టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో టాప్ ప్లేస్ లో ఉన్న శ్రీలీలకు ఎల్లుండి పెద్ద పరీక్షే ఎదురుకానుంది. మొదటిసారి సూపర్ స్టార్ మహేష్ బాబుతో జోడి కట్టిన గుంటూరు కారం భారీ అంచనాలతో విడుదలవుతోంది. అభిమానులే కాదు సగటు ప్రేక్షకులు కూడా దీని మీద విపరీతమైన ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏకంగా సూపర్ స్టారే స్టేజి మీద వేలాది మంది చూస్తుండగా, కోట్లాది మంది టీవీ, ఆన్ లైన్ లో వీక్షిస్తుండగా శ్రీలీలతో డాన్స్ చేస్తే హీరోలకు తాట ఊడిపోతుందని చెప్పడం కన్నా గొప్ప కితాబు ఇంకేముంటుందని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.
మాములుగా మహేష్ తన ఈవెంట్లలో హీరోయిన్లను మెచ్చుకోవడం సహజమే కానీ మరీ ఇంత ఎలివేషన్ గతంలో ఎప్పుడూ ఇవ్వలేదు. ఆ మాటకొస్తే ఊర మాస్ గా తను డాన్స్ చేసి ఎంత కాలమయ్యిందో. ఎప్పుడో పోకిరి తర్వాత మళ్ళీ అంత ఎనర్జీని వాడుకున్న దర్శకుడు లేడు. గుంటూరు కారం అలాంటి కథ కావడం, కమర్షియల్ అంశాలను పుష్కలంగా దట్టించి మాస్ తో విజిల్స్ వేయించే పాటలు పెట్టడం వగైరా కారణాలతో పాటు తన సినిమాల్లో సందేశాలు ఎక్కువయ్యాయని ఫీలవుతున్న ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టేందుకు పూర్తిగా మేకోవర్ కావడం అంచనాలను అమాంతం పెంచేసింది.
ఇది బ్లాక్ బస్టర్ కావడం శ్రీలీలకు చాలా కీలకం. భగవంత్ కేసరిని మినహాయిస్తే తనకు మూడు డిజాస్టర్లు ఎదురయ్యాయి. స్కంద, ఆదికేశవ, ఎక్స్ ట్రాడినరి మ్యాన్ మూడు ఒకదాన్ని మించి మరొకటి దెబ్బేశాయి. అందులో ఆమెకు తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా పాటలకు పరిమితం చేశారు. కానీ త్రివిక్రమ్ డైరెక్షన్ లో మెయిన్ హీరోయిన్ కి మంచి స్కోప్ ఉంటుంది. కారం తింటున్న వాళ్లకు తీపి పంచుతానని చెబుతున్న శ్రీలీల ఇందులో బెస్ట్ డాన్స్ మూమెంట్స్ ఇచ్చిందనే టాక్ యూనిట్ లో ఉంది. ఇది కనక ఘనవిజయం అందుకుంటే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది.
This post was last modified on January 10, 2024 10:10 am
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…