స్వార్థపూరిత రాజకీయ ఉద్దేశాలతో రామ్ గోపాల్ వర్మ వ్యూహం తీశారని తెదేపా తరపున నారా లోకేష్ వేసిన పిటీషన్ వల్ల కోర్టు తీర్పుతో విడుదల వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. చాలా స్పష్టంగా చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ లను టార్గెట్ చేసుకుని దారుణంగా వ్యక్తిత్వ హననం చేసేలా సినిమా ఉన్నట్టు ట్రైలర్లతోనే అందరికీ అర్థమైపోయింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గొప్పదనాన్ని మాత్రమే హైలైట్ చేసుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదు కానీ అపోజిషన్ లో ఉన్న నాయకులను చులకనగా చూపించడం ఖచ్చితంగా ఖండించాల్సిన విషయమే.
ఇప్పుడు అందరి దృష్టి యాత్ర 2 మీదకు వెళ్తోంది. వర్మ అంత ఘాటుగా కాకపోయినా మహి వి రాఘవ్ సైతం జగన్ మీద కుట్రలో ఎందరో భాగమయ్యారని చూపించే ప్రయత్నం చేయడం ట్రైలర్ లో కనిపించింది. సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడులకు చాలా దగ్గరగా పోలిన ఆర్టిస్టులను తీసుకోవడం, నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్ ని అంటూ ప్రధాన పాత్రధారి జీవాతో అనిపించడం వెనుక పొలిటికల్ మైలేజ్ తప్ప మరో కారణం ఉండదు. అయితే యాత్ర టైంలో రాని అభ్యంతరాలు ఇప్పుడు వస్తాయా అంటే సున్నితంగా మారిపోయిన పరిస్థితుల్లో రావొచ్చేమో.
ఫిబ్రవరి 8 విడుదల తేదీ ఇచ్చారు కానీ ఈగల్ కి సోలో డేట్ వచ్చేలా సహకరిస్తామని చెప్పిన ఫిలిం ఛాంబర్ మాట మేరకు యాత్ర మేకర్స్ వాయిదా ఏమైనా ఆలోచిస్తారేమో చూడాలి. టిల్లు స్క్వేర్ రేస్ నుంచి తప్పుకుంది. ఒకవేళ ఎలాంటి అబ్జెక్షన్లు రాకపోతే యాత్ర 2 చెప్పిన డేట్ కే రావొచ్చు. ఎందుకంటే అప్పటికి ఎన్నికలు చాలా దగ్గరగా ఉంటాయి కానీ సినిమా తాలూకు ప్రయోజనం దక్కాలంటే ఆ నెలలోనే రావాలి. పోటీ వల్ల వసూళ్లు ప్రభావితం చెందినా లేక తగ్గినా దాని గురించి నిర్మాతలు టెన్షన్ పడకపోవచ్చు. ఎందుకంటే ప్రచారాస్త్రంగా రూపొందుతున్న యాత్ర 2 టార్గెట్ కేవలం థియేటరే కాదు కాబట్టి.
This post was last modified on January 5, 2024 9:48 pm
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…