టాకులు, రివ్యూల సంగతి కాసేపు పక్కనపెడితే నిన్న సాయంత్రం నుంచి తెలుగు రాష్ట్రాల థియేటర్లు జనంతో నిండుగా కళకళలాడిపోతున్నాయి. హనుమాన్ ప్రీమియర్లకు ఊహించని భారీ స్పందన దక్కడంతో పాటు ఆడియన్స్ టాక్ చాలా పాజిటివ్ గా ఉండటంతో ఇవాళ్టి నుంచి బొమ్మ బుక్ మై షో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. గంటకు పదహారు వేలకు పైగా టికెట్లు అమ్ముతూ తక్కువ స్క్రీన్లు ఉన్నప్పటికీ దూసుకుపోతోంది. ఇక అర్ధరాత్రి నుంచి హంగామా షురూ చేసిన గుంటూరు కారంది నెక్స్ట్ లెవెల్ సందడి. బెనిఫిట్ షోలతో మొదలుపెట్టి మొదటి రోజు ఓపెనింగ్స్ భారీగా ఉండబోతున్నాయి.
స్కూళ్ళు కాలేజీలకు మొన్నటి నుంచి సెలవులు మొదలైపోవడంతో టైం పాస్ కోసం ఫస్ట్ ఆప్షన్ గా పబ్లిక్ సినిమాలనే ఎంచుకుంటున్నారు. దానికి తగ్గట్టే హనుమంతుడు, మహేష్ బాబు ఇద్దరూ గట్టిగా టికెట్లు తెంపుతున్నారు. రేపు సైంధవ్, ఎల్లుండి నా సామిరంగల ఎంట్రీతో ఇది నెక్స్ట్ లెవెల్ కు వెళ్లబోతోంది. ఈసారి నైజామ్ కు ధీటుగా అన్ని సినిమాల వసూళ్లు ఏపీలోనూ చూడొచ్చు. హైదరాబాద్ నుంచి లక్షలాది జనాలు పండక్కు స్వంత ఊళ్లకు వెళ్లడంతో సహజంగానే బీసీ సెంటర్లలో పెద్ద నెంబర్లు నమోదవుతాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాల వైపు భారీ రికార్డులు పడతాయి.
బాలీవుడ్ లో మెర్రీ క్రిస్మస్, తమిళంలో అయలాన్ – కెప్టెన్ మిల్లర్ లు ఉన్నప్పటికీ వాటికి మన స్థాయిలో ఆదరణ, ఓపెనింగ్స్ ఆయా రాష్ట్రాల్లో కనిపించడం లేదు. దీన్ని బట్టే తెలుగోళ్ల ప్రేమ సినిమా మీద ఎంత ఉందో అర్థమవుతుంది. హనుమాన్ పాజిటివ్, గుంటూరు కారం డివైడ్ టాక్ తో మొదలవ్వగా, సైంధవ్, నా సామిరంగలు కనక మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటే మరిన్ని థియేటర్లు వీటికి సహకరిస్తాయి. ఇప్పటికే హనుమాన్ కు శనివారం నుంచి భారీ సంఖ్యలో షోలు పడతాయని ట్రేడ్ టాక్. ఈ నెల 20 దాకా నాలుగు సినిమాలకు పండగ వసూళ్లు చాలా కీలకం కాబోతున్నాయి.
This post was last modified on January 12, 2024 3:05 pm
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం.. బీఆర్ఎస్కు ఊహించని సంకటం ఎదురైంది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె.. కవిత.. పాత `టీఆర్ ఎస్`…
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…