సోషల్ మీడియాతో పాటు పబ్లిక్ లో మిక్స్డ్ టాక్ హోరెత్తిపోతున్న వేళ గుంటూరు కారం నిర్మాత నాగవంశీ, నైజామ్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఇవాళ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. నేరుగా పేర్లు ప్రస్తావించకపోయినా ఇటీవల జరిగిన పరిణామాల గురించి కొంత స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రతి సంవత్సరం సంక్రాంతికి పంచాయితీలు సహజమేనని, ఇక్కడ ప్రత్యేకంగా మిత్రులు శత్రువులు ఎవరూ ఉండరని, పెట్టుబడి పెట్టిన వాళ్ళు దాన్ని వీలైనంత త్వరగా వెనక్కు రాబట్టుకోవడం కోసం వ్యాపారం చేస్తారు తప్పించి కావాలని ఎవరిని అణిచి వేయడం ఉండదనే అర్థంలో వివరణ ఇచ్చారు.
అర్ధరాత్రి ఒంటి గంట షోల వల్ల కొంత నెగటివ్ టాక్ వచ్చినా తర్వాతి రోజు నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ వస్తున్నారని, నిన్న సుదర్శన్ థియేటర్ కు రెండో సారి గుంటూరు కారం చూసేందుకు వెళ్ళినప్పుడు ఇదే అర్థమయ్యిందని, బాగున్న సినిమాని ఎవరూ ఆపలేరని నొక్కి చెప్పారు. అయితే వివాదాస్పద అంశాలకు సంబంధించి ఎక్కువ మాట్లాడేందుకు దిల్ రాజు ఇష్టపడలేదు. నాగవంశీ ఆదరణ బాగుందని చెబుతూ, ఇంకేదో అడగబోతూ పక్కనున్న దిల్ రాజు చెవిలో గుసగుస లాడటం, ఆయన వద్దని వారించడం కెమెరా దృష్టిలో పడింది. నేనే భయపెట్టానని దిల్ రాజు నవ్వుతు సర్దిచెప్పారు.
అఫీషియల్ గా 94 కోట్లు గ్రాస్ వచ్చిందని గుంటూరు కారం ప్రకటించింది. షేర్ రూపంలో నలభై అయిదు కోట్ల దాకా వస్తుంది. వీకెండ్ తో పాటు వరస సెలవుల వల్ల బుకింగ్స్ బాగానే ఉన్నాయి. ఈ హడావిడి అంతా నాలుగైదు రోజుల వరకేనని ఆ తర్వాత ప్రతి శుక్రవారం కొత్త సినిమాల పనులు, విశేషాలతో కొనసాగుతుందని దిల్ రాజు చెప్పారు. కలెక్షన్లని బట్టే సినిమా ఏ స్థాయిలో బ్లాక్ బస్టరో అర్థం చేసుకోవచ్చనే హింట్ కూడా ఇచ్చారు. హనుమాన్ తో గట్టి పోటీ ఎదురవుతున్న వేళ గుంటూరు కారంకు బుధవారం దాకా రన్ చాలా కీలకం కానుంది. బలంగా హోల్డ్ చేసుకుంటే బ్రేక్ ఈవెన్ కు ఛాన్స్ ఉంటుంది.
This post was last modified on January 13, 2024 4:33 pm
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లో కొన్న 681 గజాల స్థలం విషయంలో వివాదం నెలకొందని, ఆ స్థలం…
రాజకీయాల్లో సెంటిమెంటుకు ఛాన్స్ ఎక్కువ. ఉద్ధండ నాయకుల నుంచి చరిత్ర సొంతం చేసుకున్న పార్టీల వరక కూడా సెంటి మెంటుకు…
వైసీపీ నాయకులు సహా సలహాదారు సజ్జల రామకృష్నారెడ్డి కళ్లలో భయం కనిపిస్తోందని ఆ పార్టీ రెబల్ ఎంపీ, ఉండి నుంచి…