Movie News

5 రూపాయల విరాళం వెనుక దూర దృష్టి

నిన్న జరిగిన హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమాకు అమ్ముడుపోయే ప్రతి టికెట్ మీద 5 రూపాయలు అయోధ్య రామాలయానికి విరాళం ఇస్తామని టీమ్ ప్రకటించింది. తాము చెబితే అంత రీచ్ కాదని భావించి ఏకంగా గెస్టుగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవితో ప్రకటన ఇప్పించారు. దీంతో ఇది సహజంగానే నేషనల్ మీడియాలో ఎక్కువ కవరేజ్ కి నోచుకుంది. జనవరి 22 ప్రారంభం కాబోతున్న రాముడి గుడికి ఇప్పటికిప్పుడు చందాలు ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనం కన్నా దూర దృష్టితో ప్రశాంత్ వర్మ బృందం చేసిన ఆలోచన వెనుక పలు లాభాలు, ఇబ్బందులు రెండూ కనిపిస్తున్నాయి.

రాముడి సెంటిమెంట్ దేశమంతా వీస్తున్న టైంలో ఇలా టికెట్ మీద అయిదు రూపాయలు రాముడికి వెళ్తుందనే మాట భక్తి పరంగా ప్రేక్షకుల మనసుల్లోకి బలంగా వెళ్తుంది. ఆ డబ్బులు ముట్టడం కోసం టికెట్ కొంటారని కాదు కానీ, ఎలాగూ దైవబలం గురించి చెప్పే సినిమా కాబట్టి చూస్తే పోలా అనుకునే ఆడియన్స్ లక్షల నుంచి కోట్లకు చేరుకోవచ్చు. ఇబ్బంది విషయానికి వస్తే ఆదిపురుష్ టైంలో ఒక సీటు హనుమంతుడికి ఖాళీ ఉంచాలని ఊదరగొట్టిన టి సిరీస్ బ్యాచ్ తర్వాత టాక్ వచ్చాక హఠాత్తుగా సైలెంట్ అయిపోయింది. అది పాటించారో లేదో కూడా తెలియనంతగా పట్టించుకోకుండా వదిలేశారు.

ఇప్పుడు హనుమాన్ కి అలా చేయకూడదు. రోజువారీ గ్రాస్ ని చూసుకుంటూ, ఎన్ని టికెట్లు అమ్ముడయ్యాయో ఎప్పటికప్పుడు దాన్ని సమాచార రూపంలో మీడియాకు ప్రేక్షకులకు తెలియజేయడం ద్వారా, ఫైనల్ గా ఎంత మొత్తం అయోధ్యకు వెళ్తుందో క్లారిటీ ఇవ్వడం ద్వారా కామెంట్స్ రాకుండా చూసుకోవచ్చు. గుంటూరు కారంతో క్లాష్ వల్ల ఏపీ, తెలంగాణలో థియేటర్ల కొరత ఎదురుకుంటున్న హనుమాన్ భారమంతా ఉత్తరాది రాష్ట్రాల మీద ఉంది. ఎలాగూ చెప్పుకోదగ్గ బాలీవుడ్ రిలీజ్ లేకపోవడం చాలా ప్లస్ కానుంది. ఒక్క మెర్రి క్రిస్మస్ మాత్రమే రేస్ లో ఉండటం హనుమాన్ కి కలిసొచ్చే పెద్ద అంశం.

This post was last modified on January 8, 2024 12:16 pm

Share
Show comments

Recent Posts

ప్రాంతీయ పార్టీల్లో టీడీపీదే అగ్రస్థానం

దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…

35 minutes ago

‘పాదయాత్ర చేసినా వైఎస్ వారసులు కాలేరు’

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పాద‌యాత్ర…

49 minutes ago

ఈ బీజేపీ ఎంపీకి ఏమైంది?

ధర్మపురి అరవింద్.. తండ్రి కాంగ్రెస్ పార్టీతో ఉన్నా తాను మాత్రం బీజేపీలో సొంతంగా ఎంపీ స్థాయికి ఎదిగిన నేత. బీఆర్ఎస్…

1 hour ago

కొణిదెల నిహారిక: ఫ్రేమ్ మారినా, గ్లామర్ మాత్రం అలాగే..

యాంకర్‌గా మొదలై, హీరోయిన్‌గా తెరపై కనిపించి, ఇప్పుడు నిర్మాతగా మారింది నిహారిక కొణిదెల. ప్రతి దశలోనూ కొత్తగా ట్రై చేస్తూనే…

1 hour ago

తారక్ అభిమానులు లైట్ తీసుకున్నారు

స్టార్ హీరోల ఫ్యాన్స్ ఎమోషన్స్ క్యాష్ చేసుకోవడానికి ఈ మధ్య డిస్ట్రిబ్యూటర్లు వాడుతున్న ఆయుధం రీ రిలీజులు. ఏదో కొత్త…

4 hours ago

బీజేపీ కేంద్ర మంత్రికి కాంగ్రెస్ ఎంపీ మద్దతు

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ఫ్యామిలీ ఇప్పుడు పెను వివాదంలో చిక్కుకుంది. మంత్రి కుమారుడు బండి భగీరథ్ ఓ…

4 hours ago