Movie News

రాజమౌళికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్: కీరవాణి

ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయి దాటిపోయింది. దీని తర్వాత రాజమౌళి చేయబోతున్న సినిమా మహేష్ తోనే అన్నది తెలిసిన సంగతే. అయితే ఆ సినిమా ఎప్పుడు సెట్స్ మీదికి వెళ్తుంది అన్న క్లారిటీ లేదు. దీని గురించి టీమంతా మౌనం వహిస్తోంది. మీడియాకు కూడా చిక్కడం లేదు. అయితే రాజమౌళి ఆస్థాన సంగీత దర్శకుడు అయిన కీరవాణి.. తన కొత్త చిత్రం నా సామి రంగ సంక్రాంతికి విడుదలవుతున్న నేపథ్యంలో మీడియాను కలిశారు.

ఈ సందర్భంగా ఆయనకు రాజమౌళి మహేష్ సినిమా గురించి ప్రశ్నలు మీడియా నుంచి ఎదురయ్యాయి. దానికి ఆయన తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకున్నారు. ఈ సినిమా గురించి అడిగేందుకు రాజమౌళికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోందని ఆయన చమత్కరించారు. అంటే ఈ చిత్రానికి సంబంధించి తన పని ఇంకా మొదలుకాలేదు అని అర్థమని ఆయన అన్నారు.

ఇక తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి చెబుతూ.. చిరంజీవి సినిమా (విశ్వంభర) పని నడుస్తోందని.. హరిహర వీరమల్లుకు సంబంధించి మూడు పాటలు పూర్తయ్యాక బ్రేక్ వచ్చిందని.. మళ్లీ క్రిష్ అడిగినప్పుడు ఈ సినిమా పని మొదలు పెడతానని కీరవాణి చెప్పారు. నా సామి రంగ కు సంబంధించి మ్యూజికల్ ఔట్ పుట్ విషయంలో సంతృప్తిగా ఉన్నానని తాను చేసిన నాగార్జునతో చేసిన ప్రెసిడెంట్ గారి పెళ్ళాం వైబ్ ఈ మూవీలో కనిపించిందని.. ఆ సినిమాలాగే ఇది కూడా హిట్ అవుతుందని కీరవాణి ధీమా వ్యక్తం చేశారు. సంగీత పరంగా ఈ మధ్యకాలంలో తనకు నచ్చిన సినిమాల గురించి చెబుతూ.. జైలర్ లో అనిరుధ్ వర్క్ బాగా నచ్చి అతనికి మెసేజ్ కూడా పెట్టానని.. అలాగే యానిమల్ సినిమా మ్యూజిక్ కూడా తనకు ఎంతో నచ్చిందనీ కీరవాణి తెలిపారు

Satya

Recent Posts

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

5 minutes ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

6 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

6 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

6 hours ago

ఎడిట‌ర్‌ను సైకో అన్న నిర్మాత‌

త‌న సినిమాకు ప‌ని చేసిన టెక్నీషియ‌న్‌ను ఒక నిర్మాత సైకోగా అభివ‌ర్ణించ‌డం ఎప్పుడైనా చూశారా? సితార ఎంట‌ర్టైన్మెంట్స్ అధినేత నాగ‌వంశీ…

6 hours ago

టికెట్ రేట్ల విషయంలో ‘లెనిన్’ ఆదర్శం

శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…

8 hours ago