ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయంగా కుదుపునకు కారణమైన వ్యూహం సినిమా విడుదల విషయం ఇంకా కోర్టు మెట్లు దిగి కిందికి రాలేదు. ఈ సినిమాను గత నెల 29నే విడుదల చేయనున్నట్టు సినిమా యూనిట్ ప్రకటించినా.. న్యాయపరమైన చిక్కులు ఇంకా తొలిగిపోలేదు. ఈ సినిమాలో టీడీపీ అధినేత చంద్రబాబును దారుణంగా చిత్రీకరించారని ఆరోపిస్తూ.. ఆయన కుమారుడు టీడీపీ నేత నారా లోకేష్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
దీనిపై విచారణ కొనసాగుతూనే ఉంది. తాజాగా తెలంగాణ హైకోర్టులో జరిగిన విచారణలో న్యాయమూర్తి.. ప్రత్యేకంగా కమిటీ వేసుకుని.. దీనిపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఈ కమిటీలో ఇటు పిటిషనర్ తరఫు వారు.. అటు ప్రతివాదులైన చిత్ర యూనిట్, నిర్మాత ఉండాలని పేర్కొంది. అయితే.. కమిటీలో ఎవరెవరు ఉండాలన్నది పిటిషనర్, ప్రతివాదులు కలిసి నిర్ణయం తీసుకోవచ్చిని కూడా హైకోర్ట్ ఆదేశించింది. దీనిపై వెంటనే తమకు తేల్చి చెప్పాలని పేర్కొంది.
ఈ చిత్రాన్ని సదరు యూనిట్ సభ్యులు వీక్షించి.. ఒక నిర్ణయానికి రావాలని.. ఇది రహస్యంగా జరగాలని.. ఎవరి నివేదికను వారే స్వయంగా కోర్టుకు సమర్పించాలని సూచించింది. అయితే.. ఇలా కమిటీని ఏర్పాటు చేసి.. వ్యూహం సినిమాను చూపించి కమిటీ తీసుకునే నిర్ణయం మేరకు సినిమాపై నిర్ణయం తీసుకుంటామన్న హైకోర్టు వాదనలను ఇటు సెన్సార్ బోర్డు, అటు చిత్ర యూనిట్ రెండూ అంగీకరించలేదు.
ఇప్పటికే సెన్సార్ బోర్డు ఈ సినిమాను వీక్షించి సర్టిఫికేట్ కూడా అందించిందని.. ఈ విషయంలో కమిటీని ఏర్పాటు చేయడం సరికాదని ప్రతివాదుల తరఫున న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. దీంతో ఈ కేసును ఇప్పట్లో తేల్చ లేమని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఫలితంగా వ్యూహం సినిమాకు ఎదురైన న్యాయపరమైన చిక్కులు ఇప్పట్లో తొలిగిపోయేలా కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు.
ఏపీలోని కూటమి సర్కారు ఇటీవలే నిర్వహించిన మెగా డీఎస్సీపై విపక్ష వైసీపీ బారీ అవినీతి ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.…
పెద్ది ప్రీమియర్ల గురించి ఇండస్ట్రీ వర్గాల్లో, అభిమానుల్లో ఎడతెగని చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో క్లారిటీ వచ్చేసింది. రాత్రి 8…
దృశ్యం 3 ప్రపంచవ్యాప్తంగా రెండు వందల కోట్ల గ్రాస్ దాటేసింది. కేవలం పది రోజుల్లోపే ఈ ఫీట్ సాధించడం అనూహ్యం.…
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజకీయాలకు కొత్తే. సినిమా నటుడిగా సుదీర్ఘ కాలం పాటు కొనసాగుతున్న…
తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప దర్శకుల్లో ఒకరు దాసరి నారాయణరావు. అగ్ర దర్శకుడిగా ఉంటూ 150 సినిమాలు తీయడం…
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యాలయం వద్ద శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్…