విడుదలకు ముందు సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారని ఏవేవో మాటలు. థియేటర్ల పంపకాల్లో తేడా వస్తోందనే వార్తలు తిరిగినప్పుడు నిర్మాత మీదా ఇవే అభాండాలు. అయినా సరే కంటెంట్ మీద నమ్మకంతో సినిమానే మమ్మల్ని నడిపిస్తుందని, థియేటర్లు వాటంతటవే పెరుగుతాయని, ఖచ్చితంగా గెలిచి తీరతామని దర్శకుడు ప్రశాంత్ వర్మ చేసిన శపథం నెరవేరుతోంది. ప్రీమియర్ల నుంచి వచ్చిన అద్భుత స్పందన ఫస్ట్ డే కలెక్షన్ కు అమాంతం దోహదపడింది. తెలంగాణలో ఎక్కువ కాదు కానీ ఏపీలో షోలు, స్క్రీన్లు ఒక్కసారిగా పెరగడం మొదలయ్యాయి. సలార్ ని రీప్లేస్ చేసి మరీ హనుమాన్ కి ఇస్తున్నారు.
బుక్ మై షో ట్రెండ్స్ గమనిస్తే హనుమాన్ సగటు బుకింగ్స్ గంటలు 18 వేల టికెట్ల దాకా ఉండగా గుంటూరు కారం హఠాత్తుగా నెమ్మదించి 12 వేల దగ్గర నడుస్తోంది. ఇది షాకే. టాక్ ప్రభావం చూపించడం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ నైజామ్ లో ఇంకా ఎక్కువ స్క్రీన్లు దొరికి ఉంటే హనుమాన్ రచ్చ ఇంకో స్థాయిలో ఉండేదని బయ్యర్ల కామెంట్. ఇందులో నిజముంది. ఇంకో పక్క ఉత్తరాది రాష్ట్రాల్లో మెల్లగా మొదలైన ఊపు క్రమంగా పెరుగుతోంది. హిందీ స్ట్రెయిట్ రిలీజ్ అయిన మెర్రీ క్రిస్మస్ కంటే హనుమాన్ ని చూసేందుకే ఆడియన్స్ ఇష్టపడుతున్నట్టు గ్రాఫ్ పెరుగుదల సూచిస్తోంది.
సంక్రాంతి రేసులో ఇంకా రెండు సినిమాలు ఉన్నాయి కాబట్టి వాటి స్టేటస్ తేలాకే హనుమాన్ దూకుడు ఏ స్థాయిలో పెరుగుతుందనేది డిసైడ్ అవుతుంది. తేజ సజ్జ లాంటి అప్ కమింగ్ హీరోకి ఇది అనూహ్యమైన ఓపెనింగే. మహేష్ బాబు సునామి ముందు నిలవగలడా అనే అనుమానాలు పటాపంచలు చేస్తూ హనుమంతుడి అండతో తట్టుకోవడం ఇప్పటికిప్పుడు స్టార్ డం తీసుకురాదు కానీ పెద్ద బ్యానర్లు, బడా ప్రొడ్యూసర్లు దగ్గరికొచ్చేలా చేస్తుంది. ఇక ప్రశాంత్ వర్మ సంగతి చెప్పనక్కర్లేదు. జై హనుమాన్ తో పాటు మొత్తం 12 చిత్రాలతో ప్లాన్ చేసుకున్న సినిమాటిక్ యునివర్స్ కి రూట్ క్లియర్ అయినట్టే.
This post was last modified on January 12, 2024 9:08 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…