ఎల్లుండి విడుదల కాబోతున్న నా సామిరంగ ప్రమోషన్లు ఒక కొలిక్కి వచ్చేస్తున్నాయి. నాగార్జున మెల్లగా రిలాక్స్ అవుతున్నారు. అయితే పోటీ వల్ల కేవలం 300 థియేటర్లతో సర్దుకోవాల్సి వచ్చిందని ఇవాళ జరిగిన ప్రెస్ మీట్ లో వెల్లడించడం ఆశ్చర్యం కలిగించేదే. గతంలో బంగార్రాజుకి కరోనా వల్ల పెద్దగా పోటీ లేకపోవడంతో మంచి రిలీజ్ దక్కి విజయానికి ఉపయోగపడిందని ఈసారి మాత్రం గట్టి కాంపిటీషన్ ని ఫేస్ చేయాల్సి వస్తోందని అన్నారు. ఆల్రెడీ హనుమాన్, గుంటూరు కారం తీర్పులు వచ్చాయి. రేపు ఈ సమయంలోపే వెంకటేష్ మూవీ రిజల్ట్ తెలిసిపోతుంది. మిగిలింది సామిరంగ మాత్రమే.
పోటీదారుల సంగతి ఎలా ఉన్నా నాగార్జున మాత్రం ఖచ్చితంగా హిట్టు కొడతామనే నమ్మకంతో కనిపిస్తున్నారు. పక్కా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కామెడీ, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ అన్నీ కలగలసిన స్క్రిప్ట్ అని ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. లేట్ గా రావడం వల్ల కొంత రిస్క్ ఉన్నప్పటికీ గతంలో జనవరి 14న వచ్చి బ్లాక్ బస్టర్స్ సాధించినవి ఎన్నో ఉన్నాయి. అయితే అప్పటి పరిస్థితులు వేరు. ఇప్పుడు స్క్రీన్ల కొరత వల్ల హనుమాన్ కి ఎంత పాజిటివ్ టాక్ వచ్చినా కౌంట్ పెంచుకోవడానికి కొన్ని ఇబ్బందులైతే పడటం కనిపిస్తోంది.
నా సామిరంగకు కొన్ని తిప్పలు తప్పవు. కాకపోతే పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే కనక 19 దాకా ఉన్న సెలవులను వాడుకుని వసూళ్లు రాబట్టుకోవచ్చు. అన్నిటి కన్నా పెద్ద సానుకూలాంశం ఈ సినిమా పెట్టుకున్న బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇరవై కోట్ల లోపేనని ట్రేడ్ టాక్. సో హిట్ అయితే చాలు రికవరీ సులభంగా ఉంటుంది. పైగా జనవరి చివరి వారం దాకా చెప్పుకోదగ్గ కొత్త రిలీజులు ఏమీ లేవు. టార్గెట్ పెట్టుకున్న మాస్ ని ఆకట్టుకుంటే బిసి సెంటర్లలో పాగా వేయొచ్చు. విజయ్ బిన్నీ దర్శకత్వం వహిస్తున్న నా సామిరంగ ఆశికా రంగనాథ్ హీరోయిన్ కాగా అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ప్రధాన పాత్రలు పోషించారు.
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…