టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో టాప్ ప్లేస్ లో ఉన్న శ్రీలీలకు ఎల్లుండి పెద్ద పరీక్షే ఎదురుకానుంది. మొదటిసారి సూపర్ స్టార్ మహేష్ బాబుతో జోడి కట్టిన గుంటూరు కారం భారీ అంచనాలతో విడుదలవుతోంది. అభిమానులే కాదు సగటు ప్రేక్షకులు కూడా దీని మీద విపరీతమైన ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏకంగా సూపర్ స్టారే స్టేజి మీద వేలాది మంది చూస్తుండగా, కోట్లాది మంది టీవీ, ఆన్ లైన్ లో వీక్షిస్తుండగా శ్రీలీలతో డాన్స్ చేస్తే హీరోలకు తాట ఊడిపోతుందని చెప్పడం కన్నా గొప్ప కితాబు ఇంకేముంటుందని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.
మాములుగా మహేష్ తన ఈవెంట్లలో హీరోయిన్లను మెచ్చుకోవడం సహజమే కానీ మరీ ఇంత ఎలివేషన్ గతంలో ఎప్పుడూ ఇవ్వలేదు. ఆ మాటకొస్తే ఊర మాస్ గా తను డాన్స్ చేసి ఎంత కాలమయ్యిందో. ఎప్పుడో పోకిరి తర్వాత మళ్ళీ అంత ఎనర్జీని వాడుకున్న దర్శకుడు లేడు. గుంటూరు కారం అలాంటి కథ కావడం, కమర్షియల్ అంశాలను పుష్కలంగా దట్టించి మాస్ తో విజిల్స్ వేయించే పాటలు పెట్టడం వగైరా కారణాలతో పాటు తన సినిమాల్లో సందేశాలు ఎక్కువయ్యాయని ఫీలవుతున్న ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టేందుకు పూర్తిగా మేకోవర్ కావడం అంచనాలను అమాంతం పెంచేసింది.
ఇది బ్లాక్ బస్టర్ కావడం శ్రీలీలకు చాలా కీలకం. భగవంత్ కేసరిని మినహాయిస్తే తనకు మూడు డిజాస్టర్లు ఎదురయ్యాయి. స్కంద, ఆదికేశవ, ఎక్స్ ట్రాడినరి మ్యాన్ మూడు ఒకదాన్ని మించి మరొకటి దెబ్బేశాయి. అందులో ఆమెకు తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా పాటలకు పరిమితం చేశారు. కానీ త్రివిక్రమ్ డైరెక్షన్ లో మెయిన్ హీరోయిన్ కి మంచి స్కోప్ ఉంటుంది. కారం తింటున్న వాళ్లకు తీపి పంచుతానని చెబుతున్న శ్రీలీల ఇందులో బెస్ట్ డాన్స్ మూమెంట్స్ ఇచ్చిందనే టాక్ యూనిట్ లో ఉంది. ఇది కనక ఘనవిజయం అందుకుంటే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది.
This post was last modified on January 10, 2024 10:10 am
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…