Movie News

ఒక్క మల్టీప్లెక్స్.. 41 షోలు

ఒక సింగిల్ థియేటర్లో ఒక రోజుకు గరిష్టంగా ఆరు షోలు మాత్రమే సాధ్యమవుతాయి. అయితే పర్మిషన్లు లభించేది ఐదు షోలకు మాత్రమే. అయితే మల్టీప్లెక్సుల లెక్క వేరుగా ఉంటుంది. అక్కడ ఎక్కువ స్క్రీన్లు ఉంటాయి. ఎక్కువ షోలూ ఆడించే అవకాశం ఉంటుంది. దీంతో పెద్ద సినిమా రిలీజ్ అయినప్పుడు డిమాండ్ ను బట్టి 10- 20-25-30 షోలు వేస్తుంటారు. హైదరాబాద్ విషయానికి వస్తే ఒక రోజులో ఒక సినిమాకు అత్యధిక షోలు పడేది ప్రసాద్ ఐమాక్స్ లోనే. ఈ ఐకానిక్ మల్టీప్లెక్స్ లో అత్యధిక షోల రికార్డును మహేష్ బాబు కొత్త చిత్రం గుంటూరు కారం చెరిపేసింది.

జనవరి 12న విడుదలవుతున్న ఈ చిత్రానికి తొలి రోజు ఏకంగా 40 షోలు వేస్తోంది ప్రసాద్ ఐమాక్స్. అర్ధరాత్రి ఒంటిగంట నుంచే తొలి షో మొదలవుతుంది. ఆ తర్వాత నాలుగు గంటలకు అందుబాటులో ఉన్న ఏడు స్క్రీన్లలోనూ గుంటూరు కారం చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. ఉదయం నుంచి హనుమాన్ కు కొన్ని షోలు కేటాయించి మిగతా అన్ని స్క్రీన్లలోనూ గుంటూరు కారంతోనే నడిపించునున్నారు.

ఇప్పటిదాకా ప్రసాద్ ఐమాక్స్ లో ఏ సినిమా కూడా 40 షోల మార్కును టచ్ చేయలేదు. గత ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా 33 షోలతో రికార్డు నెలకొల్పింది. దాన్ని ఇప్పుడు గుంటూరు కారం బద్దలు కొట్టింది. రోబో-2 అన్ని భాషల్లో కలిపి 32 షోలతో మూడో స్థానంలో ఉంది. గుంటూరు కారం లాంటి మామూలు మాస్ సినిమాతో ఒక్క మల్టీప్లెక్స్ లో ఏకంగా 41 షోలతో రికార్డ్ నెలకొల్పడం మహేష్ బాబుకే సాధ్యమైంది.

This post was last modified on January 11, 2024 10:17 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

25 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

32 minutes ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

1 hour ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

3 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago