పేరుకు ఎల్లుండి విడుదలైనా రేపు సాయంత్రమే భారీ ప్రీమియర్లు ప్లాన్ చేసుకున్న హనుమాన్ బృందానికి ఊహించని స్థాయిలో స్పందన దక్కుతోంది. మొదట కొన్ని సెంటర్లలో షోలు వేయాలనుకున్నా పబ్లిక్ నుంచి అనూహ్యమైన డిమాండ్ రావడంతో ఎక్కడిక్కడ పెంచుకుంటూ పోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఒక్క హైదరాబాద్ లోనే కాదు గుంటూరు, విజయవాడ, రాజమండ్రి ఎక్కడ చూసినా ఇదే సీన్. రెండు షోలు చాలనుకున్న చోట ఇప్పుడు కనీసం ఆరు దాకా వేస్తున్నారు. నైట్ షోలకు డిమాండ్ పెరుగుతోంది. కరెంట్ బుకింగ్ అవసరం లేకుండానే ఆన్ లైన్లో సోల్డ్ అవుట్స్ పడుతున్నాయి.
అర్ధరాత్రి 1 గంటకు గుంటూరు కారం ఉన్న నేపథ్యంలో అధిక శాతం ప్రేక్షకులు హనుమాన్ ను ముందు రోజు సాయంత్రం లేదా రాత్రి చూసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. పైగా ఆ తర్వాత వరసగా రెండు రోజులు సైంధవ్, నా సామిరంగలు ఉండటంతో మూవీ లవర్స్ కు అన్ని కవర్ చేయడం పెద్ద సవాలే. ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు హనుమాన్ ప్రీమియర్ల నుంచి వచ్చిన గ్రాస్ సుమారు 2 కోట్ల పైనే ఉందట. రేపు షోలు మొదలయ్యే సమయానికి ఇంకా పెరుగుతుంది. సలార్ హడావిడి తగ్గాక బోసిపోతున్న థియేటర్లకు హనుమాన్ కొత్త ఉత్సాహాన్ని ఇవ్వబోతున్నాడు.
ఇదంతా ఒక వైపు అయితే అసలైన ఛాలెంజ్ టాక్ తెచ్చుకోవడం. ఏ మాత్రం బాగుందనే మాట వినిపించినా చాలు సోషల్ మీడియా హోరెత్తిపోతుంది. పైగా హనుమంతుడి సెంటిమెంట్ కావడంతో ఇంకా వేగంగా వెళ్తుంది. ఎల్లుండి గుంటూరు కారం తాకిడిని తట్టుకోవడం హనుమాన్ కి అంత సులభంగా ఉండదు. హనుమాన్ కి ప్రీమియర్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చినా ఆది కలెక్షన్లు మారడానికి, షోలు పెంచుకోవడానికి ఒకటి రెండు రోజులు టైం పడుతుంది. ఏ రకంగా చూసిన భారీ ఎత్తున వేసిన స్పెషల్ షోల ఐడియా బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతోంది. అంచనాలు నిలబెట్టుకోవడమే మిగిలింది.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…