Movie News

మిత్రులు శత్రువులు ఎవరూ లేరు – దిల్ రాజు

సోషల్ మీడియాతో పాటు పబ్లిక్ లో మిక్స్డ్ టాక్ హోరెత్తిపోతున్న వేళ గుంటూరు కారం నిర్మాత నాగవంశీ, నైజామ్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఇవాళ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. నేరుగా పేర్లు ప్రస్తావించకపోయినా ఇటీవల జరిగిన పరిణామాల గురించి కొంత స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రతి సంవత్సరం సంక్రాంతికి పంచాయితీలు సహజమేనని, ఇక్కడ ప్రత్యేకంగా మిత్రులు శత్రువులు ఎవరూ ఉండరని, పెట్టుబడి పెట్టిన వాళ్ళు దాన్ని వీలైనంత త్వరగా వెనక్కు రాబట్టుకోవడం కోసం వ్యాపారం చేస్తారు తప్పించి కావాలని ఎవరిని అణిచి వేయడం ఉండదనే అర్థంలో వివరణ ఇచ్చారు.

అర్ధరాత్రి ఒంటి గంట షోల వల్ల కొంత నెగటివ్ టాక్ వచ్చినా తర్వాతి రోజు నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ వస్తున్నారని, నిన్న సుదర్శన్ థియేటర్ కు రెండో సారి గుంటూరు కారం చూసేందుకు వెళ్ళినప్పుడు ఇదే అర్థమయ్యిందని, బాగున్న సినిమాని ఎవరూ ఆపలేరని నొక్కి చెప్పారు. అయితే వివాదాస్పద అంశాలకు సంబంధించి ఎక్కువ మాట్లాడేందుకు దిల్ రాజు ఇష్టపడలేదు. నాగవంశీ ఆదరణ బాగుందని చెబుతూ, ఇంకేదో అడగబోతూ పక్కనున్న దిల్ రాజు చెవిలో గుసగుస లాడటం, ఆయన వద్దని వారించడం కెమెరా దృష్టిలో పడింది. నేనే భయపెట్టానని దిల్ రాజు నవ్వుతు సర్దిచెప్పారు.

అఫీషియల్ గా 94 కోట్లు గ్రాస్ వచ్చిందని గుంటూరు కారం ప్రకటించింది. షేర్ రూపంలో నలభై అయిదు కోట్ల దాకా వస్తుంది. వీకెండ్ తో పాటు వరస సెలవుల వల్ల బుకింగ్స్ బాగానే ఉన్నాయి. ఈ హడావిడి అంతా నాలుగైదు రోజుల వరకేనని ఆ తర్వాత ప్రతి శుక్రవారం కొత్త సినిమాల పనులు, విశేషాలతో కొనసాగుతుందని దిల్ రాజు చెప్పారు. కలెక్షన్లని బట్టే సినిమా ఏ స్థాయిలో బ్లాక్ బస్టరో అర్థం చేసుకోవచ్చనే హింట్ కూడా ఇచ్చారు. హనుమాన్ తో గట్టి పోటీ ఎదురవుతున్న వేళ గుంటూరు కారంకు బుధవారం దాకా రన్ చాలా కీలకం కానుంది. బలంగా హోల్డ్ చేసుకుంటే బ్రేక్ ఈవెన్ కు ఛాన్స్ ఉంటుంది. 

This post was last modified on January 13, 2024 4:33 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏపీ కోరినట్టుగానే.. ‘వాల్తేర్’తోనే విశాఖ రైల్వే జోన్

కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా… అందులో ఎదో ఒక మెలిక ఉండనే ఉంటుంది. ఈ తరహా నిర్ణయాలను కేంద్రం తెలిసి…

44 minutes ago

హమ్మయ్యా… బెర్తులన్నీ సేఫ్

తెలంగాణాలో త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే… ఆ వార్తలన్నింటిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

3 hours ago

ర్యాంకులపై వైసీపీ రచ్చ..చంద్రబాబు కౌంటర్

సీఎం చంద్రబాబుపై ఎప్పుడు బురదజల్లుదామా అనే కాన్సెప్ట్ తో వైసీపీ నేతలు రెడీగా ఉంటారని టీడీపీ నేతలు విమర్శిస్తుంటారు. చంద్రబాబు…

7 hours ago

పేదల గుండెకు బాబు సర్కారు భరోసా

ఏపీలోని పేద ప్రజల గుండెకు భరోసా అందించే దిశగా కూటమి సర్కారు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే అమలులోకి…

8 hours ago

రతన్ టాటా మిస్టరీ ట్విస్ట్.. అతని పేరు మీద 500 కోట్లు

ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా చివరి ఉత్తర్వుల్లో అద్భుత ట్విస్ట్ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా కుటుంబ…

9 hours ago

“జ‌గ‌న్‌ది.. పొలిటిక‌ల్ రేప్‌.. నా మాట విను!”

మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయకుడు సాకే శైల‌జానాథ్‌.. తాజాగా వైసీపీ గూటికి చేరారు. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం…

9 hours ago