ఈ సంక్రాంతికి ఆసక్తికర బాక్స్ ఆఫీస్ క్లాస్ చూడబోతున్నాం. పండుగ బరిలో ఉన్న నాలుగు సినిమాలు వేటికవే ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ఇందులో అన్నిటికన్నా ముందుగా రిలీజ్ అవుతున్న హనుమాన్ చిత్రానికి.. చివర్లో విడుదలయ్యే నా సామి రంగ సినిమా దర్శకుడు పని చేయడం విశేషం. నా సామి రంగ మూవీతో విజయ్ బిన్ని దర్శకుడుగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. అతను టాలీవుడ్లో చాలా ఏళ్లుగా కొరియోగ్రాఫర్ గా పని చేస్తున్నాడు.
లారెన్స్ తర్వాత నాగార్జున దర్శకుడిగా పరిచయం చేస్తున్న మరొక కొరియోగ్రాఫర్ అతను. విజయ్ వంద సినిమాలకు పైగా కొరియోగ్రఫీ చేయడం విశేషం. చివరగా అతను నృత్య రీతులు సమకూర్చిన సినిమా హనుమానే కావడం విశేషం.
నా సామిరంగ షూటింగ్ మొదలైంది ఆగస్టులో. అంతకంటే ముందే హనుమాన్ మూవీ టాకీతో పాటు పాటల చిత్రీకరణ మొత్తం పూర్తి చేసుకుంది. ఆ సినిమాలో అన్ని పాటలకు డాన్స్ కొరియోగ్రఫీ చేసింది విజయ్ బిన్నీనే కావడం విశేషం. చిత్రాల్లో చాలావరకు మాంటేజ్ సాంగ్సే ఉంటాయని.. వాటిలో క్రియేటివిటీ చూపించడానికి తనకు అవకాశం దొరికిందని.. అదే దర్శకత్వం చేయడానికి ఉపయోగపడిందని విజయ్ బిన్ని ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.
తాను డైరెక్షన్ చేయాలనే లక్ష్యంతోనే ఇండస్ట్రీలోకి వచ్చానని.. అయితే బేసిగ్గా తాను డాన్సర్ కావడంతో, సినిమాకు సంబంధించి అన్ని క్రాఫ్ట్స్ మీద అవగాహన పెంచుకోవడానికి కొరియోగ్రఫీ మంచి అవకాశం అని భావించి అందులోకి వెళ్ళినట్లు విజయ్ తెలిపాడు. జెర్సీ సహా అనేక సినిమాల్లో డాన్స్ తో సంబంధం లేకుండా కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా, క్రియేటివ్ గా తాను పాటలు కొరియోగ్రాఫ్ చేసినట్లు అతను చెప్పాడు. ఈ అనుభవంతోనే నా సామి రంగ చిత్రాన్ని కేవలం 80 రోజుల్లోపు తీసినట్లు తెలిపాడు. ఈ చిత్రం దర్శకుడిగా తనేంటో రుజువు చేస్తుందని అతని ధీమా వ్యక్తం చేశాడు.
This post was last modified on January 10, 2024 6:06 pm
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…