నిన్న జరిగిన హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమాకు అమ్ముడుపోయే ప్రతి టికెట్ మీద 5 రూపాయలు అయోధ్య రామాలయానికి విరాళం ఇస్తామని టీమ్ ప్రకటించింది. తాము చెబితే అంత రీచ్ కాదని భావించి ఏకంగా గెస్టుగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవితో ప్రకటన ఇప్పించారు. దీంతో ఇది సహజంగానే నేషనల్ మీడియాలో ఎక్కువ కవరేజ్ కి నోచుకుంది. జనవరి 22 ప్రారంభం కాబోతున్న రాముడి గుడికి ఇప్పటికిప్పుడు చందాలు ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనం కన్నా దూర దృష్టితో ప్రశాంత్ వర్మ బృందం చేసిన ఆలోచన వెనుక పలు లాభాలు, ఇబ్బందులు రెండూ కనిపిస్తున్నాయి.
రాముడి సెంటిమెంట్ దేశమంతా వీస్తున్న టైంలో ఇలా టికెట్ మీద అయిదు రూపాయలు రాముడికి వెళ్తుందనే మాట భక్తి పరంగా ప్రేక్షకుల మనసుల్లోకి బలంగా వెళ్తుంది. ఆ డబ్బులు ముట్టడం కోసం టికెట్ కొంటారని కాదు కానీ, ఎలాగూ దైవబలం గురించి చెప్పే సినిమా కాబట్టి చూస్తే పోలా అనుకునే ఆడియన్స్ లక్షల నుంచి కోట్లకు చేరుకోవచ్చు. ఇబ్బంది విషయానికి వస్తే ఆదిపురుష్ టైంలో ఒక సీటు హనుమంతుడికి ఖాళీ ఉంచాలని ఊదరగొట్టిన టి సిరీస్ బ్యాచ్ తర్వాత టాక్ వచ్చాక హఠాత్తుగా సైలెంట్ అయిపోయింది. అది పాటించారో లేదో కూడా తెలియనంతగా పట్టించుకోకుండా వదిలేశారు.
ఇప్పుడు హనుమాన్ కి అలా చేయకూడదు. రోజువారీ గ్రాస్ ని చూసుకుంటూ, ఎన్ని టికెట్లు అమ్ముడయ్యాయో ఎప్పటికప్పుడు దాన్ని సమాచార రూపంలో మీడియాకు ప్రేక్షకులకు తెలియజేయడం ద్వారా, ఫైనల్ గా ఎంత మొత్తం అయోధ్యకు వెళ్తుందో క్లారిటీ ఇవ్వడం ద్వారా కామెంట్స్ రాకుండా చూసుకోవచ్చు. గుంటూరు కారంతో క్లాష్ వల్ల ఏపీ, తెలంగాణలో థియేటర్ల కొరత ఎదురుకుంటున్న హనుమాన్ భారమంతా ఉత్తరాది రాష్ట్రాల మీద ఉంది. ఎలాగూ చెప్పుకోదగ్గ బాలీవుడ్ రిలీజ్ లేకపోవడం చాలా ప్లస్ కానుంది. ఒక్క మెర్రి క్రిస్మస్ మాత్రమే రేస్ లో ఉండటం హనుమాన్ కి కలిసొచ్చే పెద్ద అంశం.
This post was last modified on January 8, 2024 12:16 pm
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…