ఓవర్సీస్ లో గుంటూరు కారం రికార్డుల వేట మొదలైపోయింది. అయిదు వేలకు పైగా ప్రీమియర్ షోలతో అర మిలియన్ మార్కుకి అతి దగ్గరగా ఉన్న మహేష్ బాబు ఆ లాంఛనాన్ని ఇంకొన్ని గంటల్లో పూర్తి చేస్తాడు. ఇంకా రిలీజ్ కు ఆరు రోజుల సమయం ఉంది కాబట్టి మార్కు ఎక్కడ ఆగుతుందో ఇప్పుడే చెప్పడం కష్టం. జనవరి 12 హైదరాబాద్ తో సహా నైజామ్ లో భారీ రిలీజ్ కు ప్లాన్ చేయడంతో మొదటి రోజే 90 సింగల్ స్క్రీన్లలో అరాచకం సృష్టించబోతున్నాడు. సలార్ టైంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా బుక్ మై షో ఈసారి ముందస్తు జాగ్రత్తగా సర్వర్లను అప్ గ్రేడ్ చేసుకుని మరీ సిద్ధంగా ఉందని సమాచారం.
ఇలా విధ్వంసం ఒకవైపు కొనసాగుతుండగా ఇంకోవైపు ప్రీ రిలీజ్ ఈవెంట్ తాలూకు అయోమయం తీరడం లేదు. అనుమతులు వచ్చి ఉంటే ఇవాళ సాయంత్రమే యూసఫ్ గూడలో వేడుక జరిగేది. కానీ సెక్యూరిటీ కారణాల దృష్ట్యా పోలీసులు ఇవ్వలేదు. పోనీ రేపు ఆదివారం చేద్దామంటే ఒకే టైంలో సాయంత్రం వైజాగ్ లో సైంధవ్, హైదరాబాద్ లో హనుమాన్ ఈవెంట్లు జరుగుతున్నాయి. వాటితో క్లాష్ కావడం కరెక్ట్ కాదు. అందుకే సోమవారం నుంచి బుధవారం మధ్యలో ఏదో ఒక డేట్ ని లాక్ చేసుకోవాలి. ముహుర్తాలు గట్రా చూసుకోవాలి కాబట్టి అది తేల్చే విషయంలో త్రివిక్రమ్ గట్టి చర్చల్లో ఉన్నారట.
ట్రైలర్ ని రేపు రిలీజ్ చేసే ప్రతిపాదన ఉంది కానీ అది ఈవెంట్ లో చేస్తేనే కిక్ ఉంటుందన్న అభిప్రాయంలో నిర్మాత నాగవంశీ ఉన్నందు వల్ల ఏ ప్రకటన వెంటనే ఇవ్వలేకపోతున్నారు. ఒకవేళ కన్ఫర్మ్ చేసుకుంటే అప్పటికప్పుడు వదిలేందుకు పోస్టర్లను సిద్ధంగా ఉంచుకున్నారు. ప్రస్తుతం ఈవెంట్ అనుమతుల కోసం ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. వీక్ డేస్ అయినా పర్వాలేదనుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. ఏపీ తెలంగాణకు సంబంధించి గుంటూరు కారం అడ్వాన్స్ బుకింగ్స్ ని జనవరి 9 సాయంత్రం నుంచి మొదలు కావొచ్చు. మహేష్ మేనియా మాత్రం మాములుగా లేదు.
This post was last modified on January 6, 2024 5:31 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…