థియేటర్ల సమస్యతో పాటు పోటీని నివారించాలనే ఉద్దేశంతో సంక్రాంతి బరి నుంచి రవితేజ ఈగల్ తప్పుకోవడం గురించి చర్చ జరిగిపోయి ఇప్పుడందరి దృష్టి కొత్త రిలీజుల మీద పడింది. ఇంత టైట్ గా ఉంది కాబట్టి డబ్బింగ్ సినిమాలకు చోటు లేదనే దిశగా ఫిలిం ఛాంబర్ సంకేతాలు ఇచ్చింది కానీ తాజాగా ఆయలాన్ కి అభయ హస్తం దొరికినట్టు ఇన్ సైడ్ టాక్. నిర్మాత దిల్ రాజు ఉత్తరాంధ్ర, నైజామ్ ఏరియాలకు సంబంధించిన థియేట్రికల్ హక్కులు కొన్నట్టు లేటెస్ట్ అప్డేట్. అగ్రిమెంట్ కుదిరిందని, స్క్రీన్ల సర్దుబాటు గురించి ఇంకో రెండు మూడు రోజుల్లో క్లారిటీ రావొచ్చని టాక్.
హనుమాన్ వదిలేసి, కొన్ని ప్రాంతాలకు సైంధవ్ ని పంపిణి చేస్తున్న సురేష్ బాబుని మినహాయిస్తే పండగ డిస్ట్రిబ్యూషన్ మొత్తం దాదాపు దిల్ రాజు చేతిలోనే ఉంది. ఇప్పుడు ఆయలాన్ కు ఆయన అందదండ అందించినా మరీ ఎక్కువ కాకపోయినా వీలైనన్ని డీసెంట్ స్క్రీన్లు దక్కేలా పావులు కదపగలరు. ఎలాగూ ఈగల్ తప్పుకుంది. దానికి బ్లాక్ చేసి ఉంచిన మూడు వందలకు పైగా థియేటర్లు ఇంకా మిగిలినవాటికి పంచలేదు. సో వాటిని ఇచ్చే క్రమంలో మధ్యలో ఆయలాన్ ని దూర్చడం పెద్ద విషయం కాదు. డబ్బింగ్ వెర్షన్ విషయంలో శివ కార్తికేయన్ పట్టుదలగా ఉన్నాట్ట.
అఫీషియల్ గా వచ్చే దాకా దీని తాలూకు పరిణామం ఎలా ఉండబోతోందనేది చెప్పలేం. ఆ మధ్య దిల్ రాజే మనకే చొక్కాలు చించుకుంటున్నప్పుడు డబ్బింగ్ సినిమాల గురించి ఎందుకు అడుగుతారని మీడియాని రివర్స్ లో అడిగారు. ఇప్పుడు ఆయలాన్ ఆయనే కొని మరీ రిలీజ్ చేస్తే అనూహ్యమే. గత ఏడాది వారసుడు టైంలోనూ ఇదే విషయంగా ఇబ్బందులు ఎదురుకుని మూడు రోజులు ఆలస్యంగా రిలీజ్ చేసిన సంగతి గుర్తే. అయినా సరే ప్రీమియమ్ స్క్రీన్లు దానికి పడ్డాయి. ఇప్పుడు అయలాన్ కి అదే స్ట్రాటజీ ఫాలో అవుతారా లేక జనవరి 12కే దింపుతారా వెయిట్ అండ్ సి.
This post was last modified on January 7, 2024 7:00 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…