ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయంగా కుదుపునకు కారణమైన వ్యూహం సినిమా విడుదల విషయం ఇంకా కోర్టు మెట్లు దిగి కిందికి రాలేదు. ఈ సినిమాను గత నెల 29నే విడుదల చేయనున్నట్టు సినిమా యూనిట్ ప్రకటించినా.. న్యాయపరమైన చిక్కులు ఇంకా తొలిగిపోలేదు. ఈ సినిమాలో టీడీపీ అధినేత చంద్రబాబును దారుణంగా చిత్రీకరించారని ఆరోపిస్తూ.. ఆయన కుమారుడు టీడీపీ నేత నారా లోకేష్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
దీనిపై విచారణ కొనసాగుతూనే ఉంది. తాజాగా తెలంగాణ హైకోర్టులో జరిగిన విచారణలో న్యాయమూర్తి.. ప్రత్యేకంగా కమిటీ వేసుకుని.. దీనిపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఈ కమిటీలో ఇటు పిటిషనర్ తరఫు వారు.. అటు ప్రతివాదులైన చిత్ర యూనిట్, నిర్మాత ఉండాలని పేర్కొంది. అయితే.. కమిటీలో ఎవరెవరు ఉండాలన్నది పిటిషనర్, ప్రతివాదులు కలిసి నిర్ణయం తీసుకోవచ్చిని కూడా హైకోర్ట్ ఆదేశించింది. దీనిపై వెంటనే తమకు తేల్చి చెప్పాలని పేర్కొంది.
ఈ చిత్రాన్ని సదరు యూనిట్ సభ్యులు వీక్షించి.. ఒక నిర్ణయానికి రావాలని.. ఇది రహస్యంగా జరగాలని.. ఎవరి నివేదికను వారే స్వయంగా కోర్టుకు సమర్పించాలని సూచించింది. అయితే.. ఇలా కమిటీని ఏర్పాటు చేసి.. వ్యూహం సినిమాను చూపించి కమిటీ తీసుకునే నిర్ణయం మేరకు సినిమాపై నిర్ణయం తీసుకుంటామన్న హైకోర్టు వాదనలను ఇటు సెన్సార్ బోర్డు, అటు చిత్ర యూనిట్ రెండూ అంగీకరించలేదు.
ఇప్పటికే సెన్సార్ బోర్డు ఈ సినిమాను వీక్షించి సర్టిఫికేట్ కూడా అందించిందని.. ఈ విషయంలో కమిటీని ఏర్పాటు చేయడం సరికాదని ప్రతివాదుల తరఫున న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. దీంతో ఈ కేసును ఇప్పట్లో తేల్చ లేమని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఫలితంగా వ్యూహం సినిమాకు ఎదురైన న్యాయపరమైన చిక్కులు ఇప్పట్లో తొలిగిపోయేలా కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on January 9, 2024 2:08 pm
తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష,…
గుజరాత్లో చాందిపుర వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర…
సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. తమ సినిమాలను ప్రమోట్ చేయడం కోసం తెలుగు రాష్ట్రాలకు…
మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…
నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…