సంక్రాంతి రేసులో చివరిగా జనవరి 14 విడుదల కాబోతున్న నా సామిరంగ మీద మెల్లగా హైప్ పెరుగుతోంది. పక్కా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో నాగార్జున సినిమా చేసి చాలా కాలం కావడంతో అక్కినేని అభిమానుల అంచనాలు మాములుగా లేవు. పైగా తమ హీరో ఇంత కసితో వేగంగా పూర్తి చేయడం వెనుక నమ్మకానికి ముచ్చటపడిపోయి బ్లాక్ బస్టరని ఫిక్స్ అయిపోయారు. పోటీ ఎంత ఉన్నప్పటికీ గతంలో బంగార్రాజు, సోగ్గాడే చిన్ని నాయనలు కాంపిటీషన్ లోనే విజేతగా నిలిచాయి కానీ ఈసారి కూడా ఫలితం రిపీట్ అవుతుందన్న ధీమా ఫ్యాన్స్ లో బలంగా కనిపిస్తోంది. టీమ్ కూడా అలాగే ఉంది.
ఇది మలయాళం హిట్ మూవీ పోరంజు మరియం జోస్ రీమేకన్న విషయం తెలిసిందే. అయితే ఒరిజినల్ ని యథాతధంగా తీయలేదు. రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ ఒరిజినల్ వెర్షన్ లో లేని కమర్షియల్ అంశాలు మన ఆడియన్స్ అభిరుచులకు అనుగుణంగా మార్చాడు. ముఖ్యంగా అక్కడి క్లైమాక్స్ లో హ్యాపీ ఎండింగ్ ఉండదు. అలా చేస్తే టాలీవుడ్ ప్రేక్షకులు రిసీవ్ చేసుకోకపోయే ప్రమాదం ఉంది. గతంలో స్నేహమంటే ఇదేరా విషయంలో నాగార్జునకి ఇది అనుభవమే. అందుకే అలాంటి పొరపాటు జరగకుండా దర్శకుడు విజయ్ బిన్నీతో సాఫీ ముగింపుని ప్లాన్ చేశారట.
సో ఈ మార్పు ఏ మేరకు పేలిందనేది తెరమీద చూడాలి. హీరోయిన్ ఆశికా రంగనాథ్ పాత్ర ఏదో మాములుగా పాటలు, లవ్ ట్రాక్ కోసం ఉండదు. అసలు మలుపులన్నీ ఆమె చుట్టే తిరుగుతాయి. ఈ విషయంలోనూ విజయ్ బిన్నీ తీసుకున్న జాగ్రత్తలు స్క్రీన్ మీద బాగా వచ్చాయని టాక్. రేపు సెన్సార్ ఫార్మాలిటీ పూర్తి చేసుకోబోతున్న నా సామిరంగకు ఇంకో రెండు రోజుల్లో ప్రమోషన్ స్పీడ్ పెంచబోతున్నారు. ముఖ్యంగా మాస్ ని లక్ష్యంగా చేసుకుని ఓపెనింగ్స్ భారీగా వచ్చేలా స్కెచ్ వేస్తున్నారు. మొదటి ఆట పడేలోపే మిగిలిన మూడు సినిమాల జాతకం తెలిసిపోవడం నాగ్ కు కలిసి వస్తుంది.
This post was last modified on January 7, 2024 4:23 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…