కాదేది క్రియేటివిటీకి అనర్హం అన్నారు సినీ పెద్దలు. ఈ మధ్య ప్రమోషన్లు రొటీన్ గా మారిపోతున్నాయని భావిస్తున్న తరుణంలో మేకర్స్ కొత్త ఆలోచనలతో పబ్లిసిటీకి శ్రీకారం చుడుతున్నారు. అలాంటి ఐడియాతోనే వచ్చింది నా సామిరంగ టీమ్. ఊరికే తమ గురించే పదే పదే చెప్పుకోవడం ఏం బాగుంటుందని సంక్రాంతికి వచ్చే కొత్త రిలీజులకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు ప్రత్యేకంగా ఒక పాట కంపోజ్ చేయించి విడుదల చేయడం మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకుంటోంది. దీనిని స్వయంగా కీరవాణే లిరిక్స్ రాసుకుని ప్రతి అక్షరం స్పష్టంగా వినిపించేలా గాయకుడు లోకేశ్వర్ తో పాడించారు.
సింపుల్ ట్యూన్ తో ఆకట్టుకునేలా పదాలతో సాగిపోయింది. ‘ఆల్ ది బెస్టు సినీ గోయరూ బాక్సాఫీసుకి పెంచేయ్ రా ఫీవరూ’ అంటూ మొదలుపెట్టి ఒక్కో టీమ్ కి శుభాకాంక్షలు చెప్పారు. హనూ మ్యానూ ముందెళ్ళి నువ్వు సెట్టు చెయ్యి టోను, గుంటూరు కారం నువ్వు అదరగొట్టు ఈ శుక్రవారం, సైంధవా నువ్వు హిట్టు కొట్టి వేసుకోవ కండువా అంటూ క్యాచీ పదాలతో ఆకట్టుకుని చివరిలో ‘రంగరంగ వైభవంగా ఈ పండక్కి నా సామిరంగ’ అంటూ ముక్తాయింపు ఇవ్వడం బాగుంది. చరణాల సాహిత్యంలో కీరవాణి చలాకి మెరుపులు వినిపించారు. పాడుకోవడానికి సులభంగా ఉంది.
ఇదో మంచి ట్రెండ్ అని చెప్పాలి. ఎవరికి వారు పోటీ పడుతూ తమ సినిమాలకు ఎక్కువ థియేటర్లు కలెక్షన్లు రావాలని కోరుకుంటున్న పరిస్థితుల్లో ఇలా అందరికీ కలిపి పండగ లాంటి పాటను కానుకగా ఇవ్వడం బాగుంది. కీరవాణి గారు ఇంత ఇన్నోవేటివ్ గా ఇలాంటి ఆలోచన చేయడం బాగుంది. నా సామిరంగకు సంబంధించిన విజువల్స్ ఏమి చూపించకుండా కేవలం నాలుగు సినిమాల లోగోలు మాత్రమే హైలైట్ చేశారు. పండగ రేసులో చివరగా వస్తున్న ఈ విలేజ్ డ్రామా మీద నాగార్జున నమ్మకం అంతా ఇంతా కాదు. విపరీతమైన ఒత్తిడి తట్టుకుని మరి బరిలో దింపారు. బుకింగ్స్ కూడా మొదలైపోయాయి.
This post was last modified on January 10, 2024 7:50 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…