Movie News

ఈవెంట్ మార్పు వెనుక ఏవేవో ప్రచారాలు

విపరీతమైన చర్చలు, కాలయాపనలు, విన్నపాల తర్వాత గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ నుంచి గుంటూరుకి తరలిపోయింది. సెలబ్రిటీ ఈవెంట్స్ కి అనుమతులు ఇవ్వడంలో తెలంగాణ పోలీస్ కఠిన వైఖరి అవలంభించడంతో ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక టాలీవుడ్ వైఖరి తాము కోరుకున్నంత సానుకూలంగా లేదని, చిరంజీవి నాగార్జున లాంటి ఒకరిద్దరు తప్ప మిగిలిన సెలబ్రిటీలు సిఎం రేవంత్ రెడ్డిని కలవలేదనే కోణాన్ని కొందరు వెలికి తీస్తున్నారు. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కేవలం ప్రొడ్యూసర్లు కలిశారు.

ఈ పరిణామాల వెనుక నిజానిజాలు ఎవరూ నిర్ధారించలేరు కానీ ఎట్టకేలకు గుంటూరుకి ఈవెంట్ ని షిఫ్ట్ చేయడంలో టీమ్ సక్సెస్ అయ్యింది. రేపు నంబూరు క్రాస్ లో ఉన్న పెట్రోల్ బంక్ పక్కన భారీ మైదానంలో ఆఘమేఘాల మీద ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఇప్పుడు వేదిక మారడం గుంటూరు వెళ్ళడానికి అనుకూలంగా ఉన్న ఏపీ ఫ్యాన్స్ కి సంతోషంగా ఉంది. తెలంగాణ అభిమానులు అంత దూరం వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ప్రత్యేకంగా స్పెషల్ గెస్టులు ఎవరూ రావడం లేదు కానీ స్టేజి మీద మహేష్ బాబు, శ్రీలీల, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏం మాట్లాడతారనే దాని మీద ఆసక్తి నెలకొంది.

ట్రైలర్ ఎలాగూ వచ్చేసింది కాబట్టి దాని మీద పెద్ద సస్పెన్స్ లేదు కానీ ఈవెంట్ స్పీచుల మీదే అందరి దృష్టి నెలకొంది. కేవలం మూడు రోజుల ముందు చేయాల్సిన ఒత్తిడిలో గుంటూరు కారం టీమ్ ఉరుకులు పరుగులు పెడుతోంది. ఒకపక్క థియేటర్ల ఇష్యూస్ ని చూసుకుంటూనే ఇంకోవైపు ఫంక్షన్ తాలూకు పనుల్లో నిర్మాత నాగవంశీ తలమునకలై ఉన్నారు. టైటిల్ కి సార్థకత చేకూరుస్తూ ఈవెంట్ ని గుంటూరులోనే చేయడం పట్ల ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. హనుమాన్ తో ఒకే రోజు బరిలో దిగుతున్న గుంటూరు కారం అత్యధిక సింగల్ స్క్రీన్లు, మల్టీప్లెక్సుల్లో వేట మొదలుపెట్టబోతున్నాడు.

This post was last modified on January 8, 2024 11:30 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

54 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago