తెలుగులో మోస్ట్ సక్సెస్ ఫుల్ ఫ్రాంచైజీ సినిమాల్లో హిట్ ఒకటి. కొత్త దర్శకుడు శైలేష్ కొలను.. విశ్వక్సేన్ హీరోగా తీసిన హిట్ మంచి సక్సెస్ అయ్యి ఈ ఫ్రాంచైజీకి ఊపు తెచ్చింది. ఆ తర్వాత అడివి శేష్ హీరోగా హిట్-2 తీసి ఇంకా పెద్ద సక్సెస్ అందుకున్నాడు శైలేష్. ఈ సినిమా చివర్లో హిట్-3కి హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందులో హిట్ సిరీస్ నిర్మాత నానినే హీరోగా నటించబోతున్న సంగతీ విదితమే.
అయితే హిట్-2 రిలీజ్ అయి ఏడాది దాటినా ఇంకా ఆ సినిమా గురించి ఏ ఊసూ లేదు. హిట్ -2 తర్వాత శైలేష్ కొలను సైంధవ్ సినిమా తీశాడు. నాని వేర్వేరు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. మరి హిట్ -3 నిజంగా ఉంటుందా.. ఉంటే ఎప్పుడూ అనే విషయాలపై క్లారిటీ లేదు. సైంధవ్ ప్రమోషన్లలో భాగంగా శైలేష్ ఈ విషయంపై స్పష్టత ఇచ్చాడు. హిట్-3 ఏడాదిన్నర తర్వాత మొదలవుతుందని శైలేష్ చెప్పాడు.
ఆ సినిమా ఐడియా వరకు ఓకే అయిందని, పూర్తి స్క్రిప్ట్ రెడీ కావాల్సి ఉందని.. నాని కూడా అందుబాటులోకి వచ్చి సినిమా మొదలవడానికి చాలా టైం పడుతుందని శైలేష్ తెలిపాడు. ఇక సైంధవ్ తర్వాత తన కొత్త చిత్రం గురించి మాట్లాడుతూ.. సైంధవ్ సక్సెస్ అయితే చంద్రప్రస్థ వరల్డ్ ను కొనసాగిస్తూ ఇంకో సినిమా చెయ్యాలని అనుకుంటున్నానని.. అలాగే తన జీవితంలోని వాస్తవ ఘటనల ఆధారంగా ఒక మంచి ప్రేమ కథను రాశానని, దానిమీద కూడా ఓ సినిమా తీయాల్సి ఉందని శైలేష్ తెలిపాడు.
సైంధవ్ రిజల్ట్ ను బట్టి తన కొత్త చిత్రం ఖరారు అవుతుందని అతను చెప్పాడు. వెంకటేష్, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటించిన సైంధవ్ ఈ నెల 13న విడుదల కానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on January 10, 2024 2:56 pm
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…
వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…
గజ్వేల్ నియోజకవర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట. అయితే.. ఇక్కడే పాగా వేయాలని.. వచ్చే…
తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…
అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…