ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయంగా కుదుపునకు కారణమైన వ్యూహం సినిమా విడుదల విషయం ఇంకా కోర్టు మెట్లు దిగి కిందికి రాలేదు. ఈ సినిమాను గత నెల 29నే విడుదల చేయనున్నట్టు సినిమా యూనిట్ ప్రకటించినా.. న్యాయపరమైన చిక్కులు ఇంకా తొలిగిపోలేదు. ఈ సినిమాలో టీడీపీ అధినేత చంద్రబాబును దారుణంగా చిత్రీకరించారని ఆరోపిస్తూ.. ఆయన కుమారుడు టీడీపీ నేత నారా లోకేష్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
దీనిపై విచారణ కొనసాగుతూనే ఉంది. తాజాగా తెలంగాణ హైకోర్టులో జరిగిన విచారణలో న్యాయమూర్తి.. ప్రత్యేకంగా కమిటీ వేసుకుని.. దీనిపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఈ కమిటీలో ఇటు పిటిషనర్ తరఫు వారు.. అటు ప్రతివాదులైన చిత్ర యూనిట్, నిర్మాత ఉండాలని పేర్కొంది. అయితే.. కమిటీలో ఎవరెవరు ఉండాలన్నది పిటిషనర్, ప్రతివాదులు కలిసి నిర్ణయం తీసుకోవచ్చిని కూడా హైకోర్ట్ ఆదేశించింది. దీనిపై వెంటనే తమకు తేల్చి చెప్పాలని పేర్కొంది.
ఈ చిత్రాన్ని సదరు యూనిట్ సభ్యులు వీక్షించి.. ఒక నిర్ణయానికి రావాలని.. ఇది రహస్యంగా జరగాలని.. ఎవరి నివేదికను వారే స్వయంగా కోర్టుకు సమర్పించాలని సూచించింది. అయితే.. ఇలా కమిటీని ఏర్పాటు చేసి.. వ్యూహం సినిమాను చూపించి కమిటీ తీసుకునే నిర్ణయం మేరకు సినిమాపై నిర్ణయం తీసుకుంటామన్న హైకోర్టు వాదనలను ఇటు సెన్సార్ బోర్డు, అటు చిత్ర యూనిట్ రెండూ అంగీకరించలేదు.
ఇప్పటికే సెన్సార్ బోర్డు ఈ సినిమాను వీక్షించి సర్టిఫికేట్ కూడా అందించిందని.. ఈ విషయంలో కమిటీని ఏర్పాటు చేయడం సరికాదని ప్రతివాదుల తరఫున న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. దీంతో ఈ కేసును ఇప్పట్లో తేల్చ లేమని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఫలితంగా వ్యూహం సినిమాకు ఎదురైన న్యాయపరమైన చిక్కులు ఇప్పట్లో తొలిగిపోయేలా కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on January 9, 2024 2:08 pm
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…