సంక్రాంతి సినిమాల రిలీజ్ డేట్ లో విషయంలో ఎంత పెద్ద పంచాయతీ నడిచిందో తెలిసిందే. కొన్ని వారాలుగా నడుస్తున్న ఈ పంచాయితీకి ఈ గురువారం సాయంత్రం తెరదించినట్లే కనిపించింది నిర్మాతల మండలి. ఈగల్ సినిమాను సంక్రాంతి రేసు నుంచి తప్పించడంతో.. నాలుగు సినిమాలకు థియేటర్ల సర్దుబాటు దాదాపు ఒక కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది.
ఈగల్ సినిమాకు సోలో డేట్ ఇప్పిస్తాం అన్న హామీ ప్రకారమే ఫిబ్రవరి 9ని ఓకే చేయించారు. ఆ రోజు రావాల్సిన టిల్లు స్క్వేర్ సినిమాను వాయిదా వేసుకోవడానికి గుంటూరు కారం నిర్మాత నాగ వంశీ అంగీకరించారు. ఇంతటితో వ్యవహారం సద్దుమణిగిందని అందరూ భావించారు. కానీ మరో పెద్ద నిర్మాత ఇప్పుడు లైన్లోకి వచ్చి కొత్త వివాదానికి తెర తీశారు. ఆ నిర్మాత ఎవరో కాదు ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర.
అనిల్ నిర్మాణంలో తెరకెక్కిన ఊరు పేరు భైరవకోన కూడా ఫిబ్రవరి 9నే విడుదల కావాల్సి ఉంది. ఈ మధ్య ఆ సినిమాకు రిలీజ్ డేట్ ప్రకటించారు. టిల్లు స్క్వేర్ మిడ్ రేంజ్ మూవీనే కావడంతో వాలెంటైన్స్ డే వీకెండ్లో దాంతో పోటీ పడడానికి ఊరి పేరు భైరవకోన సిద్ధమైంది. కానీ ఇప్పుడు టిల్లు స్క్వేర్ స్థానంలోకి ఈగల్ లాంటి పెద్ద సినిమా వచ్చింది.
సంక్రాంతి సినిమాల పంచాయతీ తెంచడానికి సమావేశమైన నిర్మాతలు తనను సంప్రదించనేలేదని.. వాళ్ల పాటికి వాళ్లు సోలో డేట్ అంటూ ఈగల్ టీంకు హామీ ఇచ్చేశారని.. తాము యధాప్రకారమే ఫిబ్రవరి 9న ఊరు పేరు భైరవకోన చిత్రాన్ని రిలీజ్ చేస్తామని అనిల్ సుంకర ప్రకటించారు. ఈ చిన్న సినిమాతో పోటీ తమకు పర్లేదని ఈగల్ టీం లైట్ తీసుకుంటుందా లేదంటే సోలో డేట్ హామీ ప్రకారం దాన్ని కూడా ఖాళీ చేయించాలని నిర్మాతల మండలిని డిమాండ్ చేస్తుందా అన్నది చూడాలి.
This post was last modified on January 5, 2024 4:57 pm
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…