ఒక చిన్న హీరోతో హనుమాన్ లాంటి ప్యాన్ ఇండియా మూవీ తీసి దిగ్గజాలు బరిలో ఉన్నా సరే సంక్రాంతి పండక్కి తన సినిమాను తీసుకొస్తున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ కాన్ఫిడెన్స్ ప్రీమియర్ షోల బుకింగ్స్ లో కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా నాలుగు వందలకు పైగా షోలు అధిక శాతం హౌస్ ఫుల్స్ కావడమే దానికి నిదర్శనం. ఇవాళ రాత్రి రాబోయే పబ్లిక్ టాక్ కోసం టీమ్ మొత్తం ఉద్వేగంతో ఎదురు చూస్తోంది. ఈ సందర్భంగా ప్రశాంత్ వర్మ మీడియాతో ముచ్చటించాడు. ఇందులో భాగంగా ఇటీవలే తాను చేసిన అవతార్ కామెంట్స్ గురించి ప్రస్తావించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు.
హనుమాన్ హిట్ అయితే పెద్ద సినిమాటిక్ యునివర్స్ సృష్టిస్తానని, అవతార్ లాంటిది తీస్తానని ప్రశాంత్ వర్మ ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. దాన్ని కొందరు నెటిజెన్లు ట్రోల్ చేశారు. అంత రేంజ్ ఉందా అంటూ ఎగతాళి చేసిన వాళ్ళు లేకపోలేదు. ఇప్పుడు హనుమాన్ విజయవంతమైతే ఓ రెండేళ్లు సమయం పట్టినా ఖచ్చితంగా అవతార్ లాంటిది తెలుగులో తీస్తానని, ఒకవేళ చేయకపోతే అప్పుడు నిరభ్యంతరంగా ట్రోలింగ్ చేసుకోమని చెప్పాడు. అంతే కాదు మహాభారతం తీయాలనే లక్ష్యం ఉందని, రాజమౌళి అదే ఆలోచనలో ఉన్నారని తెలిసి డ్రాపయ్యానన్నాడు.
ఇంత భరోసాగా చెబుతున్నాడంటే ప్రశాంత్ వర్మ నమ్మకం గెలవడం అవసరమే అనిపిస్తుంది. అయినా అవతార్ ప్రపంచవ్యాప్తంగా వేల కోట్లు వసూలు చేసినా సినిమానే కావొచ్చు. ఇది నచ్చని వాళ్ళూ ఉన్నారు. మాములు ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ నచ్చుతుందన్న గ్యారెంటీ లేదు. అలాంటప్పుడు అదే ప్రపంచాన్ని ఇంకో కోణంలో సగటు ప్రేక్షకుడిగా అర్థం అయ్యేలా ప్రశాంత్ వర్మ లాంటి వాళ్ళు ప్రయత్నిస్తే తప్పేం లేదు. రాజమౌళి రెండు వేల కోట్ల సినిమా ఇస్తాడని బాహుబలికి ముందు ఎవరైనా అనుకున్నారా. కొన్ని అద్భుతాలు అంతే. అనూహ్యంగా జరిగిపోతాయి. ఎదురు చూడాలంతే.
కొన్ని డిజాస్టర్లు ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంటాయి. అందులో పనిచేసిన వాళ్లందరినీ జీవిత కాల చేదు జ్ఞాపకాలుగా మారిపోతుంటాయి. ఆ సినిమాల…
మా ఇంటి బంగారం సినిమా విజయంతో సంబరాల్లో ఉన్న సమంత అభిమానులకు మరో శుభవార్త అందింది. సినిమా సక్సెస్ మీట్…
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ టూర్లో ఊహించని పరిస్థితిని ఎదుర్కోబోతున్నాడు. శుక్రవారం ఐర్లాండ్తో జరిగే టీ20 మ్యాచ్తో…
విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా మూవీ రణబాలి సెప్టెంబర్ 11 విడుదల తేదీ ఎప్పుడో ఖరారు చేసుకుంది. అధికారిక ప్రకటన…
రీసెంట్ గా జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో జరిగిన ఒక చిన్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే…
మహారాష్ట్రలోని పుణే సమీపంలో జరిగిన యువ వ్యాపారవేత్త అనుమానాస్పద మృతి కేసులో కళ్లు చెదిరే నిజాలు బయటపడ్డాయి. జూన్ 18వ…