Movie News

తెలుగోళ్ల సినిమా ప్రేమకు థియేటర్లు ఫుల్

టాకులు, రివ్యూల సంగతి కాసేపు పక్కనపెడితే నిన్న సాయంత్రం నుంచి తెలుగు రాష్ట్రాల థియేటర్లు జనంతో నిండుగా కళకళలాడిపోతున్నాయి. హనుమాన్ ప్రీమియర్లకు ఊహించని భారీ స్పందన దక్కడంతో పాటు ఆడియన్స్ టాక్ చాలా పాజిటివ్ గా ఉండటంతో ఇవాళ్టి నుంచి బొమ్మ బుక్ మై షో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. గంటకు పదహారు వేలకు పైగా టికెట్లు అమ్ముతూ తక్కువ స్క్రీన్లు ఉన్నప్పటికీ దూసుకుపోతోంది. ఇక అర్ధరాత్రి నుంచి హంగామా షురూ చేసిన గుంటూరు కారంది నెక్స్ట్ లెవెల్ సందడి. బెనిఫిట్ షోలతో మొదలుపెట్టి మొదటి రోజు ఓపెనింగ్స్ భారీగా ఉండబోతున్నాయి.

స్కూళ్ళు కాలేజీలకు మొన్నటి నుంచి సెలవులు మొదలైపోవడంతో టైం పాస్ కోసం ఫస్ట్ ఆప్షన్ గా పబ్లిక్ సినిమాలనే ఎంచుకుంటున్నారు. దానికి తగ్గట్టే హనుమంతుడు, మహేష్ బాబు ఇద్దరూ గట్టిగా టికెట్లు తెంపుతున్నారు. రేపు సైంధవ్, ఎల్లుండి నా సామిరంగల ఎంట్రీతో ఇది నెక్స్ట్ లెవెల్ కు వెళ్లబోతోంది. ఈసారి నైజామ్ కు ధీటుగా అన్ని సినిమాల వసూళ్లు ఏపీలోనూ చూడొచ్చు. హైదరాబాద్ నుంచి లక్షలాది జనాలు పండక్కు స్వంత ఊళ్లకు వెళ్లడంతో సహజంగానే బీసీ సెంటర్లలో పెద్ద నెంబర్లు నమోదవుతాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాల వైపు భారీ రికార్డులు పడతాయి.

బాలీవుడ్ లో మెర్రీ క్రిస్మస్, తమిళంలో అయలాన్ – కెప్టెన్ మిల్లర్ లు ఉన్నప్పటికీ వాటికి మన స్థాయిలో ఆదరణ, ఓపెనింగ్స్ ఆయా రాష్ట్రాల్లో కనిపించడం లేదు. దీన్ని బట్టే తెలుగోళ్ల ప్రేమ సినిమా మీద ఎంత ఉందో అర్థమవుతుంది. హనుమాన్ పాజిటివ్, గుంటూరు కారం డివైడ్ టాక్ తో మొదలవ్వగా, సైంధవ్, నా సామిరంగలు కనక మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటే మరిన్ని థియేటర్లు వీటికి సహకరిస్తాయి. ఇప్పటికే హనుమాన్ కు శనివారం నుంచి భారీ సంఖ్యలో షోలు పడతాయని ట్రేడ్ టాక్. ఈ నెల 20 దాకా నాలుగు సినిమాలకు పండగ వసూళ్లు చాలా కీలకం కాబోతున్నాయి.

This post was last modified on January 12, 2024 3:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

6 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

7 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

7 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

7 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

7 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

8 hours ago