నిన్న సాయంత్రం వేసిన హనుమాన్ ప్రీమియర్ల నుంచి మంచి టాక్ వినిపిస్తోంది. ఊహించిన దానికన్నా ప్రశాంత్ వర్మ చక్కని అవుట్ ఫుట్ ఇచ్చాడని ఫీడ్ బ్యాక్ వచ్చింది. చాలా చోట్ల థియేటర్ల నుంచి బయటికి వస్తూ ఆడియన్స్ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేయడం చూస్తే కంటెంట్ కనెక్ట్ అయినట్టు కనిపిస్తోంది. అయితే దీన్ని బట్టే ఫైనల్ స్టేటస్ చెప్పలేం కానీ సినిమా నిరాశ పరచలేదన్నది వాస్తవం. నెటిజెన్లు టీమ్ మీద ప్రశంశలు కురిపిస్తున్నారు. ఈ బడ్జెట్లో క్వాలిటీని ఇవ్వడం చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇదంతా చూసే ప్రభాస్ ఫ్యాన్స్ ఆదిపురుష్ ని గుర్తు చేసుకుని ఫీలైపోతున్నారు.
దాని ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో ప్రభాస్ తన గదికి వెళ్తూ దర్శకుడు ఓం రౌత్ ని కం టు మై రూమ్ అని పిలవడం అప్పట్లో బాగా వైరల్ అయ్యింది. క్లాసు పీకడానికే అలా అన్నాడని తెగ మీమ్స్ వచ్చాయి. ఇప్పుడు డార్లింగ్ అభిమానులు నిజంగానే ఓం రౌత్ ని కం మా గదికి రమ్మని ఆహ్వానం ఇస్తున్నారు. ఆదిపురుష్ కు పెట్టిన బడ్జెట్ లో కనీసం పావు వంతు కూడా ఖర్చు కాని హనుమాన్ కి ఇంత మంచి కంటెంట్ దక్కినప్పుడు రామాయణం లాంటి గొప్ప గాథని తీసే విధానం ఏంటని మరోసారి దుయ్యబడుతున్నారు. దెబ్బకు ఓం రౌత్ ట్విట్టర్ ఎక్స్ ట్రెండింగ్ లో వచ్చేలా ఉన్నాడు.
నిజంగానే ఇది తెలుగు దర్శకుడికి దక్కిన ప్రశంసగా చెప్పుకోవాలి. నాలుగు వందల కోట్లతో నిర్మించిన ఆదిపురుష్ కి బెనిఫిట్ షో నుంచే నెగటివ్ టాక్ మొదలైపోయింది. కానీ హనుమాన్ కి మాత్రం అలా జరగలేదు. పై పెచ్చు పాజిటివ్ పోస్టులతో సోషల్ మీడియా కళకళలాడుతోంది. ఇందులోనూ మైనస్ లున్నప్పటికీ అవి క్షమించే స్థాయిలో ఉన్నాయి. కాకపోతే పోటీలో ఉన్న ఇతర సినిమాలు ఏ స్థాయిలో మెప్పిస్తాయనే దాన్ని బట్టి కమర్షియల్ లెక్కల్లో హెచ్చు తగ్గులు ఉండొచ్చు కానీ ఫైనల్ గా చెప్పాలంటే హనుమాన్ సగటు జనాల దృష్టిలో బాక్సాఫీస్ పరీక్ష పాస్ అయినట్టే కనిపిస్తున్నాడు.
This post was last modified on January 12, 2024 8:16 am
సౌత్ దర్శకుల్లో రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ తర్వాత అంతకన్నా తక్కువో ఎక్కువో స్టార్ డం తెచ్చుకున్న వాళ్లలో లోకేష్ కనగరాజ్…
ఇటీవలే జరిగిన ఒక ఈవెంట్ లో అమీర్ ఖాన్ మాట్లాడుతూ థియేటర్ ఓటిటి మధ్య ఇప్పుడున్న గ్యాప్ సరిపోదని నాలుగు…
రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాల ఇంచార్జ్లను మార్చనున్నట్లు వైసీపీ అధినేత జగన్ చెప్పారు. అయితే దీనికి కొంత సమయం పడుతుందన్నారు.…
పహల్ గాం ఉగ్రవాద దాడి తదనంతర పరిణామాల్లో భాగంగా మంగళవార తెల్లవారుజామున భారత త్రివిధ దళాలు పాకిస్తాన్ భూభాగంలోని ఆ దేశ…
టాలీవుడ్లో ఒకప్పుడు టాప్-4 హీరోల్లో ఒకడిగా ఒక వెలుగు వెలిగిన హీరో.. అక్కినేని నాగార్జున. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్లతో పోటాపోటీగా…
పహల్గామ్లో ఉగ్రదాడి అనంతరం.. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురైనా దేశ ప్రజలు…