థియేటర్ల సమస్యతో పాటు పోటీని నివారించాలనే ఉద్దేశంతో సంక్రాంతి బరి నుంచి రవితేజ ఈగల్ తప్పుకోవడం గురించి చర్చ జరిగిపోయి ఇప్పుడందరి దృష్టి కొత్త రిలీజుల మీద పడింది. ఇంత టైట్ గా ఉంది కాబట్టి డబ్బింగ్ సినిమాలకు చోటు లేదనే దిశగా ఫిలిం ఛాంబర్ సంకేతాలు ఇచ్చింది కానీ తాజాగా ఆయలాన్ కి అభయ హస్తం దొరికినట్టు ఇన్ సైడ్ టాక్. నిర్మాత దిల్ రాజు ఉత్తరాంధ్ర, నైజామ్ ఏరియాలకు సంబంధించిన థియేట్రికల్ హక్కులు కొన్నట్టు లేటెస్ట్ అప్డేట్. అగ్రిమెంట్ కుదిరిందని, స్క్రీన్ల సర్దుబాటు గురించి ఇంకో రెండు మూడు రోజుల్లో క్లారిటీ రావొచ్చని టాక్.
హనుమాన్ వదిలేసి, కొన్ని ప్రాంతాలకు సైంధవ్ ని పంపిణి చేస్తున్న సురేష్ బాబుని మినహాయిస్తే పండగ డిస్ట్రిబ్యూషన్ మొత్తం దాదాపు దిల్ రాజు చేతిలోనే ఉంది. ఇప్పుడు ఆయలాన్ కు ఆయన అందదండ అందించినా మరీ ఎక్కువ కాకపోయినా వీలైనన్ని డీసెంట్ స్క్రీన్లు దక్కేలా పావులు కదపగలరు. ఎలాగూ ఈగల్ తప్పుకుంది. దానికి బ్లాక్ చేసి ఉంచిన మూడు వందలకు పైగా థియేటర్లు ఇంకా మిగిలినవాటికి పంచలేదు. సో వాటిని ఇచ్చే క్రమంలో మధ్యలో ఆయలాన్ ని దూర్చడం పెద్ద విషయం కాదు. డబ్బింగ్ వెర్షన్ విషయంలో శివ కార్తికేయన్ పట్టుదలగా ఉన్నాట్ట.
అఫీషియల్ గా వచ్చే దాకా దీని తాలూకు పరిణామం ఎలా ఉండబోతోందనేది చెప్పలేం. ఆ మధ్య దిల్ రాజే మనకే చొక్కాలు చించుకుంటున్నప్పుడు డబ్బింగ్ సినిమాల గురించి ఎందుకు అడుగుతారని మీడియాని రివర్స్ లో అడిగారు. ఇప్పుడు ఆయలాన్ ఆయనే కొని మరీ రిలీజ్ చేస్తే అనూహ్యమే. గత ఏడాది వారసుడు టైంలోనూ ఇదే విషయంగా ఇబ్బందులు ఎదురుకుని మూడు రోజులు ఆలస్యంగా రిలీజ్ చేసిన సంగతి గుర్తే. అయినా సరే ప్రీమియమ్ స్క్రీన్లు దానికి పడ్డాయి. ఇప్పుడు అయలాన్ కి అదే స్ట్రాటజీ ఫాలో అవుతారా లేక జనవరి 12కే దింపుతారా వెయిట్ అండ్ సి.
This post was last modified on January 7, 2024 7:00 pm
ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…
హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్రభుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్నడూ లేని విధంగా కళ్లు చెదిరే…
హైదరాబాద్లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…
ప్రతి సంవత్సరం లాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. దీనికి మెగా…
వైసీపీ అధినేత జగన్కు సోదరుడి వరుసయ్యే కడప ఎంపీ.. వైఎస్ అవినాష్ రెడ్డి నివాసం నుంచి ఎన్ ఫోర్స్ మెంటు…
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…