సోషల్ మీడియాతో పాటు పబ్లిక్ లో మిక్స్డ్ టాక్ హోరెత్తిపోతున్న వేళ గుంటూరు కారం నిర్మాత నాగవంశీ, నైజామ్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఇవాళ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. నేరుగా పేర్లు ప్రస్తావించకపోయినా ఇటీవల జరిగిన పరిణామాల గురించి కొంత స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రతి సంవత్సరం సంక్రాంతికి పంచాయితీలు సహజమేనని, ఇక్కడ ప్రత్యేకంగా మిత్రులు శత్రువులు ఎవరూ ఉండరని, పెట్టుబడి పెట్టిన వాళ్ళు దాన్ని వీలైనంత త్వరగా వెనక్కు రాబట్టుకోవడం కోసం వ్యాపారం చేస్తారు తప్పించి కావాలని ఎవరిని అణిచి వేయడం ఉండదనే అర్థంలో వివరణ ఇచ్చారు.
అర్ధరాత్రి ఒంటి గంట షోల వల్ల కొంత నెగటివ్ టాక్ వచ్చినా తర్వాతి రోజు నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ వస్తున్నారని, నిన్న సుదర్శన్ థియేటర్ కు రెండో సారి గుంటూరు కారం చూసేందుకు వెళ్ళినప్పుడు ఇదే అర్థమయ్యిందని, బాగున్న సినిమాని ఎవరూ ఆపలేరని నొక్కి చెప్పారు. అయితే వివాదాస్పద అంశాలకు సంబంధించి ఎక్కువ మాట్లాడేందుకు దిల్ రాజు ఇష్టపడలేదు. నాగవంశీ ఆదరణ బాగుందని చెబుతూ, ఇంకేదో అడగబోతూ పక్కనున్న దిల్ రాజు చెవిలో గుసగుస లాడటం, ఆయన వద్దని వారించడం కెమెరా దృష్టిలో పడింది. నేనే భయపెట్టానని దిల్ రాజు నవ్వుతు సర్దిచెప్పారు.
అఫీషియల్ గా 94 కోట్లు గ్రాస్ వచ్చిందని గుంటూరు కారం ప్రకటించింది. షేర్ రూపంలో నలభై అయిదు కోట్ల దాకా వస్తుంది. వీకెండ్ తో పాటు వరస సెలవుల వల్ల బుకింగ్స్ బాగానే ఉన్నాయి. ఈ హడావిడి అంతా నాలుగైదు రోజుల వరకేనని ఆ తర్వాత ప్రతి శుక్రవారం కొత్త సినిమాల పనులు, విశేషాలతో కొనసాగుతుందని దిల్ రాజు చెప్పారు. కలెక్షన్లని బట్టే సినిమా ఏ స్థాయిలో బ్లాక్ బస్టరో అర్థం చేసుకోవచ్చనే హింట్ కూడా ఇచ్చారు. హనుమాన్ తో గట్టి పోటీ ఎదురవుతున్న వేళ గుంటూరు కారంకు బుధవారం దాకా రన్ చాలా కీలకం కానుంది. బలంగా హోల్డ్ చేసుకుంటే బ్రేక్ ఈవెన్ కు ఛాన్స్ ఉంటుంది.
టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు యువ హీరోయిన్ రాశీ సింగ్ గట్టిగానే ప్రయత్నిస్తోంది. మొదటి నుంచి…
క్రిస్టఫర్ నోలన్ కొత్త సినిమా ‘ది ఒడిస్సీ’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. ప్రపంచ చరిత్రలో ఎంతో ప్రత్యేకంగా చెప్పుకునే గ్రీక్, ట్రాయ్…
72వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ నటుడు అవార్డు పుష్ప 2కి గాను అల్లు అర్జున్ కి మరోసారి రావొచ్చేమో అని…
క, కె ర్యాంప్ ఊపులో ఉన్న కిరణ్ అబ్బవరంకు మధ్యలో దిల్ రుబా ఒకటే షాక్ ఇచ్చింది కానీ దాని…
తెలుగు సినిమాలో స్క్రీన్ ప్లే అనగానే గుర్తుకొచ్చే పేరు.. సుకుమార్. ఈ లెక్కల మాస్టారి కథన నైపుణ్యం గురించి ఎంత…
72వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ప్రకటించింది. 2024 సంవత్సరానికిగాను జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న…