సంక్రాంతి రేసులో చివరిగా జనవరి 14 విడుదల కాబోతున్న నా సామిరంగ మీద మెల్లగా హైప్ పెరుగుతోంది. పక్కా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో నాగార్జున సినిమా చేసి చాలా కాలం కావడంతో అక్కినేని అభిమానుల అంచనాలు మాములుగా లేవు. పైగా తమ హీరో ఇంత కసితో వేగంగా పూర్తి చేయడం వెనుక నమ్మకానికి ముచ్చటపడిపోయి బ్లాక్ బస్టరని ఫిక్స్ అయిపోయారు. పోటీ ఎంత ఉన్నప్పటికీ గతంలో బంగార్రాజు, సోగ్గాడే చిన్ని నాయనలు కాంపిటీషన్ లోనే విజేతగా నిలిచాయి కానీ ఈసారి కూడా ఫలితం రిపీట్ అవుతుందన్న ధీమా ఫ్యాన్స్ లో బలంగా కనిపిస్తోంది. టీమ్ కూడా అలాగే ఉంది.
ఇది మలయాళం హిట్ మూవీ పోరంజు మరియం జోస్ రీమేకన్న విషయం తెలిసిందే. అయితే ఒరిజినల్ ని యథాతధంగా తీయలేదు. రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ ఒరిజినల్ వెర్షన్ లో లేని కమర్షియల్ అంశాలు మన ఆడియన్స్ అభిరుచులకు అనుగుణంగా మార్చాడు. ముఖ్యంగా అక్కడి క్లైమాక్స్ లో హ్యాపీ ఎండింగ్ ఉండదు. అలా చేస్తే టాలీవుడ్ ప్రేక్షకులు రిసీవ్ చేసుకోకపోయే ప్రమాదం ఉంది. గతంలో స్నేహమంటే ఇదేరా విషయంలో నాగార్జునకి ఇది అనుభవమే. అందుకే అలాంటి పొరపాటు జరగకుండా దర్శకుడు విజయ్ బిన్నీతో సాఫీ ముగింపుని ప్లాన్ చేశారట.
సో ఈ మార్పు ఏ మేరకు పేలిందనేది తెరమీద చూడాలి. హీరోయిన్ ఆశికా రంగనాథ్ పాత్ర ఏదో మాములుగా పాటలు, లవ్ ట్రాక్ కోసం ఉండదు. అసలు మలుపులన్నీ ఆమె చుట్టే తిరుగుతాయి. ఈ విషయంలోనూ విజయ్ బిన్నీ తీసుకున్న జాగ్రత్తలు స్క్రీన్ మీద బాగా వచ్చాయని టాక్. రేపు సెన్సార్ ఫార్మాలిటీ పూర్తి చేసుకోబోతున్న నా సామిరంగకు ఇంకో రెండు రోజుల్లో ప్రమోషన్ స్పీడ్ పెంచబోతున్నారు. ముఖ్యంగా మాస్ ని లక్ష్యంగా చేసుకుని ఓపెనింగ్స్ భారీగా వచ్చేలా స్కెచ్ వేస్తున్నారు. మొదటి ఆట పడేలోపే మిగిలిన మూడు సినిమాల జాతకం తెలిసిపోవడం నాగ్ కు కలిసి వస్తుంది.
This post was last modified on January 7, 2024 4:23 pm
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…