ఒకప్పుడు పెద్ద, చిన్న అని తేడా లేకుండా అన్ని సినిమాలు ఒకే రేట్లతో చూసేవారు ప్రేక్షకులు. మహా అయితే బెనిఫిట్ షోలకు మాత్రం ఎక్స్ట్రా రేట్లు ఉండేవి. అవి ఏ అర్ధరాత్రో తెల్లవారుజామునో మొదలయ్యేవి కాబట్టి అభిమానులు మాత్రమే వాటికోసం ఎగబడేవారు.
మిగతా ప్రేక్షకులంతా ఉదయం మామూలు రేట్లతోనే సినిమాలు చూసేవారు. కానీ కొన్నేళ్ల కిందటి నుంచి కథ మారిపోయింది. ఆల్రెడీ టికెట్లు ధరలు పెంచి ఉండగా.. వాటి మీద అదనపు రేట్లతో పెద్ద సినిమాల క్రేజ్ ను సొమ్ము చేసుకునే ప్రయత్నం జరుగుతోంది. అయితే భారీ బడ్జెట్లో తెరకెక్కి విజువల్ గా ప్రత్యేక అనుభూతిని కలిగించే ఈవెంట్ సినిమాలకు రేట్లు పెంచడాన్ని అర్థం చేసుకోవచ్చు. బాహుబలి తరహా సినిమాలకు ఎక్కువ రేటు పెట్టడం పెట్టి సినిమా చూడడంలో న్యాయం ఉంది.
కానీ సగటు కమర్షియల్ సినిమాలకు కూడా ఇలాగే రేట్లు పెంచడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? గత నెలలో సలార్ సినిమాకు, ఇప్పుడు గుంటూరు కారం చిత్రానికి అయిన కాడికి రేట్లు పెంచేశారు. సింగిల్ స్క్రీన్లలో 250, మల్టీప్లెక్స్ లో 410 పెట్టి సినిమా చూడాల్సి వస్తోంది. ఇది ప్రేక్షకులకు ఖచ్చితంగా భారమే. ఇవేమీ విజువల్ ఎఫెక్ట్స్ తో ముడిపడ్డ భారీ చిత్రాలు కావు.
ముఖ్యంగా గుంటూరు కారం అయితే సగటు మాస్ సినిమా. ఇలాంటి సినిమాలకు ప్రొడక్షన్ మీద పెడుతున్న ఖర్చు తక్కువ, పారితోషకాల రూపంలో ఇస్తున్నది ఎక్కువ. బడ్జెట్ మాత్రం 100 కోట్లు దాటిపోతుంది. అందుకు తగ్గట్లే సినిమాను ఎక్కువ రేట్లు అమ్ముతారు. చివరికి భారం అంతా ప్రేక్షకుల మీద వేస్తున్నారు. మరి ఇలాంటి చిత్రాలకు ప్రభుత్వం ఏ ప్రాతిపదికన ధరలు పెంచుకునే అవకాశం ఇస్తోందని అర్థం కాని విషయం. ఇది కచ్చితంగా దోపిడీయే అనే అభిప్రాయాన్ని సగటు సినీ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on January 10, 2024 10:37 pm
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని జైలుకు వెళ్లేందుకెు సిద్ధపడిపోయారా? అంటే.. అవుననే సమాధానమే…
అమెరికాలో ఉంటున్న తెలుగు అమ్మాయి, ఇన్ఫ్లుయెన్సర్ (పికు నెమలి) సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. పార్టీ పేరు,…
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఇప్పుడు భాషా పరమైన సరిహద్దులు చెరిగిపోతున్నాయి. ఒకప్పటిలా కాకుండా టాలీవుడ్ కు చెందిన అగ్ర నిర్మాణ…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు వస్తుందంటే సోషల్ మీడియాలో రచ్చ మామూలుగా ఉండదు. ఏప్రిల్ 8వ తేదీ కోసం…
హైదరాబాద్ లో మాదక ద్రవ్యాల వినియోగం అంతకంతకూ పెరుగుతోందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా గురువారం అర్ధరాత్రి నగరంలో జరుగుతున్న ఓ…