ఇండస్ట్రీలో ఉన్న ఎవరైనా చివరి సినిమా ఎప్పటికీ గుర్తుండిపోయే మంచి జ్ఞాపకం కావాలని కోరుకుంటారు. అది సహజం. ఏఎన్ఆర్ లాంటి లెజెండ్ కోరిమరీ మనం లాంటి బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుని వెళ్లిపోయారు. తాజాగా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న హనుమాన్ లో రాకేష్ మాస్టర్ ని చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఈయన కొన్ని నెలల క్రితమే కాలం చేశారు. ఒకప్పుడు కొరియోగ్రాఫర్ గా టాప్ స్టార్స్ కి స్టెప్స్ కంపోజ్ చేసి, తర్వాత బ్రేక్ తీసుకుని, రీ ఎంట్రీలో యూట్యూబ్ ఛానల్స్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న రాకేష్ మాస్టర్ కి హనుమాన్ లో చెప్పుకోదగ్గ పాత్రే దక్కింది.
దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆయన పోకముందే షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. ఊరిని వేధించే విలన్ తరఫున పన్నులు వసూలు చేస్తూ కామెడీగా నటించే పాత్రలో బాగానే నవ్వులు పూయించారు. రెగ్యులర్ గా కనిపించే గుండు వెనుక ఓ పిలక పెట్టి తేజ సజ్జ చేతిలో తన్నులు తినే పాత్ర స్క్రీన్ మీద పేలింది. చెప్పుకోదగ్గ స్పేస్ దొరికింది. ఒకవేళ బ్రతికి ఉంటే హనుమాన్ సాధించిన సక్సెస్ చూసి ఖచ్చితంగా సంతోషపడే వాళ్ళు. చూసిన ఆడియన్స్ సైతం జీవించి ఉంటే మంచి ఆఫర్లు తలుపు తట్టేవని నిట్టూరుస్తున్నారు. వ్యక్తిగత ప్రవర్తన, కామెంట్లతో రాకేష్ వివాదాల్లో ఇరుక్కునే వారు.
విధి ఎంత విచిత్రమైందో చెప్పడానికి ఇదో ఉదాహరణ. రికార్డులు సృష్టించే దిశగా పరుగులు పెడుతున్న హనుమాన్ కి క్రమంగా థియేటర్లు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అదనపు షోలు వేగంగా యాడ్ అవుతున్నాయి. నైజామ్ లో గుంటూరు కారంతో పాటు ఇతర మూడు సినిమాలకు చేసిన అగ్రిమెంట్ వల్ల వెంటనే ఇవ్వలేకపోతున్నారు కానీ సోమవారం నుంచి పరిస్థితిలో మార్పు ఉంటుందని నైజాం డిస్ట్రిబ్యూటర్లు ఆశిస్తున్నారు. ఏది ఏమైనా రాకేష్ మాస్టర్ ఫ్యాన్స్ కి ఒక మంచి నివాళిగా హనుమాన్ మూవీ ఆయన ఫిల్మోగ్రఫీలో చివరి స్థానాన్ని గౌరవంగా అందించింది.
This post was last modified on January 12, 2024 6:12 pm
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…