టాలీవుడ్ లోనే కాదు అన్ని భాషల్లోనూ చూసుకున్నా అత్యంత ఖరీదైన ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న కల్కి ఏడి 2898 విడుదల తేదీని లాక్ చేసుకున్నట్టు తెలిసింది. అధికారికంగా ఇంకా ప్రకటించలేదు కానీ మే 9న మొదటి భాగాన్ని ప్రపంచానికి చూపించాలని డిసైడయ్యారట. ఈ డేట్ వెనుక వైజయంతి మూవీస్ కి ఒక సెంటిమెంట్ ఉంది. 1990 ఇదే రోజు జగదేకవీరుడు అతిలోకసుందరి ఒక ల్యాండ్ మార్క్ మూవీగా చరిత్రలో నిలిచిపోయింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని తుఫాను ముంచెత్తిన సమయంలో రికార్డుల వర్షం కురిపించి బ్లాక్ బస్టర్ కొట్టింది.
చిరంజీవి కెరీర్ బెస్ట్ టాప్ 5లో దీని స్థానం చాలా ప్రత్యేకం. మళ్ళీ 2018లో మహానటి మే 9న వచ్చి గొప్ప విజయాన్ని అందుకుంది. స్టార్ హీరో లేకుండా విషాదమైన సావిత్రి బయోపిక్ లో కీర్తి సురేష్ ని చూపించిన తీరు కమర్షియల్ గానూ అద్భుతాలు సాధించి ఎన్నో అవార్డులు తీసుకొచ్చింది. దర్శకుడు నాగ అశ్విన్ ప్రతిభ గొప్పదనం తెలిసింది ఆ రోజే. ఇలా తమ బ్యానర్ కు మెమరబుల్ డేట్ గా మారిపోయిన మే 9కే కల్కిని రిలీజ్ చేయాలని దాదాపు ఖరారు చేసుకున్నట్టు సమాచారం. అఫీషియల్ గా సంక్రాంతి పండక్కు ప్రకటించే ఛాన్స్ ఉంది. అప్పటిదాకా ఇది అనధికార వార్తే.
ఇదే జరిగితే సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ వచ్చిన కేవలం అయిదు నెలల లోపే ఇంకో ప్రభాస్ సినిమా చూసే ఛాన్స్ అభిమానులకు దక్కుతుంది. కల్కిని అంతర్జాతీయ స్థాయిలో ప్రమోషన్ చేస్తున్న నాగ అశ్విన్ బృందం ఫిబ్రవరి నుంచి దీన్ని ఇంకో రేంజ్ కి తీసుకెళ్ళబోతున్నారు. సినిమాలో భాగమైన కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, దిశా పటాని తదితరులతో భారీ ఎత్తున ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ మీడియాలో హైలైట్ అయ్యేలా చూసుకుంటున్నారు. మరి మే 9న కల్కి వస్తాడో రాదో ఇంకో రెండు మూడు రోజుల్లో తేలిపోతుంది. చూద్దాం
This post was last modified on January 9, 2024 10:11 am
ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో కథానాయికగా నటిస్తూనే.. ఇంకోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ మెరుస్తోంది కీర్తి సురేష్. మహానటి తర్వాత…
విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జరిగినా పరిస్థితి…
తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు ప్రదీప్ రావత్ హఠాత్తుగా కన్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండరీ…
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…
రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…
ఏపీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు.…