టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో టాప్ ప్లేస్ లో ఉన్న శ్రీలీలకు ఎల్లుండి పెద్ద పరీక్షే ఎదురుకానుంది. మొదటిసారి సూపర్ స్టార్ మహేష్ బాబుతో జోడి కట్టిన గుంటూరు కారం భారీ అంచనాలతో విడుదలవుతోంది. అభిమానులే కాదు సగటు ప్రేక్షకులు కూడా దీని మీద విపరీతమైన ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏకంగా సూపర్ స్టారే స్టేజి మీద వేలాది మంది చూస్తుండగా, కోట్లాది మంది టీవీ, ఆన్ లైన్ లో వీక్షిస్తుండగా శ్రీలీలతో డాన్స్ చేస్తే హీరోలకు తాట ఊడిపోతుందని చెప్పడం కన్నా గొప్ప కితాబు ఇంకేముంటుందని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.
మాములుగా మహేష్ తన ఈవెంట్లలో హీరోయిన్లను మెచ్చుకోవడం సహజమే కానీ మరీ ఇంత ఎలివేషన్ గతంలో ఎప్పుడూ ఇవ్వలేదు. ఆ మాటకొస్తే ఊర మాస్ గా తను డాన్స్ చేసి ఎంత కాలమయ్యిందో. ఎప్పుడో పోకిరి తర్వాత మళ్ళీ అంత ఎనర్జీని వాడుకున్న దర్శకుడు లేడు. గుంటూరు కారం అలాంటి కథ కావడం, కమర్షియల్ అంశాలను పుష్కలంగా దట్టించి మాస్ తో విజిల్స్ వేయించే పాటలు పెట్టడం వగైరా కారణాలతో పాటు తన సినిమాల్లో సందేశాలు ఎక్కువయ్యాయని ఫీలవుతున్న ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టేందుకు పూర్తిగా మేకోవర్ కావడం అంచనాలను అమాంతం పెంచేసింది.
ఇది బ్లాక్ బస్టర్ కావడం శ్రీలీలకు చాలా కీలకం. భగవంత్ కేసరిని మినహాయిస్తే తనకు మూడు డిజాస్టర్లు ఎదురయ్యాయి. స్కంద, ఆదికేశవ, ఎక్స్ ట్రాడినరి మ్యాన్ మూడు ఒకదాన్ని మించి మరొకటి దెబ్బేశాయి. అందులో ఆమెకు తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా పాటలకు పరిమితం చేశారు. కానీ త్రివిక్రమ్ డైరెక్షన్ లో మెయిన్ హీరోయిన్ కి మంచి స్కోప్ ఉంటుంది. కారం తింటున్న వాళ్లకు తీపి పంచుతానని చెబుతున్న శ్రీలీల ఇందులో బెస్ట్ డాన్స్ మూమెంట్స్ ఇచ్చిందనే టాక్ యూనిట్ లో ఉంది. ఇది కనక ఘనవిజయం అందుకుంటే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది.
This post was last modified on January 10, 2024 10:10 am
కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…
యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…
వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…
కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…
కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ సర్పంచ్ కారును బీజేపీ కార్యకర్తలు…
అయేషా మీరా. ఉమ్మడి ఏపీలో 2007లో ఓ వ్యక్తి కామ దాహానికి బలి అయిపోయిన బీఫార్మసీ విద్యార్థిని. ఈ కేసులో…