Movie News

రేర్ మూమెంట్.. త్రివిక్రమ్ కళ్ళలో నీళ్ళు

మంగళవారం రాత్రి గుంటూరు సిటీలో జరిగిన గుంటూరు కారం ప్రి రిలీజ్ ఈవెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అందుకు ఈవెంట్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట, గొడవలు మాత్రమే కారణం కాదు. ఈ వేడుకలో ఇద్దరు ముఖ్య వ్యక్తులు చాలా ఎమోషనల్ గా కనిపించారు. చాలా ఉద్వేగంగానూ మాట్లాడారు. ఆ ఇద్దరే హీరో మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.

మహేష్ బాబు ఎన్నడూ లేనంత ఎమోషనల్ అవ్వడానికి కారణాలు లేకపోలేదు. ఆయన ఎంతో ఇష్టపడే తల్లిదండ్రులు కృష్ణ, ఇందిర ఏడాది వ్యవధిలో కన్నుమూశారు. అదే సమయంలో తన సోదరుడు రమేష్ బాబుని కూడా ఆయన కోల్పోయారు. ఈ ముగ్గురు దూరమయ్యాక జరుగుతున్న తొలి మహేష్ సినిమా వేడుక గుంటూరు కారందే. అందుకే మహేష్ బాబు ఎంతో ఉద్వేగంగా మాట్లాడుతూ ఇకపై అభిమానులే తన అమ్మ నాన్న అనేశాడు. అయితే ఇదే వేడుకలో త్రివిక్రమ్ సైతం ఎమోషనల్ అయి, కళ్ళలో నీళ్లు పెట్టుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.

ప్రి రిలీజ్ ఈవెంట్లో ఆయా సినిమాలకు సంబంధించి ముఖ్య వ్యక్తుల ఏవీలు ప్రదర్శించడం మామూలే. ఇందులోనూ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు సంబంధించి ఏవీని ప్రదర్శించారు. అయితే అది చూస్తూ.. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చాం అని తన జర్నీ అంతా గుర్తు చేసుకున్నాడో ఏమో.. ఎన్నడూ లేని విధంగా త్రివిక్రమ్ కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడు. మరీ ఏడ్చేయడం లాంటిది ఏమీ చెయ్యలేదు కానీ.. ఆయన కళ్ళలోని తడి మాత్రం కెమెరాలకు కనిపించింది. ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అనంతరం స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు కూడా త్రివిక్రమ్ కొంచెం ఎమోషనల్ గానే కనిపించాడు. హీరో మహేష్ బాబును ప్రశంసల్లో ముంచెత్తుతూ సాగిన ఆయన ప్రసంగం అభిమానులను ఆకట్టుకుంది.

This post was last modified on January 10, 2024 10:28 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మూర్తిగారు చెప్పింది అక్షరాలా నిజాలు

పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారు మనసులో ఏదీ దాచుకోరు. ఫిల్టర్ లేకుండా మాట్లాడేస్తారు. నిన్న హైదరాబాద్ లో దాసరి…

26 minutes ago

ఆ ఇద్దరు సీఎంలకు మరో ఛాన్స్ ఉన్నట్టే!

దేశంలో హోరాహోరీగా సాగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల క్రతువు ముగిసింది. బెంగాల్, తమిళనాడు, కేరళలలో ప్రభుత్వాలు మారిపోయాయి. ఈ…

27 minutes ago

విజయ్ మాత్రమే కాదు.. డ్రైవర్ కొడుకు కూడా

నిన్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. వీటిలో అత్యంత చర్చనీయాంశం అవుతున్నది తమిళనాడు ఫలితం గురించే. ఎందుకంటే…

36 minutes ago

విజ‌య్‌కు క‌లిసి వ‌చ్చిందేంటి?

త‌మిళ‌నాట ఎవ‌రి అంచ‌నాకు అంద‌ని విదంగా ద‌ళ‌ప‌తి విజ‌య్ ప్ర‌స్తుత అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. ఆయ‌న అధికారంలోకి…

59 minutes ago

ఎన్టీఆర్, ఎంజీఆర్.. మధ్యలో విజయ్

దేశంలో సినిమా వాళ్లను దేవుళ్లలా ఆరాధించి, వారికి రాజకీయాల్లోనూ అద్భుత ఫలితాలు అందించడంలో దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ ముందుంటాయి.…

3 hours ago

రెండు హిట్లిచ్చి మాయ‌మైపోయిన హీరో

ఆర్ఎక్స్ 100 సినిమాతో ఓవ‌ర్ నైట్ సెన్సేష‌న్ అయిపోయాడు యువ క‌థానాయ‌కుడు కార్తికేయ గుమ్మ‌కొండ‌. అప్ప‌టికే ప్రేమ‌తో మీ కార్తీక్…

5 hours ago