె ఆకర్షణలో పడతాడు. ఫాలో అవుతూ ఇంటికెళ్ళిపోతాడు. దగ్గరయ్యే క్రమంలో మరియా భర్త హఠాత్తుగా ఆత్మహత్య చేసుకుంటాడు. దీంతో భయపడిన ఆల్బర్ట్ తన గుర్తులు లేకుండా ఘటనా స్థలం నుంచి మాయమవుతాడు. కొద్దిరోజుల తర్వాత మరియా ఏమి జరగనట్టు కూతురితో పాటు చర్చిలో కనిపిస్తుంది. దీంతో అనుమానం వచ్చిన అల్బర్ట్ ఫాలో చేస్తాడు. ఇక్కడి నుంచి ఊహించని పరిణామాలు తలెత్తుతాయి.
ఫ్రెంచ్ నవల లా మేంటి చార్ట్ ఆధారంగా శ్రీరామ్ రాఘవన్ దీన్ని తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ నెరేషన్ చాలా నెమ్మదిగా ఉండటం వల్ల ఈ జానర్ ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు తప్ప అంత త్వరగా కనెక్ట్ కాలేరు. గంటకు పైగానే సాగతీతగా అనిపిస్తుంది. రిపీట్ సన్నివేశాలు విసుగు తెప్పిస్తాయి. అసలు ట్విస్టు మొదలయ్యాక కథనం వేగమందుకుంటుంది. ముఖ్యంగా చివరి అరగంట రాఘవన్ తనదైన స్క్రీన్ ప్లేతో షాక్ ఇస్తారు. ఆర్టిస్టులు తక్కువగా ఉన్నా బాగా నటించారు. కత్రినా ప్లాస్టిక్ ఎక్స్ ప్రెషన్లతో నెట్టుకొచ్చింది. సగం పైగా ల్యాగ్ తో సాగే మెర్రీ క్రిస్మస్ ని ముందే సిద్ధపడితే తప్ప చివరిదాకా కన్నార్పకుండా చూడటం కష్టం.
This post was last modified on January 13, 2024 9:44 pm
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…