నందమూరి బాలకృష్ణ కెరీర్లో అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుల్లో ముందుగా గుర్తొచ్చే పేర్లు కోడి రామకృష్ణ, బి గోపాల్. ఆ తర్వాత ఇప్పటి జనరేషన్ లో ఆ గౌరవం దక్కింది బోయపాటి శీనుకే. ఇప్పటికీ ఈ కాంబినేషన్ లో మూడు ఇండస్ట్రీ హిట్లు వచ్చాయి. సింహా అంచనాలకు మించి ఆడితే లెజెండ్ చరిత్ర సృష్టించింది. ఇక అఖండ ఏకంగా కరోనా వేవ్ ని తట్టుకుని రికార్డులు కొల్లగొట్టింది. ఈ మూడు సినిమాల్లో బాలయ్యను చూపించినంత పవర్ ఫుల్ గా ఇంకే దర్శకుడు చేయలేకపోయాడనేది వాస్తవం. ఇప్పుడీ కలయిక మరోసారి సాధ్యం కాబోతోందని ఫిలిం నగర్ టాక్.
ఫోర్టీన్ రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై బాలయ్య బోయపాటిలతో NBK 110కు అంగీకారం జరిగిందని వినికిడి. అధికారికంగా త్వరలో ప్రకటిస్తారు. బాలకృష్ణ ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో బిజీగా ఉన్నారు. ఇంకోవైపు ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో ప్రచార పనులతో పాటు ఇతర బాధ్యతలు బోలెడు నిర్వహించాల్సి ఉంటుంది. పైగా హిందూపూర్ నియోజకవర్గం ఈసారి మరింత ప్రతిష్టాత్మకం కానుంది. అందుకే బాబీది వీలైనంత త్వరగా పూర్తి చేసి బ్రేక్ ఇస్తారు. ఎలక్షన్లు పూర్తయిపోయి ఫలితాలు వచ్చే దాకా తీరిక చేసుకోవడం కష్టమే.
ఈ వార్త అభిమానులకు మరింత కిక్ ఇచ్చేదే. ఇక బోయపాటి సంగతికొస్తే వినయ విధేయ రామ చేసిన గాయం అఖండ పూర్తిగా మాన్పేసింది. ఇంకే సమస్య లేదనుకుంటే తిరిగి స్కంద మళ్ళీ రేపింది. చాలా సీన్లు ట్రోలింగ్ కు గురయ్యాయి. బాలయ్యను డీల్ చేయడంలో అద్భుతమైన పనితనం చూపిస్తున్న బోయపాటి శీను ఎందుకనో ఇతర హీరోల విషయంలో పొరపాట్లు చేస్తున్నారు. ఒకప్పుడు భద్ర, తులసి లాంటి బ్లాక్ బస్టర్లు బయట వాళ్ళతో చేసినవే కదా. ఏదైతేనేం మొత్తానికి అభిమానులు కోరుకున్నది మళ్ళీ జరుగుతోంది. ఇది అఖండ 2నా లేక కొత్తగా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
This post was last modified on January 10, 2024 10:37 pm
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…