కాదేది క్రియేటివిటీకి అనర్హం అన్నారు సినీ పెద్దలు. ఈ మధ్య ప్రమోషన్లు రొటీన్ గా మారిపోతున్నాయని భావిస్తున్న తరుణంలో మేకర్స్ కొత్త ఆలోచనలతో పబ్లిసిటీకి శ్రీకారం చుడుతున్నారు. అలాంటి ఐడియాతోనే వచ్చింది నా సామిరంగ టీమ్. ఊరికే తమ గురించే పదే పదే చెప్పుకోవడం ఏం బాగుంటుందని సంక్రాంతికి వచ్చే కొత్త రిలీజులకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు ప్రత్యేకంగా ఒక పాట కంపోజ్ చేయించి విడుదల చేయడం మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకుంటోంది. దీనిని స్వయంగా కీరవాణే లిరిక్స్ రాసుకుని ప్రతి అక్షరం స్పష్టంగా వినిపించేలా గాయకుడు లోకేశ్వర్ తో పాడించారు.
సింపుల్ ట్యూన్ తో ఆకట్టుకునేలా పదాలతో సాగిపోయింది. ‘ఆల్ ది బెస్టు సినీ గోయరూ బాక్సాఫీసుకి పెంచేయ్ రా ఫీవరూ’ అంటూ మొదలుపెట్టి ఒక్కో టీమ్ కి శుభాకాంక్షలు చెప్పారు. హనూ మ్యానూ ముందెళ్ళి నువ్వు సెట్టు చెయ్యి టోను, గుంటూరు కారం నువ్వు అదరగొట్టు ఈ శుక్రవారం, సైంధవా నువ్వు హిట్టు కొట్టి వేసుకోవ కండువా అంటూ క్యాచీ పదాలతో ఆకట్టుకుని చివరిలో ‘రంగరంగ వైభవంగా ఈ పండక్కి నా సామిరంగ’ అంటూ ముక్తాయింపు ఇవ్వడం బాగుంది. చరణాల సాహిత్యంలో కీరవాణి చలాకి మెరుపులు వినిపించారు. పాడుకోవడానికి సులభంగా ఉంది.
ఇదో మంచి ట్రెండ్ అని చెప్పాలి. ఎవరికి వారు పోటీ పడుతూ తమ సినిమాలకు ఎక్కువ థియేటర్లు కలెక్షన్లు రావాలని కోరుకుంటున్న పరిస్థితుల్లో ఇలా అందరికీ కలిపి పండగ లాంటి పాటను కానుకగా ఇవ్వడం బాగుంది. కీరవాణి గారు ఇంత ఇన్నోవేటివ్ గా ఇలాంటి ఆలోచన చేయడం బాగుంది. నా సామిరంగకు సంబంధించిన విజువల్స్ ఏమి చూపించకుండా కేవలం నాలుగు సినిమాల లోగోలు మాత్రమే హైలైట్ చేశారు. పండగ రేసులో చివరగా వస్తున్న ఈ విలేజ్ డ్రామా మీద నాగార్జున నమ్మకం అంతా ఇంతా కాదు. విపరీతమైన ఒత్తిడి తట్టుకుని మరి బరిలో దింపారు. బుకింగ్స్ కూడా మొదలైపోయాయి.
This post was last modified on January 10, 2024 7:50 pm
నిన్న రాబిన్ హుడ్ నుంచి అదిదా సర్ప్రైజ్ లిరికల్ సాంగ్ విడుదల చేశారు. కేతిక శర్మ నటించిన ఈ ప్రత్యేక…
అసలు ఓజి ఎప్పుడు విడుదలవుతుందో తెలియదు కానీ అప్పుడే ఓజి 2 గురించి ప్రచారాలు ఊపందుకున్నాయి. ఎన్నికల ముందు వరకు…
ఏపీలో విపక్షం వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతలుగా మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా, నంద్యాల జిల్లాకు…
నిర్మాతగా నాని విపరీతమైన నమ్మకం పెట్టుకున్న కోర్ట్ ఇంకో మూడు రోజుల్లో విడుదల కానుంది. ఇంతకు ముందు ప్రొడ్యూసర్ గా…
వైసీపీ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగానే బుక్ అయిపోతున్నారు. వైసీపీ జమానాలో ఆయా నేతలు సాగించిన…
ఏపీ రాజధాని అమరావతి విషయంలో ప్రతిపక్షం వైసీపీ నాయకులు సృష్టిస్తున్న విషప్రచారాన్ని ప్రజలు నమ్మరాదని ఏపీ మంత్రులు కోరారు. రాజధాని…