ఈ సంక్రాంతికి ఆసక్తికర బాక్స్ ఆఫీస్ క్లాస్ చూడబోతున్నాం. పండుగ బరిలో ఉన్న నాలుగు సినిమాలు వేటికవే ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ఇందులో అన్నిటికన్నా ముందుగా రిలీజ్ అవుతున్న హనుమాన్ చిత్రానికి.. చివర్లో విడుదలయ్యే నా సామి రంగ సినిమా దర్శకుడు పని చేయడం విశేషం. నా సామి రంగ మూవీతో విజయ్ బిన్ని దర్శకుడుగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. అతను టాలీవుడ్లో చాలా ఏళ్లుగా కొరియోగ్రాఫర్ గా పని చేస్తున్నాడు.
లారెన్స్ తర్వాత నాగార్జున దర్శకుడిగా పరిచయం చేస్తున్న మరొక కొరియోగ్రాఫర్ అతను. విజయ్ వంద సినిమాలకు పైగా కొరియోగ్రఫీ చేయడం విశేషం. చివరగా అతను నృత్య రీతులు సమకూర్చిన సినిమా హనుమానే కావడం విశేషం.
నా సామిరంగ షూటింగ్ మొదలైంది ఆగస్టులో. అంతకంటే ముందే హనుమాన్ మూవీ టాకీతో పాటు పాటల చిత్రీకరణ మొత్తం పూర్తి చేసుకుంది. ఆ సినిమాలో అన్ని పాటలకు డాన్స్ కొరియోగ్రఫీ చేసింది విజయ్ బిన్నీనే కావడం విశేషం. చిత్రాల్లో చాలావరకు మాంటేజ్ సాంగ్సే ఉంటాయని.. వాటిలో క్రియేటివిటీ చూపించడానికి తనకు అవకాశం దొరికిందని.. అదే దర్శకత్వం చేయడానికి ఉపయోగపడిందని విజయ్ బిన్ని ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.
తాను డైరెక్షన్ చేయాలనే లక్ష్యంతోనే ఇండస్ట్రీలోకి వచ్చానని.. అయితే బేసిగ్గా తాను డాన్సర్ కావడంతో, సినిమాకు సంబంధించి అన్ని క్రాఫ్ట్స్ మీద అవగాహన పెంచుకోవడానికి కొరియోగ్రఫీ మంచి అవకాశం అని భావించి అందులోకి వెళ్ళినట్లు విజయ్ తెలిపాడు. జెర్సీ సహా అనేక సినిమాల్లో డాన్స్ తో సంబంధం లేకుండా కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా, క్రియేటివ్ గా తాను పాటలు కొరియోగ్రాఫ్ చేసినట్లు అతను చెప్పాడు. ఈ అనుభవంతోనే నా సామి రంగ చిత్రాన్ని కేవలం 80 రోజుల్లోపు తీసినట్లు తెలిపాడు. ఈ చిత్రం దర్శకుడిగా తనేంటో రుజువు చేస్తుందని అతని ధీమా వ్యక్తం చేశాడు.
This post was last modified on January 10, 2024 6:06 pm
తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…