Movie News

చివరికి భారం అంతా ప్రేక్షకుల మీదేనా?

ఒకప్పుడు పెద్ద, చిన్న అని తేడా లేకుండా అన్ని సినిమాలు ఒకే రేట్లతో చూసేవారు ప్రేక్షకులు. మహా అయితే బెనిఫిట్ షోలకు మాత్రం ఎక్స్ట్రా రేట్లు ఉండేవి. అవి ఏ అర్ధరాత్రో తెల్లవారుజామునో మొదలయ్యేవి కాబట్టి అభిమానులు మాత్రమే వాటికోసం ఎగబడేవారు.

మిగతా ప్రేక్షకులంతా ఉదయం మామూలు రేట్లతోనే సినిమాలు చూసేవారు. కానీ కొన్నేళ్ల కిందటి నుంచి కథ మారిపోయింది. ఆల్రెడీ టికెట్లు ధరలు పెంచి ఉండగా.. వాటి మీద అదనపు రేట్లతో పెద్ద సినిమాల క్రేజ్ ను సొమ్ము చేసుకునే ప్రయత్నం జరుగుతోంది. అయితే భారీ బడ్జెట్లో తెరకెక్కి విజువల్ గా ప్రత్యేక అనుభూతిని కలిగించే ఈవెంట్ సినిమాలకు రేట్లు పెంచడాన్ని అర్థం చేసుకోవచ్చు. బాహుబలి తరహా సినిమాలకు ఎక్కువ రేటు పెట్టడం పెట్టి సినిమా చూడడంలో న్యాయం ఉంది.

కానీ సగటు కమర్షియల్ సినిమాలకు కూడా ఇలాగే రేట్లు పెంచడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? గత నెలలో సలార్ సినిమాకు, ఇప్పుడు గుంటూరు కారం చిత్రానికి అయిన కాడికి రేట్లు పెంచేశారు. సింగిల్ స్క్రీన్లలో 250, మల్టీప్లెక్స్ లో 410 పెట్టి సినిమా చూడాల్సి వస్తోంది. ఇది ప్రేక్షకులకు ఖచ్చితంగా భారమే. ఇవేమీ విజువల్ ఎఫెక్ట్స్ తో ముడిపడ్డ భారీ చిత్రాలు కావు.

ముఖ్యంగా గుంటూరు కారం అయితే సగటు మాస్ సినిమా. ఇలాంటి సినిమాలకు ప్రొడక్షన్ మీద పెడుతున్న ఖర్చు తక్కువ, పారితోషకాల రూపంలో ఇస్తున్నది ఎక్కువ. బడ్జెట్ మాత్రం 100 కోట్లు దాటిపోతుంది. అందుకు తగ్గట్లే సినిమాను ఎక్కువ రేట్లు అమ్ముతారు. చివరికి భారం అంతా ప్రేక్షకుల మీద వేస్తున్నారు. మరి ఇలాంటి చిత్రాలకు ప్రభుత్వం ఏ ప్రాతిపదికన ధరలు పెంచుకునే అవకాశం ఇస్తోందని అర్థం కాని విషయం. ఇది కచ్చితంగా దోపిడీయే అనే అభిప్రాయాన్ని సగటు సినీ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

This post was last modified on January 10, 2024 10:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాలయ్య వస్తే మీకే మంచిది అంటున్న రాజా సాబ్ డైరెక్టర్

అఖండ 2 వాయిదా వ్యవహారం డిసెంబర్ 12 విడుదల కావాల్సిన వేరే సినిమాల మీద ప్రభావం చూపించింది. సైక్ సిద్దార్థ్…

14 minutes ago

ఎన్నికల వరకు ఓర్చుకోండి అని జగన్ సూచన?

వైసీపీ నాయకులకు జగన్ తరచుగా హితవు పలుకుతున్నారు. ఎన్నికల వరకు ఓర్చుకోవాలని చెబుతున్నారు. దీనికి కారణం కొందరు ప్రస్తుతం కేసుల్లో…

19 minutes ago

పవన్ చెప్పే స‌నాత‌న ధ‌ర్మ బోర్డు.. ప్రభుత్వం స్థాపించగలదా?

``స‌నాత‌న ధ‌ర్మ బోర్డును సాధ్య‌మైనంత వేగంగా ఏర్పాటు చేయాలి.`` తాజాగా జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రోసారి…

27 minutes ago

అఖండకు ఆలస్యమనే విషం అమృతంగా మారింది

గత వారం చివరి నిమిషంలో విడుదల వాయిదా పడిన అఖండ 2 ఇప్పుడు డిసెంబర్ 12 రావడం అంతా మంచికే…

47 minutes ago

అక్కర్లేని వివాదం ఎందుకు హృతిక్

భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంటుంది కానీ దానికి సహేతుకమైన కారణం ఆమోదం దక్కుతుంది. సోషల్ మీడియా కాలంలో దీని…

2 hours ago

అవేవీ లేకపోయినా మోగ్లీ’కి ఎ సర్టిఫికెట్

ఏ సినిమాకైనా ‘ఎ’ సర్టిఫికెట్ ఎందుకు వస్తుంది? అందులో ఇంటిమేట్ సీన్ల డోస్ ఎక్కువ ఉండుండాలి. లేదంటే హింస, రక్తపాతం…

2 hours ago