నందమూరి బాలకృష్ణ కెరీర్లో అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుల్లో ముందుగా గుర్తొచ్చే పేర్లు కోడి రామకృష్ణ, బి గోపాల్. ఆ తర్వాత ఇప్పటి జనరేషన్ లో ఆ గౌరవం దక్కింది బోయపాటి శీనుకే. ఇప్పటికీ ఈ కాంబినేషన్ లో మూడు ఇండస్ట్రీ హిట్లు వచ్చాయి. సింహా అంచనాలకు మించి ఆడితే లెజెండ్ చరిత్ర సృష్టించింది. ఇక అఖండ ఏకంగా కరోనా వేవ్ ని తట్టుకుని రికార్డులు కొల్లగొట్టింది. ఈ మూడు సినిమాల్లో బాలయ్యను చూపించినంత పవర్ ఫుల్ గా ఇంకే దర్శకుడు చేయలేకపోయాడనేది వాస్తవం. ఇప్పుడీ కలయిక మరోసారి సాధ్యం కాబోతోందని ఫిలిం నగర్ టాక్.
ఫోర్టీన్ రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై బాలయ్య బోయపాటిలతో NBK 110కు అంగీకారం జరిగిందని వినికిడి. అధికారికంగా త్వరలో ప్రకటిస్తారు. బాలకృష్ణ ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో బిజీగా ఉన్నారు. ఇంకోవైపు ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో ప్రచార పనులతో పాటు ఇతర బాధ్యతలు బోలెడు నిర్వహించాల్సి ఉంటుంది. పైగా హిందూపూర్ నియోజకవర్గం ఈసారి మరింత ప్రతిష్టాత్మకం కానుంది. అందుకే బాబీది వీలైనంత త్వరగా పూర్తి చేసి బ్రేక్ ఇస్తారు. ఎలక్షన్లు పూర్తయిపోయి ఫలితాలు వచ్చే దాకా తీరిక చేసుకోవడం కష్టమే.
ఈ వార్త అభిమానులకు మరింత కిక్ ఇచ్చేదే. ఇక బోయపాటి సంగతికొస్తే వినయ విధేయ రామ చేసిన గాయం అఖండ పూర్తిగా మాన్పేసింది. ఇంకే సమస్య లేదనుకుంటే తిరిగి స్కంద మళ్ళీ రేపింది. చాలా సీన్లు ట్రోలింగ్ కు గురయ్యాయి. బాలయ్యను డీల్ చేయడంలో అద్భుతమైన పనితనం చూపిస్తున్న బోయపాటి శీను ఎందుకనో ఇతర హీరోల విషయంలో పొరపాట్లు చేస్తున్నారు. ఒకప్పుడు భద్ర, తులసి లాంటి బ్లాక్ బస్టర్లు బయట వాళ్ళతో చేసినవే కదా. ఏదైతేనేం మొత్తానికి అభిమానులు కోరుకున్నది మళ్ళీ జరుగుతోంది. ఇది అఖండ 2నా లేక కొత్తగా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
కెరీర్ తొలి నాళ్లలో పెద్దగా అవకాశాలు లేనపుడు దక్షిణాదిన వచ్చే ప్రతి ఛాన్సునూ మహా ప్రసాదం అనుకుంటారు. స్టార్ ఇమేజ్…
మెగా హీరోల సినిమాలకు సంబంధించి ఏ ఈవెంట్ అయినా.. అందులో ఎక్కడో ఒక చోట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన పెద్ది సక్సెస్ మీట్ కోసం వేలాది అభిమానులు తరలివచ్చారు. ఈ సినిమాకు సంబంధించి ఇదే…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ విపక్ష వైసీపీ ఇటీవల డోస్ పెంచిన…
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…