సంక్రాంతి రేసులో చివరిగా జనవరి 14 విడుదల కాబోతున్న నా సామిరంగ మీద మెల్లగా హైప్ పెరుగుతోంది. పక్కా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో నాగార్జున సినిమా చేసి చాలా కాలం కావడంతో అక్కినేని అభిమానుల అంచనాలు మాములుగా లేవు. పైగా తమ హీరో ఇంత కసితో వేగంగా పూర్తి చేయడం వెనుక నమ్మకానికి ముచ్చటపడిపోయి బ్లాక్ బస్టరని ఫిక్స్ అయిపోయారు. పోటీ ఎంత ఉన్నప్పటికీ గతంలో బంగార్రాజు, సోగ్గాడే చిన్ని నాయనలు కాంపిటీషన్ లోనే విజేతగా నిలిచాయి కానీ ఈసారి కూడా ఫలితం రిపీట్ అవుతుందన్న ధీమా ఫ్యాన్స్ లో బలంగా కనిపిస్తోంది. టీమ్ కూడా అలాగే ఉంది.
ఇది మలయాళం హిట్ మూవీ పోరంజు మరియం జోస్ రీమేకన్న విషయం తెలిసిందే. అయితే ఒరిజినల్ ని యథాతధంగా తీయలేదు. రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ ఒరిజినల్ వెర్షన్ లో లేని కమర్షియల్ అంశాలు మన ఆడియన్స్ అభిరుచులకు అనుగుణంగా మార్చాడు. ముఖ్యంగా అక్కడి క్లైమాక్స్ లో హ్యాపీ ఎండింగ్ ఉండదు. అలా చేస్తే టాలీవుడ్ ప్రేక్షకులు రిసీవ్ చేసుకోకపోయే ప్రమాదం ఉంది. గతంలో స్నేహమంటే ఇదేరా విషయంలో నాగార్జునకి ఇది అనుభవమే. అందుకే అలాంటి పొరపాటు జరగకుండా దర్శకుడు విజయ్ బిన్నీతో సాఫీ ముగింపుని ప్లాన్ చేశారట.
సో ఈ మార్పు ఏ మేరకు పేలిందనేది తెరమీద చూడాలి. హీరోయిన్ ఆశికా రంగనాథ్ పాత్ర ఏదో మాములుగా పాటలు, లవ్ ట్రాక్ కోసం ఉండదు. అసలు మలుపులన్నీ ఆమె చుట్టే తిరుగుతాయి. ఈ విషయంలోనూ విజయ్ బిన్నీ తీసుకున్న జాగ్రత్తలు స్క్రీన్ మీద బాగా వచ్చాయని టాక్. రేపు సెన్సార్ ఫార్మాలిటీ పూర్తి చేసుకోబోతున్న నా సామిరంగకు ఇంకో రెండు రోజుల్లో ప్రమోషన్ స్పీడ్ పెంచబోతున్నారు. ముఖ్యంగా మాస్ ని లక్ష్యంగా చేసుకుని ఓపెనింగ్స్ భారీగా వచ్చేలా స్కెచ్ వేస్తున్నారు. మొదటి ఆట పడేలోపే మిగిలిన మూడు సినిమాల జాతకం తెలిసిపోవడం నాగ్ కు కలిసి వస్తుంది.
This post was last modified on January 7, 2024 4:23 pm
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…