సంక్రాంతి సినిమాల రిలీజ్ డేట్ లో విషయంలో ఎంత పెద్ద పంచాయతీ నడిచిందో తెలిసిందే. కొన్ని వారాలుగా నడుస్తున్న ఈ పంచాయితీకి ఈ గురువారం సాయంత్రం తెరదించినట్లే కనిపించింది నిర్మాతల మండలి. ఈగల్ సినిమాను సంక్రాంతి రేసు నుంచి తప్పించడంతో.. నాలుగు సినిమాలకు థియేటర్ల సర్దుబాటు దాదాపు ఒక కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది.
ఈగల్ సినిమాకు సోలో డేట్ ఇప్పిస్తాం అన్న హామీ ప్రకారమే ఫిబ్రవరి 9ని ఓకే చేయించారు. ఆ రోజు రావాల్సిన టిల్లు స్క్వేర్ సినిమాను వాయిదా వేసుకోవడానికి గుంటూరు కారం నిర్మాత నాగ వంశీ అంగీకరించారు. ఇంతటితో వ్యవహారం సద్దుమణిగిందని అందరూ భావించారు. కానీ మరో పెద్ద నిర్మాత ఇప్పుడు లైన్లోకి వచ్చి కొత్త వివాదానికి తెర తీశారు. ఆ నిర్మాత ఎవరో కాదు ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర.
అనిల్ నిర్మాణంలో తెరకెక్కిన ఊరు పేరు భైరవకోన కూడా ఫిబ్రవరి 9నే విడుదల కావాల్సి ఉంది. ఈ మధ్య ఆ సినిమాకు రిలీజ్ డేట్ ప్రకటించారు. టిల్లు స్క్వేర్ మిడ్ రేంజ్ మూవీనే కావడంతో వాలెంటైన్స్ డే వీకెండ్లో దాంతో పోటీ పడడానికి ఊరి పేరు భైరవకోన సిద్ధమైంది. కానీ ఇప్పుడు టిల్లు స్క్వేర్ స్థానంలోకి ఈగల్ లాంటి పెద్ద సినిమా వచ్చింది.
సంక్రాంతి సినిమాల పంచాయతీ తెంచడానికి సమావేశమైన నిర్మాతలు తనను సంప్రదించనేలేదని.. వాళ్ల పాటికి వాళ్లు సోలో డేట్ అంటూ ఈగల్ టీంకు హామీ ఇచ్చేశారని.. తాము యధాప్రకారమే ఫిబ్రవరి 9న ఊరు పేరు భైరవకోన చిత్రాన్ని రిలీజ్ చేస్తామని అనిల్ సుంకర ప్రకటించారు. ఈ చిన్న సినిమాతో పోటీ తమకు పర్లేదని ఈగల్ టీం లైట్ తీసుకుంటుందా లేదంటే సోలో డేట్ హామీ ప్రకారం దాన్ని కూడా ఖాళీ చేయించాలని నిర్మాతల మండలిని డిమాండ్ చేస్తుందా అన్నది చూడాలి.
This post was last modified on January 5, 2024 4:57 pm
ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి…
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…