నిన్న జరిగిన హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమాకు అమ్ముడుపోయే ప్రతి టికెట్ మీద 5 రూపాయలు అయోధ్య రామాలయానికి విరాళం ఇస్తామని టీమ్ ప్రకటించింది. తాము చెబితే అంత రీచ్ కాదని భావించి ఏకంగా గెస్టుగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవితో ప్రకటన ఇప్పించారు. దీంతో ఇది సహజంగానే నేషనల్ మీడియాలో ఎక్కువ కవరేజ్ కి నోచుకుంది. జనవరి 22 ప్రారంభం కాబోతున్న రాముడి గుడికి ఇప్పటికిప్పుడు చందాలు ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనం కన్నా దూర దృష్టితో ప్రశాంత్ వర్మ బృందం చేసిన ఆలోచన వెనుక పలు లాభాలు, ఇబ్బందులు రెండూ కనిపిస్తున్నాయి.
రాముడి సెంటిమెంట్ దేశమంతా వీస్తున్న టైంలో ఇలా టికెట్ మీద అయిదు రూపాయలు రాముడికి వెళ్తుందనే మాట భక్తి పరంగా ప్రేక్షకుల మనసుల్లోకి బలంగా వెళ్తుంది. ఆ డబ్బులు ముట్టడం కోసం టికెట్ కొంటారని కాదు కానీ, ఎలాగూ దైవబలం గురించి చెప్పే సినిమా కాబట్టి చూస్తే పోలా అనుకునే ఆడియన్స్ లక్షల నుంచి కోట్లకు చేరుకోవచ్చు. ఇబ్బంది విషయానికి వస్తే ఆదిపురుష్ టైంలో ఒక సీటు హనుమంతుడికి ఖాళీ ఉంచాలని ఊదరగొట్టిన టి సిరీస్ బ్యాచ్ తర్వాత టాక్ వచ్చాక హఠాత్తుగా సైలెంట్ అయిపోయింది. అది పాటించారో లేదో కూడా తెలియనంతగా పట్టించుకోకుండా వదిలేశారు.
ఇప్పుడు హనుమాన్ కి అలా చేయకూడదు. రోజువారీ గ్రాస్ ని చూసుకుంటూ, ఎన్ని టికెట్లు అమ్ముడయ్యాయో ఎప్పటికప్పుడు దాన్ని సమాచార రూపంలో మీడియాకు ప్రేక్షకులకు తెలియజేయడం ద్వారా, ఫైనల్ గా ఎంత మొత్తం అయోధ్యకు వెళ్తుందో క్లారిటీ ఇవ్వడం ద్వారా కామెంట్స్ రాకుండా చూసుకోవచ్చు. గుంటూరు కారంతో క్లాష్ వల్ల ఏపీ, తెలంగాణలో థియేటర్ల కొరత ఎదురుకుంటున్న హనుమాన్ భారమంతా ఉత్తరాది రాష్ట్రాల మీద ఉంది. ఎలాగూ చెప్పుకోదగ్గ బాలీవుడ్ రిలీజ్ లేకపోవడం చాలా ప్లస్ కానుంది. ఒక్క మెర్రి క్రిస్మస్ మాత్రమే రేస్ లో ఉండటం హనుమాన్ కి కలిసొచ్చే పెద్ద అంశం.
This post was last modified on January 8, 2024 12:16 pm
వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…
జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…
రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటనలు చేస్తానంటే ఆయనకు భారీ పారితోషకం ఇవ్వడానికి బోలెడన్ని కంపెనీలు ముందుకు వస్తాయి. కానీ…
గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…
టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…