Movie News

రేర్ మూమెంట్.. త్రివిక్రమ్ కళ్ళలో నీళ్ళు

మంగళవారం రాత్రి గుంటూరు సిటీలో జరిగిన గుంటూరు కారం ప్రి రిలీజ్ ఈవెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అందుకు ఈవెంట్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట, గొడవలు మాత్రమే కారణం కాదు. ఈ వేడుకలో ఇద్దరు ముఖ్య వ్యక్తులు చాలా ఎమోషనల్ గా కనిపించారు. చాలా ఉద్వేగంగానూ మాట్లాడారు. ఆ ఇద్దరే హీరో మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.

మహేష్ బాబు ఎన్నడూ లేనంత ఎమోషనల్ అవ్వడానికి కారణాలు లేకపోలేదు. ఆయన ఎంతో ఇష్టపడే తల్లిదండ్రులు కృష్ణ, ఇందిర ఏడాది వ్యవధిలో కన్నుమూశారు. అదే సమయంలో తన సోదరుడు రమేష్ బాబుని కూడా ఆయన కోల్పోయారు. ఈ ముగ్గురు దూరమయ్యాక జరుగుతున్న తొలి మహేష్ సినిమా వేడుక గుంటూరు కారందే. అందుకే మహేష్ బాబు ఎంతో ఉద్వేగంగా మాట్లాడుతూ ఇకపై అభిమానులే తన అమ్మ నాన్న అనేశాడు. అయితే ఇదే వేడుకలో త్రివిక్రమ్ సైతం ఎమోషనల్ అయి, కళ్ళలో నీళ్లు పెట్టుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.

ప్రి రిలీజ్ ఈవెంట్లో ఆయా సినిమాలకు సంబంధించి ముఖ్య వ్యక్తుల ఏవీలు ప్రదర్శించడం మామూలే. ఇందులోనూ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు సంబంధించి ఏవీని ప్రదర్శించారు. అయితే అది చూస్తూ.. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చాం అని తన జర్నీ అంతా గుర్తు చేసుకున్నాడో ఏమో.. ఎన్నడూ లేని విధంగా త్రివిక్రమ్ కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడు. మరీ ఏడ్చేయడం లాంటిది ఏమీ చెయ్యలేదు కానీ.. ఆయన కళ్ళలోని తడి మాత్రం కెమెరాలకు కనిపించింది. ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అనంతరం స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు కూడా త్రివిక్రమ్ కొంచెం ఎమోషనల్ గానే కనిపించాడు. హీరో మహేష్ బాబును ప్రశంసల్లో ముంచెత్తుతూ సాగిన ఆయన ప్రసంగం అభిమానులను ఆకట్టుకుంది.

This post was last modified on January 10, 2024 10:28 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సునీల్ వెనుక వైసీపీ రాజకీయ వర్గాల్లో చర్చ

వివాదాస్పద ఐపీఎస్ సునీల్ కుమార్ వ్యవహారం అందరికీ తెలిసిందే. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజును కస్టోడియల్ విచారణలో చేయి చేసుకున్నారన్న…

11 minutes ago

బాలయ్యతో వస్తే మోగ్లికే మంచిది

అఖండ 2 వాయిదా వ్యవహారం డిసెంబర్ 12 విడుదల కావాల్సిన వేరే సినిమాల మీద ప్రభావం చూపించింది. సైక్ సిద్దార్థ్…

26 minutes ago

ఎన్నికల వరకు ఓర్చుకోండి అని జగన్ సూచన?

వైసీపీ నాయకులకు జగన్ తరచుగా హితవు పలుకుతున్నారు. ఎన్నికల వరకు ఓర్చుకోవాలని చెబుతున్నారు. దీనికి కారణం కొందరు ప్రస్తుతం కేసుల్లో…

32 minutes ago

పవన్ చెప్పే స‌నాత‌న ధ‌ర్మ బోర్డు.. ప్రభుత్వం స్థాపించగలదా?

``స‌నాత‌న ధ‌ర్మ బోర్డును సాధ్య‌మైనంత వేగంగా ఏర్పాటు చేయాలి.`` తాజాగా జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రోసారి…

39 minutes ago

అఖండకు ఆలస్యమనే విషం అమృతంగా మారింది

గత వారం చివరి నిమిషంలో విడుదల వాయిదా పడిన అఖండ 2 ఇప్పుడు డిసెంబర్ 12 రావడం అంతా మంచికే…

59 minutes ago

అక్కర్లేని వివాదం ఎందుకు హృతిక్

భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంటుంది కానీ దానికి సహేతుకమైన కారణం ఆమోదం దక్కుతుంది. సోషల్ మీడియా కాలంలో దీని…

2 hours ago