Movie News

రేర్ మూమెంట్.. త్రివిక్రమ్ కళ్ళలో నీళ్ళు

మంగళవారం రాత్రి గుంటూరు సిటీలో జరిగిన గుంటూరు కారం ప్రి రిలీజ్ ఈవెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అందుకు ఈవెంట్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట, గొడవలు మాత్రమే కారణం కాదు. ఈ వేడుకలో ఇద్దరు ముఖ్య వ్యక్తులు చాలా ఎమోషనల్ గా కనిపించారు. చాలా ఉద్వేగంగానూ మాట్లాడారు. ఆ ఇద్దరే హీరో మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.

మహేష్ బాబు ఎన్నడూ లేనంత ఎమోషనల్ అవ్వడానికి కారణాలు లేకపోలేదు. ఆయన ఎంతో ఇష్టపడే తల్లిదండ్రులు కృష్ణ, ఇందిర ఏడాది వ్యవధిలో కన్నుమూశారు. అదే సమయంలో తన సోదరుడు రమేష్ బాబుని కూడా ఆయన కోల్పోయారు. ఈ ముగ్గురు దూరమయ్యాక జరుగుతున్న తొలి మహేష్ సినిమా వేడుక గుంటూరు కారందే. అందుకే మహేష్ బాబు ఎంతో ఉద్వేగంగా మాట్లాడుతూ ఇకపై అభిమానులే తన అమ్మ నాన్న అనేశాడు. అయితే ఇదే వేడుకలో త్రివిక్రమ్ సైతం ఎమోషనల్ అయి, కళ్ళలో నీళ్లు పెట్టుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.

ప్రి రిలీజ్ ఈవెంట్లో ఆయా సినిమాలకు సంబంధించి ముఖ్య వ్యక్తుల ఏవీలు ప్రదర్శించడం మామూలే. ఇందులోనూ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు సంబంధించి ఏవీని ప్రదర్శించారు. అయితే అది చూస్తూ.. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చాం అని తన జర్నీ అంతా గుర్తు చేసుకున్నాడో ఏమో.. ఎన్నడూ లేని విధంగా త్రివిక్రమ్ కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడు. మరీ ఏడ్చేయడం లాంటిది ఏమీ చెయ్యలేదు కానీ.. ఆయన కళ్ళలోని తడి మాత్రం కెమెరాలకు కనిపించింది. ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అనంతరం స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు కూడా త్రివిక్రమ్ కొంచెం ఎమోషనల్ గానే కనిపించాడు. హీరో మహేష్ బాబును ప్రశంసల్లో ముంచెత్తుతూ సాగిన ఆయన ప్రసంగం అభిమానులను ఆకట్టుకుంది.

This post was last modified on January 10, 2024 10:28 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తన దర్శకులపై ప్రభాస్ ప్రేమే వేరు

కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…

2 hours ago

మనసు మార్చుకున్న రామ్

యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…

3 hours ago

నెత్తుటి క్లబ్బులో ‘కల్ట్’ విధ్వంసం

వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…

3 hours ago

చిరు – బాలయ్య మల్టీస్టారర్ కల నెరవేరుతుందా?

కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…

4 hours ago

కామారెడ్డిలో ఏం జరుగుతోంది?

కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ సర్పంచ్ కారును బీజేపీ కార్యకర్తలు…

4 hours ago

19 ఏళ్ల త‌ర్వాత‌.. అయేషా అంత్య‌క్రియ‌లు.. ఏం జరిగింది?

అయేషా మీరా. ఉమ్మ‌డి ఏపీలో 2007లో ఓ వ్య‌క్తి కామ దాహానికి బ‌లి అయిపోయిన బీఫార్మసీ విద్యార్థిని. ఈ కేసులో…

7 hours ago